KIDAMBI SRIKANTH : చదువు, ఆటలను సమానంగా తీసుకోవాలి: షట్లర్ శ్రీకాంత్
By
Published : Dec 30, 2021, 8:34 PM IST
వచ్చే కామన్వెల్త్, ఆసియా గేమ్స్లో బంగారు పతకాలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలుగు క్రీడాకారుడు, స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ తెలిపారు. ఇటీవల వరల్డ్ ఛాంపియన్ షిప్లో రజత పతకం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రీకాంత్... ఇలాంటి పతకాలే దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తాయన్నారు. గుంటూరు ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాలలో శ్రీకాంత్ను ఘనంగా సన్మానించారు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా బంగారు పతకాన్ని సాధిస్తానంటున్న కిదాంబి శ్రీకాంత్తో "ఈటీవీ భారత్" ముఖాముఖి..