'మంత్రులను మేము కలవలేదు.. అబద్ధం చెప్పకండి' - 27వ రోజూ రైతు రణఘోష
రాజధాని గ్రామాల్లో... 27వ రోజూ రైతుల ఆందోళన కొనసాగుతోంది. సమరనినాదంతో... ప్లకార్డులు చేతబట్టి... ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ నినాదాలు చేస్తున్నారు వెలగపూడి రైతులు. రాజకీయ లబ్ధి కోసమే మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీదకి తీసుకొచ్చారంటూ... ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేతలను తాము కలవకపోయినా... రైతులతో చర్చించామంటూ కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నదాతలు మండిపడ్డారు.
velagapudi farmers protest in amaravathi
By
Published : Jan 13, 2020, 11:07 AM IST
రాజకీయ లబ్ధి కోసమే రాజధాని మార్పు చేశారన్న అమరావతి రైతులు
.
రాజకీయ లబ్ధి కోసమే రాజధాని మార్పు చేశారన్న అమరావతి రైతులు
.
Intro:AP_GNT_26_13_MLA_RK_ARREST_AVB_AP10032
Centre. Mangalagiri
Ramkumar. 8008001908
(. ) రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. తాడేపల్లి మండలం పెనుమాక లో ర్యాలీ ప్రారంభించిన కాసేపటికే పోలీసులు శాసన సభ్యులను నిలువరించారు. ఈ ప్రాంతంలో సెక్షన్ 144, పోలీసు యాక్ట్ 30 అమలులో ఉన్నందున ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయినా ఎమ్మెల్యే ముందుకెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు అరెస్టు చేశారు.