ETV Bharat / city

accident: జాతీయ రహదారిపై కారు బోల్తా.. ఒకరు మృతి, 8 మందికి తీవ్ర గాయాలు

author img

By

Published : Aug 17, 2021, 5:24 PM IST

జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోండ్రుపాడు వద్ద జరిగింది.

జాతీయ రహదారిపై కారు బోల్తా
జాతీయ రహదారిపై కారు బోల్తా

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోండ్రుపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెంగా..8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఓ కుటుంబం.. విజయవాడలోని దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దర్శించుకొని వెళ్తున్నారు. ఈ క్రమంలో వాళ్లు ప్రయాణిస్తున్న కారు.. ప్ర‌త్తిపాడు మండల ప‌రిధిలోని కోండ్రుపాడు వ‌ద్ద అదుపుత‌ప్పి బోల్తాప‌డింది. ఈ ప్రమాదంలో మ‌ల్లేశ్వ‌ర‌రావు(34) అనే వ్య‌క్తి మృతిచెందగా... 8 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. అందులో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. గాయపడ్డ వాళ్లను కాటూరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసుల నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి..

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోండ్రుపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెంగా..8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఓ కుటుంబం.. విజయవాడలోని దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దర్శించుకొని వెళ్తున్నారు. ఈ క్రమంలో వాళ్లు ప్రయాణిస్తున్న కారు.. ప్ర‌త్తిపాడు మండల ప‌రిధిలోని కోండ్రుపాడు వ‌ద్ద అదుపుత‌ప్పి బోల్తాప‌డింది. ఈ ప్రమాదంలో మ‌ల్లేశ్వ‌ర‌రావు(34) అనే వ్య‌క్తి మృతిచెందగా... 8 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. అందులో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. గాయపడ్డ వాళ్లను కాటూరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసుల నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి..

SUICIDE: వాలంటీర్‌ ఆత్మహత్య.. గౌరవ వేతనం సరిపోవట్లేదంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.