ఆంధ్రప్రదేశ్లో పెద్దఎత్తున ఎస్సీలను క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని ఎస్సీ, ఎస్టీ హక్కుల ఫోరం జాతీయ అధ్యక్షుడు నాగరాజు అందించిన ఫిర్యాదుపై.. జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి ఇటీవల నోటీసులు జారీచేసింది.
ఈ అంశంపై విచారణ చేయాలని కమిషన్ భావిస్తున్నట్లు తెలిపింది. మత మార్పిడి ఫిర్యాదు / ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గడువులోగా సమాధానం పంపకపోతే కమిషన్ ముందు స్వయంగా హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేస్తామని తెలిపింది.
ఇదీ చదవండి:
ysr Kapu Nestam: నేడు వైఎస్సార్ కాపు నేస్తం రెండో ఏడాది నిధులు విడుదల