Farmers of Amaravati : అమరావతి నుంచి అరసవల్లి వరకు రాజధాని రైతులు చేపట్టే మహా పాదయాత్రకు సంఘీభావంగా గుంటూరులో సైకిల్ ర్యాలీ చేపట్టారు. అమరావతి పరిరక్షణ సమితి రాజకీయేతర ఐకాస ఆధ్వర్యంలో స్థానిక మదర్ థెరిస్సా కూడలి నుంచి.. వెంకటపాలెం వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. బిల్డ్ అమరావతి..సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందంటూ.. ఐకాస నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు అమరావతి నుంచి అరసవల్లి.... మహా పాదయాత్రను చేపట్టినట్లు ఐకాస నేతలు వెల్లడించారు.
ఇవీ చదవండి: