ETV Bharat / city

వైకాపా అభ్యర్థి ఇంటి వద్ద జనం క్యూ.. నగదు పంపిణీ..

author img

By

Published : Nov 15, 2021, 1:30 PM IST

ఏలూరు నగర కార్పొరేషన్​ 45 డివిజన్ వైకాపా అభ్యర్థి ఇంటి ముందు జనం బారులు తీరారు. రాత్రి నగదు అందని వారికి ఓటర్ స్లిప్పుల మాటున నగదు పంపిణీ చేస్తున్నట్లు తెదేపా నేతలు చెబుతున్నారు.

వైకాపా అభ్యర్థి ఇంటి వద్ద జనం క్యూ.. నగదు పంపిణీ..
వైకాపా అభ్యర్థి ఇంటి వద్ద జనం క్యూ.. నగదు పంపిణీ..
వైకాపా అభ్యర్థి ఇంటి వద్ద జనం క్యూ.. నగదు పంపిణీ..

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగర కార్పొరేషన్ 45 డివిజన్​కు జరుగుతున్న ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి ఇంటి ముందు జనం బారులు తీరారు. భారీ స్థాయిలో ఓటర్​ స్లిప్పుల పేరుతో నగదు పంపిణీ చేశారు. ఏలూరు నియోజకవర్గానికి చెందిన వైకాపా ప్రముఖ నాయకులు అక్కడే ఉండి నగదు పంపిణీ చేపట్టారని తెదేపా నాయకులు ఆరోపించారు.

45వ డివిజన్ వైకాపా అభ్యర్థి ఇలియాజ్ బాషా ఇంటి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి నగదు పంపిణీలో సొమ్ము పొందని వారు.. నేరుగా అభ్యర్థి ఇంటి వద్దకు వచ్చి రూ.1000 చొప్పున నగదు తీసుకుంటున్నట్లు తెదేపా నాయకులు చెప్పారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో అక్కడికి చేరుకుని జనాన్ని పంపించే ప్రయత్నం చేశారు.

ఇదీ చదవండి:

కన్నాపురం అటవీరేంజ్ పరిధిలో పెద్దపులి సంచారం.. భయాందోళనలో స్థానికులు

వైకాపా అభ్యర్థి ఇంటి వద్ద జనం క్యూ.. నగదు పంపిణీ..

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగర కార్పొరేషన్ 45 డివిజన్​కు జరుగుతున్న ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి ఇంటి ముందు జనం బారులు తీరారు. భారీ స్థాయిలో ఓటర్​ స్లిప్పుల పేరుతో నగదు పంపిణీ చేశారు. ఏలూరు నియోజకవర్గానికి చెందిన వైకాపా ప్రముఖ నాయకులు అక్కడే ఉండి నగదు పంపిణీ చేపట్టారని తెదేపా నాయకులు ఆరోపించారు.

45వ డివిజన్ వైకాపా అభ్యర్థి ఇలియాజ్ బాషా ఇంటి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి నగదు పంపిణీలో సొమ్ము పొందని వారు.. నేరుగా అభ్యర్థి ఇంటి వద్దకు వచ్చి రూ.1000 చొప్పున నగదు తీసుకుంటున్నట్లు తెదేపా నాయకులు చెప్పారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో అక్కడికి చేరుకుని జనాన్ని పంపించే ప్రయత్నం చేశారు.

ఇదీ చదవండి:

కన్నాపురం అటవీరేంజ్ పరిధిలో పెద్దపులి సంచారం.. భయాందోళనలో స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.