ETV Bharat / city

తహసీల్దార్​ కార్యాలయంలో అనిశా సోదాలు..ఆన్​లైన్​ రికార్డుల పరిశీలన..

author img

By

Published : Apr 27, 2022, 3:22 PM IST

ACB Raids: వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటం తహసీల్దార్​ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తహసీల్దార్​ రామకుమారి పై వచ్చిన అభియోగాల మేరకు ఆమె హయాంలో జరిగిన భూ లావాదేవీలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు.

ACB raids in Sidhavatam Tahsildar office
ACB raids in Sidhavatam Tahsildar office

ACB Raids: వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటం తహసీల్దార్​ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కడప ఏసీబీ డీఎస్పీ కంజాక్షన్ ఆధ్వర్యంలో 20 మంది అధికారుల బృందం ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తోంది. తహసీల్దార్​ రామకుమారిపై వచ్చిన అభియోగాల మేరకు ఆమె హయాంలో జరిగిన భూ లావాదేవీల రికార్డులన్నింటినీ అనిశా అధికారులు పరిశీలిస్తున్నారు. ఆన్​లైన్​లో రికార్డుల వివరాలను ఆరా తీస్తున్నారు. పాసు పుస్తకాల మంజూరు, ఇతర సర్వేలకు సంబంధించిన వివరాలు, వివిధ ఇళ్ల స్థలాల మంజూరు తదితర వివరాలను కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. గత 3 ఏళ్లకు సంబంధించిన రికార్డులన్నింటినీ ఆన్​లైన్​లో ఏ విధంగా నమోదు చేశారని దానిపై వివరాలు సేకరిస్తున్నారు. వీటితోపాటు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలను కూడా విచారిస్తున్నారు. ఈ కార్యాలయానికి ఏ పని మీద ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు.. ఎందుకు జాప్యం జరుగుతోంది.. అనే వివరాలు తెలుసుకుంటున్నారు. సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి.

ACB Raids: వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటం తహసీల్దార్​ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కడప ఏసీబీ డీఎస్పీ కంజాక్షన్ ఆధ్వర్యంలో 20 మంది అధికారుల బృందం ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తోంది. తహసీల్దార్​ రామకుమారిపై వచ్చిన అభియోగాల మేరకు ఆమె హయాంలో జరిగిన భూ లావాదేవీల రికార్డులన్నింటినీ అనిశా అధికారులు పరిశీలిస్తున్నారు. ఆన్​లైన్​లో రికార్డుల వివరాలను ఆరా తీస్తున్నారు. పాసు పుస్తకాల మంజూరు, ఇతర సర్వేలకు సంబంధించిన వివరాలు, వివిధ ఇళ్ల స్థలాల మంజూరు తదితర వివరాలను కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. గత 3 ఏళ్లకు సంబంధించిన రికార్డులన్నింటినీ ఆన్​లైన్​లో ఏ విధంగా నమోదు చేశారని దానిపై వివరాలు సేకరిస్తున్నారు. వీటితోపాటు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలను కూడా విచారిస్తున్నారు. ఈ కార్యాలయానికి ఏ పని మీద ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు.. ఎందుకు జాప్యం జరుగుతోంది.. అనే వివరాలు తెలుసుకుంటున్నారు. సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి : LOCK: రెండేళ్లైనా చెల్లించని బిల్లులు.. సచివాలయానికి తాళం

For All Latest Updates

TAGGED:

Acb
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.