ETV Bharat / city

ఆంగ్ల మాధ్యమ జీవోను స్వాగతిస్తున్నా: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ - ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం

వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమంలో బోధనను అమలుచేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 81ను స్వాగతిస్తున్నట్లు అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల అభీష్టం మేరకే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా బోధనా పద్ధతులు మారాలన్నారు.

ఆంగ్ల మాధ్యమ జీవోను స్వాగతిస్తున్నా : యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
author img

By

Published : Nov 7, 2019, 5:19 PM IST

ఆంగ్ల మాధ్యమ జీవోను స్వాగతిస్తున్నా : యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
వచ్చే విద్యా సంవత్సరంలో 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధనకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 81 ను జారీ చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం తెచ్చిన జీవో 81 ప్రజాభీష్టం మేరకేనని రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. దిల్లీలో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

"రాష్ట్రంలో అధిక, మధ్య ఆదాయ ప్రజలు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారు. ప్రజాసంకల్ప యాత్ర సమయంలో ఎంతో మంది అల్పాదాయవర్గాల వారు... తమ పిల్లలకు ఆంగ్ల మాధ్యమం కావాలని జగన్​ను కోరారు. ప్రజల కోరిక మేరకు సీఎం జగన్.. ఆంగ్లమాధ్యమం తీసుకొచ్చారు. ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం ఉన్న చాలా సీబీఎస్​సీ పాఠశాలలో ఇప్పటికీ తెలుగు భాషలేదు. గత ప్రభుత్వంలో ఒకటి నుంచి 10వ తరగతి వరకూ తెలుగును ఒక పాఠ్యాంశంగా ఉంచాలని పోరాడాం.. కానీ ఆ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మారుతున్న పరిస్థితుల మేరకు ఆధునీకరణ అందిపుచ్చుకునేందుకు వైకాపా ప్రభుత్వం.. ఈ జీవో తీసుకొచ్చింది. ఈ జీవోను స్వాగతిస్తున్నాను. ఈ రోజు రాష్ట్రంలో ప్రతిఒక్కరూ తమ పిల్లలు ఆంగ్లభాషలో చదువుకోవాలని ఆకాంక్షిస్తున్నారు "------- యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

ఇదీ చదవండి :

ప్రజలను తెగించేలా చేయకండి: చంద్రబాబు

ఆంగ్ల మాధ్యమ జీవోను స్వాగతిస్తున్నా : యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
వచ్చే విద్యా సంవత్సరంలో 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధనకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 81 ను జారీ చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం తెచ్చిన జీవో 81 ప్రజాభీష్టం మేరకేనని రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. దిల్లీలో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

"రాష్ట్రంలో అధిక, మధ్య ఆదాయ ప్రజలు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారు. ప్రజాసంకల్ప యాత్ర సమయంలో ఎంతో మంది అల్పాదాయవర్గాల వారు... తమ పిల్లలకు ఆంగ్ల మాధ్యమం కావాలని జగన్​ను కోరారు. ప్రజల కోరిక మేరకు సీఎం జగన్.. ఆంగ్లమాధ్యమం తీసుకొచ్చారు. ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం ఉన్న చాలా సీబీఎస్​సీ పాఠశాలలో ఇప్పటికీ తెలుగు భాషలేదు. గత ప్రభుత్వంలో ఒకటి నుంచి 10వ తరగతి వరకూ తెలుగును ఒక పాఠ్యాంశంగా ఉంచాలని పోరాడాం.. కానీ ఆ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మారుతున్న పరిస్థితుల మేరకు ఆధునీకరణ అందిపుచ్చుకునేందుకు వైకాపా ప్రభుత్వం.. ఈ జీవో తీసుకొచ్చింది. ఈ జీవోను స్వాగతిస్తున్నాను. ఈ రోజు రాష్ట్రంలో ప్రతిఒక్కరూ తమ పిల్లలు ఆంగ్లభాషలో చదువుకోవాలని ఆకాంక్షిస్తున్నారు "------- యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

ఇదీ చదవండి :

ప్రజలను తెగించేలా చేయకండి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.