ETV Bharat / city

జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వరనాయక్, ఎస్సై గంగాధర్ సస్పెన్షన్​

author img

By

Published : Sep 23, 2020, 4:09 PM IST

అక్రమార్కులకు సహకరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసు శాఖలో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వరనాయక్, ఎస్సై గంగాధర్​లను ఏలూరు రేంజ్ డీఐజీ కే.వి మోహన్​రావు సస్పెండ్ చేశారు.

jangareddygudem-ci-and-si-suspend-over-sand-issue
జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వరనాయక్, ఎస్సై గంగాధర్ సస్పెండ్

పశ్చిమగోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వరనాయక్, ఎస్సై గంగాధర్​లను ఏలూరు రేంజ్ డీఐజీ కే.వి మోహన్​రావు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఇటీవల జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కొంతమంది ప్రముఖులు.. బల్క్ బుకింగ్​లో ఇసుకను తరలించి నల్లబజారులో విక్రయించారు. వారిపై కేసు నమోదు చేయకుండా తారుమారు చేశారనే ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. విచారణ సమయంలో కంప్యూటర్​లో ఉన్న సమాచారాన్ని మాయం చేశారన్న అభియోగంపై సీఐ, ఎస్సైని డీఐజీ సస్పెండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఠాణా పరిధిలో పట్టుబడిన తెలంగాణ మద్యం మాయమైన ఘటనలోనూ అప్పటి ఎస్సై గంగాధర్​పై కేసు నమోదు అయింది. ఈ ఘటనలో ఇద్దరిపై సస్పెండ్ వేటు పడినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వరనాయక్, ఎస్సై గంగాధర్​లను ఏలూరు రేంజ్ డీఐజీ కే.వి మోహన్​రావు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఇటీవల జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కొంతమంది ప్రముఖులు.. బల్క్ బుకింగ్​లో ఇసుకను తరలించి నల్లబజారులో విక్రయించారు. వారిపై కేసు నమోదు చేయకుండా తారుమారు చేశారనే ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. విచారణ సమయంలో కంప్యూటర్​లో ఉన్న సమాచారాన్ని మాయం చేశారన్న అభియోగంపై సీఐ, ఎస్సైని డీఐజీ సస్పెండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఠాణా పరిధిలో పట్టుబడిన తెలంగాణ మద్యం మాయమైన ఘటనలోనూ అప్పటి ఎస్సై గంగాధర్​పై కేసు నమోదు అయింది. ఈ ఘటనలో ఇద్దరిపై సస్పెండ్ వేటు పడినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

ఇదీ చదవండీ... ప్రభుత్వం, అధికారులు.. దేవాలయాల జోలికి రావొద్దు: పరిపూర్ణానంద

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.