ETV Bharat / city

'జగన్ బినామీల కోసమే ఆ పరిశ్రమల ఏర్పాటు'

author img

By

Published : Dec 10, 2020, 10:59 AM IST

కోనసీమ ప్రజల ప్రయోజనాల మేరకు రసాయన పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు చెప్పారు. ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల సముద్రజలాలు కలుషితమై మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారన్నారు. గతంలో పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకించిన వైకాపా ఇప్పుడు ఎందుకు అనుమతులు ఇచ్చిందని యనమల ప్రశ్నించారు.

Yanamala
Yanamala

కోనసీమ ప్రజల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకుని రసాయన పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. గతంలో ఓ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకించిన వైకాపా.. అసలు రంగు ఇప్పుడు బయటపడిందని ఆరోపించారు. ఈ రసాయన పరిశ్రమ ఏర్పాటు వల్ల సముద్రజలాలు కలుషితమై మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారన్నారు. భూములంతా ఉప్పు తేలడంతో రైతులకు ఎనలేని నష్టం వాటిల్లుతుందన్న ఆయన.. 300లకు పైగా హేచరీస్ కాలుష్యంలో చిక్కుకున్నాయన్నారు. దీంతో చిరు వ్యాపారులంతా పూర్తిగా దెబ్బతింటారని స్పష్టం చేశారు.

బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటును కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని యనమలు అన్నారు. కాకినాడ సెజ్​లో 51 శాతం షేర్లను రూ. 2,511 కోట్లకు ఇప్పటికే కొనుగోలు చేశారని మండిపడ్డారు. జగన్ బినామీలు బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటు పేరుతో కోనసీమ గ్రామాలను కబ్జా చేస్తున్నారని, తీరప్రాంతాన్ని ఆక్రమించి వారి ఇండస్ట్రియల్ ఎస్టేట్ స్థాపనకు ప్రయత్నాలు చేస్తున్నారని యనమల ఆరోపించారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యల మానుకోవాలని ఆయన హితవు పలికారు. రసాయన పరిశ్రమ ఏర్పాటు ప్రయత్నాలను తక్షణమే వైకాపా ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

కోనసీమ ప్రజల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకుని రసాయన పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. గతంలో ఓ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకించిన వైకాపా.. అసలు రంగు ఇప్పుడు బయటపడిందని ఆరోపించారు. ఈ రసాయన పరిశ్రమ ఏర్పాటు వల్ల సముద్రజలాలు కలుషితమై మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారన్నారు. భూములంతా ఉప్పు తేలడంతో రైతులకు ఎనలేని నష్టం వాటిల్లుతుందన్న ఆయన.. 300లకు పైగా హేచరీస్ కాలుష్యంలో చిక్కుకున్నాయన్నారు. దీంతో చిరు వ్యాపారులంతా పూర్తిగా దెబ్బతింటారని స్పష్టం చేశారు.

బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటును కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని యనమలు అన్నారు. కాకినాడ సెజ్​లో 51 శాతం షేర్లను రూ. 2,511 కోట్లకు ఇప్పటికే కొనుగోలు చేశారని మండిపడ్డారు. జగన్ బినామీలు బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటు పేరుతో కోనసీమ గ్రామాలను కబ్జా చేస్తున్నారని, తీరప్రాంతాన్ని ఆక్రమించి వారి ఇండస్ట్రియల్ ఎస్టేట్ స్థాపనకు ప్రయత్నాలు చేస్తున్నారని యనమల ఆరోపించారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యల మానుకోవాలని ఆయన హితవు పలికారు. రసాయన పరిశ్రమ ఏర్పాటు ప్రయత్నాలను తక్షణమే వైకాపా ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి :

వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ వీరంగం...టోల్​గేట్ సిబ్బందిపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.