ETV Bharat / city

మాజీ మంత్రి శిద్దాకు చెందిన క్వారీల్లో విజిలెన్స్ తనిఖీలు! - Vigilance checks in quarries belonging to former minister Shidda news

రాష్ట్ర మాజీ మంత్రి, తెదేపా నేత శిద్దా రాఘవరావుకు చెందిన గ్రానైట్ క్వారీల్లో విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు తనిఖీలు చేశారు. దీనిపై తెదేపా నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Vigilance checks in quarries belonging to former minister Shidda ragavarao
Vigilance checks in quarries belonging to former minister Shidda ragavarao
author img

By

Published : Dec 15, 2019, 5:19 PM IST

మాజీ మంత్రి క్వారీల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

ప్రకాశం జిల్లాలో రాష్ట్ర మాజీ మంత్రి శిద్దా రాఘవరావుకు చెందిన గ్రానైట్ క్వారీల్లో విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. గత రెండు రోజులుగా సంతమాగులూరు మండలం గురిజేపల్లి వద్ద ఉన్న బ్లాక్ గ్రానైట్ క్వారీల్లో సోదాలు చేస్తున్నారు. వారం క్రితం వరకూ అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ క్వారీల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. తాజాగా శిద్దా క్వారీలపై దృష్టి సారించడంపై తెదేపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లాలో తెదేపా నేతలే లక్ష్యంగా అధికారులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

మాజీ మంత్రి క్వారీల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

ప్రకాశం జిల్లాలో రాష్ట్ర మాజీ మంత్రి శిద్దా రాఘవరావుకు చెందిన గ్రానైట్ క్వారీల్లో విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. గత రెండు రోజులుగా సంతమాగులూరు మండలం గురిజేపల్లి వద్ద ఉన్న బ్లాక్ గ్రానైట్ క్వారీల్లో సోదాలు చేస్తున్నారు. వారం క్రితం వరకూ అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ క్వారీల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. తాజాగా శిద్దా క్వారీలపై దృష్టి సారించడంపై తెదేపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లాలో తెదేపా నేతలే లక్ష్యంగా అధికారులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి:

శాసనసభ ముందుకు ఆంగ్లమాధ్యమ బిల్లు..!

Intro:ap_ong_62_15_sidda_granigt_qwares_tanikilu_av_ap10067

కంట్రిబ్యూటర్ నటరాజు

సెంటర్ అద్దంకి

--------------------------------------
రాష్ట్ర మాజీ మంత్రి శిద్దా రాఘవరా
వుకు చెందిన గ్రానైట్ క్వారీల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు ప్రారంభమయ్యాయి. వారం క్రితం వరకూ అద్దంకి ఎమ్మెల్యే గొట్టపాటి రవికుమార్ క్వారీల్లో సోదాలు నిర్వహించిన అధికారులు ఇప్పుడు శిద్దా క్వారీలపై దృష్టి సారించడంతో జిల్లాలో టీడీపీ నేతలే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

సంతమాగులూరు మండలం గురిజేపల్లి వద్ద ఉన్న బ్లాక్ గ్రానైట్ క్వారీల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రానైట్ నిక్షేపాలకు ప్రకాశం జిల్లా పెట్టింది పేరు.

గత రెండ్రోజులుగా మాజీ మంత్రి శిద్దా రాఘవరావు చెందిన గురిజేపల్లి వద్ద ఉన్న విష్ణు గ్రానైట్ క్వారీల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి . విజిలెన్స్ అధికారుల తోపాటు గనులు, భూగర్భ శాఖకు చెందిన అధికారులు, సర్వేయర్లు ఈ తనిఖీలో పాల్గొన్నారు
Body:.Conclusion:.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.