గుంటూరు నగర పాలక సంస్థలో పన్ను చెల్లింపులకు ఈనెల 27నుంచి సర్కిల్ కార్యాలయంలో క్యాష్ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు నగర కమిషనర్ చల్లా అనురాధ వెల్లడించారు. ఈ కౌంటర్ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. 2020-21 ఆస్తి పన్ను మొదటి, రెండో అర్ధ సంవత్సరంతో కలిపి ఏక మొత్తంలో చెల్లించినట్లయితే ఆస్తి పన్నులో 5 శాతం రాయితీ వస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఈ అవకాశాన్ని జూన్ 30 వరకు పొడిగించినట్లు కమిషనర్ వివరించారు.
లాక్డౌన్ అమలులో ఉన్నందున గుంటూరులోని ఆర్టీసీ కాలనీలోని 6వ వార్డు, గోరంట్ల మెయిన్ రోడ్లోని 181 వార్డు, నల్ల చెరువులోని 66 వార్డు, గుజ్జనగుండ్లలోని 106 వార్డు సచివాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కౌంటర్లు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేసేలా తగిన చర్యలు చేసినట్లు చెప్పారు. క్యాష్ కౌంటర్లలో అవసరమైన సిబ్బంది, కంప్యూటర్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారాలను ఆదేశించారు.
ఇదీ చూడండి: