ETV Bharat / city

'కేసులున్న వారికా...? లేని వారికా..? వైకాపా ఎమ్మెల్యేలే నిర్ణయించుకోండి?'

author img

By

Published : Jun 19, 2020, 2:50 PM IST

రాజ్యసభ ఎన్నికలకు క్రిమినల్ కేసులున్నవారిని ఎలా ఎంపిక చేశారని రాజ్యసభ తెదేపా అభ్యర్థి వర్ల రామయ్య విమర్శించారు. కేసులు ఉన్న వ్యక్తులకు ఓటేస్తారా.. ? లేని వారికి ఓటేస్తారా.. ? అనేది వైకాపా ఎమ్మెల్యేలు నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు.

varla ramaiah commenting on ycp members for rajyasabha elections
రాజ్యసభ ఎన్నికలపై వర్ల రామయ్య స్పందన

పెద్దల సభకు జగన్‌తో సహ నిందితుడిగా ఉన్న మోపిదేవిని ఎంపిక చేశారని రాజ్యసభ తెదేపా అభ్యర్థి వర్లరామయ్య విమర్శించారు. అయోధ్య రామిరెడ్డి మీద దేశవ్యాప్తంగా 10 క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. పరిమళ్ నత్వానీ మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదని, అంబానీలకు సంబంధించిన వ్యక్తి అని, ఆయనను రాజ్యసభకు పంపుతున్నారని వర్ల ఆక్షేపించారు. వైకాపా ఎమ్మెల్యేలు కేసులు ఉన్న వ్యక్తులకా.. ? లేని వారికా ఓటేసేది నిర్ణయించుకోవాలని అన్నారు. రెండు సీట్లు బీసీలకు ఇచ్చే బదులు ఓ సీటుని ఎస్సీకి ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. అయోధ్య రామిరెడ్డి పార్టీకేం చేశాడని ఆయనకు టిక్కెట్ ఇచ్చారని నిలదీశారు. ఎస్సీలకు సీటివ్వాలని ఆ పార్టీ ఎస్సీ ఎమ్మెల్యేలు... సీఎంను ఎందుకు అడగలేకపోయారని ప్రశ్నించారు.

పెద్దల సభకు జగన్‌తో సహ నిందితుడిగా ఉన్న మోపిదేవిని ఎంపిక చేశారని రాజ్యసభ తెదేపా అభ్యర్థి వర్లరామయ్య విమర్శించారు. అయోధ్య రామిరెడ్డి మీద దేశవ్యాప్తంగా 10 క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. పరిమళ్ నత్వానీ మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదని, అంబానీలకు సంబంధించిన వ్యక్తి అని, ఆయనను రాజ్యసభకు పంపుతున్నారని వర్ల ఆక్షేపించారు. వైకాపా ఎమ్మెల్యేలు కేసులు ఉన్న వ్యక్తులకా.. ? లేని వారికా ఓటేసేది నిర్ణయించుకోవాలని అన్నారు. రెండు సీట్లు బీసీలకు ఇచ్చే బదులు ఓ సీటుని ఎస్సీకి ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. అయోధ్య రామిరెడ్డి పార్టీకేం చేశాడని ఆయనకు టిక్కెట్ ఇచ్చారని నిలదీశారు. ఎస్సీలకు సీటివ్వాలని ఆ పార్టీ ఎస్సీ ఎమ్మెల్యేలు... సీఎంను ఎందుకు అడగలేకపోయారని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: లైవ్ అప్​డేట్స్: ఏపీలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.