ETV Bharat / city

సెక్యూరిటీ గార్డుపై ఎమ్మెల్యే కుమారుడు దాడి

తెలంగాణ రాష్ట్రం పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్​ రెడ్డి సెక్యూరిటీ గార్డుపై దాడి చేయడం కలకలం రేపింది. తన కారులో ఏపీఆర్ కాలనీలోకి వెళ్లేక్రమంలో కొవిడ్ నిబంధన దృష్ట్యా సెక్యూరిటీ గార్డు వివరాలు అడగగా ఈ ఘటన చోటు చేసుకుంది.

author img

By

Published : Apr 20, 2021, 9:40 AM IST

mla son attack on security guard
సెక్యూరిటీ గార్డుపై ఎమ్మెల్యే కుమారుడు దాడి
సెక్యూరిటీ గార్డుపై ఎమ్మెల్యే కుమారుడు దాడి

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి సెక్యూరిటీ గార్డుపై దాడి చేశాడు. తన కారులో ఏపీఆర్ కాలనీకి వెళ్లేందుకు గేట్ వద్దకు వచ్చాడు. కొవిడ్ నిబంధన దృష్ట్యా వివరాలు తెలుసుకునేందుకు సెక్యూరిటీ గార్డు ప్రయత్నించాడు.

ఆగ్రహించిన విష్ణువర్ధన్ రెడ్డి... నేనెవరో నీకు తెలియదా అంటూ అతనిపై దాడి చేశాడు. ఈ దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్​లో నమోదైన కారణంగా ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే తనపై దాడి చేసినట్లుగా పటాన్​చెరు పోలీస్ స్టేషన్​లో ఎవరూ ఫిర్యాదు చేయకపోవటం గమనార్హం.

ఇదీ చదవండి:

చిత్తూరు జిల్లాలో కరోనా కలకలం... పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలూ అధికం

సెక్యూరిటీ గార్డుపై ఎమ్మెల్యే కుమారుడు దాడి

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి సెక్యూరిటీ గార్డుపై దాడి చేశాడు. తన కారులో ఏపీఆర్ కాలనీకి వెళ్లేందుకు గేట్ వద్దకు వచ్చాడు. కొవిడ్ నిబంధన దృష్ట్యా వివరాలు తెలుసుకునేందుకు సెక్యూరిటీ గార్డు ప్రయత్నించాడు.

ఆగ్రహించిన విష్ణువర్ధన్ రెడ్డి... నేనెవరో నీకు తెలియదా అంటూ అతనిపై దాడి చేశాడు. ఈ దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్​లో నమోదైన కారణంగా ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే తనపై దాడి చేసినట్లుగా పటాన్​చెరు పోలీస్ స్టేషన్​లో ఎవరూ ఫిర్యాదు చేయకపోవటం గమనార్హం.

ఇదీ చదవండి:

చిత్తూరు జిల్లాలో కరోనా కలకలం... పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలూ అధికం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.