ETV Bharat / city

'రాష్ట్రంలో మత మార్పిడులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?'

author img

By

Published : Jul 22, 2021, 9:18 AM IST

రాష్ట్రంలో పెద్ద ఎత్తున క్రైస్తవ మతంలోకి ప్రజలను మారుస్తున్నారని వచ్చిన ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ 15 రోజుల్లోగా నివేదిక అందజేయాలని సీఎస్​కు నోటీసులు జారీ చేసింది.

ncsc
ncsc

ఆంధ్రప్రదేశ్‌లో పెద్దఎత్తున ఎస్సీలను క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని ఎస్సీ, ఎస్టీ హక్కుల ఫోరం జాతీయ అధ్యక్షుడు నాగరాజు అందించిన ఫిర్యాదుపై.. జాతీయ ఎస్సీ కమిషన్‌ స్పందించింది. ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)కి ఇటీవల నోటీసులు జారీచేసింది.

ఈ అంశంపై విచారణ చేయాలని కమిషన్‌ భావిస్తున్నట్లు తెలిపింది. మత మార్పిడి ఫిర్యాదు / ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గడువులోగా సమాధానం పంపకపోతే కమిషన్‌ ముందు స్వయంగా హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేస్తామని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో పెద్దఎత్తున ఎస్సీలను క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని ఎస్సీ, ఎస్టీ హక్కుల ఫోరం జాతీయ అధ్యక్షుడు నాగరాజు అందించిన ఫిర్యాదుపై.. జాతీయ ఎస్సీ కమిషన్‌ స్పందించింది. ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)కి ఇటీవల నోటీసులు జారీచేసింది.

ఈ అంశంపై విచారణ చేయాలని కమిషన్‌ భావిస్తున్నట్లు తెలిపింది. మత మార్పిడి ఫిర్యాదు / ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గడువులోగా సమాధానం పంపకపోతే కమిషన్‌ ముందు స్వయంగా హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేస్తామని తెలిపింది.

ఇదీ చదవండి:

ysr Kapu Nestam: నేడు వైఎస్సార్​ కాపు నేస్తం రెండో ఏడాది నిధులు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.