ETV Bharat / city

ఎండలు.. మంటెక్కిస్తున్నాయి

author img

By

Published : Apr 2, 2021, 7:14 AM IST

రాష్ట్రంలో రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. ఎండల వేడిమి, వడగాలులతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. గురువారం ప్రకాశం జిల్లాలో 45.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఎండల ప్రభావం అధికంగా ఉంది.

temperature increasing in andhra pradesh
temperature increasing in andhra pradesh

మండే ఎండలు.. వరసగా రెండో రోజూ నిప్పులు కురిపించాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలైంది. నిప్పులసెగ ముందు నిల్చున్న వాతావరణాన్ని తలపించింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 78 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 197 మండలాల్లో వడగాల్పుల ప్రభావం నమోదైంది. 56 మండలాల్లో సగటున 45 డిగ్రీలకు పైగా, మరో 50 మండలాల్లో 44.6 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా కురిచేడు, కొనకనమిట్ల, కందుకూరు ప్రాంతాల్లో 45.8 డిగ్రీల చొప్పున నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తించాయి.

దక్షిణ కోస్తాలో అధికం
గుంటూరు, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఎండల ప్రభావం అధికంగా ఉంది. శుక్రవారం కూడా ఈ తీవ్రత కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం, విపత్తుల నిర్వహణ సంస్థ సూచించాయి.

* తీరప్రాంతం, దక్షిణ కోస్తాలో గురువారం తీవ్ర వడగాల్పులు వీచాయి. గుంటూరు జిల్లాలో 14, కృష్ణాజిల్లాలో 14, ప్రకాశం జిల్లాలో 13, పశ్చిమ గోదావరి జిల్లా 11, చిత్తూరు జిల్లా ఎనిమిది, తూర్పు గోదావరి జిల్లా ఆరు.. విశాఖపట్నం, నెల్లూరు , కర్నూలు జిల్లాల్లో మూడు మండలాల చొప్పున.. కడప జిల్లాలో రెండు, శ్రీకాకుళం జిల్లాలోని ఒక మండలంలోనూ తీవ్ర ప్రభావం ఉంది.

రాత్రి 7 గంటలకూ 43 డిగ్రీల పైనే


గురువారం రాత్రి 7 గంటల సమయంలో పరిశీలిస్తే.. చిత్తూరు జిల్లా బంగారుపాళెం, ప్రకాశం జిల్లా తిప్పాయపాలెం 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నాయి. అనంతపురం జిల్లా తేరన్నపల్లిలో 42.8, నెల్లూరు జిల్లా బోడిపాడు 42.1, కడప జిల్లా పొట్టిపాడు 41.0, గుంటూరు జిల్లా బండ్లమోడు 40.5, కర్నూలు జిల్లా పంచలింగాల 40.0 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నేడు 48 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం


దక్షిణ కోస్తాలోని అధికశాతం మండలాల్లో శుక్రవారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మొత్తం 83 మండలాల్లో తీవ్రత ఉంటుందని అంచనా వేయగా.. ఇందులో గుంటూరు జిల్లాలో 31, కృష్ణా జిల్లాలో 27, ప్రకాశం జిల్లాలోని 9 మండలాలు ఉన్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడా ప్రభావం ఉంటుంది.

48 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం: కృష్ణా జిల్లా ఉయ్యూరు


46 నుంచి 48 డిగ్రీల వరకు : కృష్ణా జిల్లా పమిడిముక్కల, ఉంగుటూరు, పెదపారుపూడి, కంకిపాడు, గుంటూరు జిల్లా కొల్లిపర


44.6 నుంచి 46 డిగ్రీల వరకు: పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు, దెందులూరు, కృష్ణా జిల్లా కంచికచెర్ల, వీరులపాడు, పామర్రు, నందివాడ, గుడివాడ, మొవ్వ, ఘంటశాల, ఆగిరిపల్లి, విజయవాడ, ఇబ్రహీంపట్నం, మందవల్లి.. గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు, పెద్దకాకాని, దుగ్గిరాల, కొల్లూరు, వేమూరు, తెనాలి, టి.చుండూరు, చేబ్రోలు, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, యడ్లపాడు, చిలకలూరిపేట, పెదనందిపాడు, కాకుమాను, పొన్నూరు, అమృతలూరు, భట్టిప్రోలు, చెరుకుపల్లి, నూజెండ్ల, ఫిరంగిపురం, ముప్పాళ్ల, తుళ్లూరు, అమరావతి, తాడికొండ.. ప్రకాశం జిల్లా బల్లికురవ, యద్దనపూడి, మార్టూరు, పర్చూరు, ఇంకొల్లు, పంగులూరు, కారంచేడు, సంతమాగులూరు, సంతనూతలపాడు.

ఇదీ చదవండి: 'పరిషత్' ఎన్నికలపై నేడు తెదేపా కీలక సమావేశం

మండే ఎండలు.. వరసగా రెండో రోజూ నిప్పులు కురిపించాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలైంది. నిప్పులసెగ ముందు నిల్చున్న వాతావరణాన్ని తలపించింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 78 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 197 మండలాల్లో వడగాల్పుల ప్రభావం నమోదైంది. 56 మండలాల్లో సగటున 45 డిగ్రీలకు పైగా, మరో 50 మండలాల్లో 44.6 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా కురిచేడు, కొనకనమిట్ల, కందుకూరు ప్రాంతాల్లో 45.8 డిగ్రీల చొప్పున నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తించాయి.

దక్షిణ కోస్తాలో అధికం
గుంటూరు, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఎండల ప్రభావం అధికంగా ఉంది. శుక్రవారం కూడా ఈ తీవ్రత కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం, విపత్తుల నిర్వహణ సంస్థ సూచించాయి.

* తీరప్రాంతం, దక్షిణ కోస్తాలో గురువారం తీవ్ర వడగాల్పులు వీచాయి. గుంటూరు జిల్లాలో 14, కృష్ణాజిల్లాలో 14, ప్రకాశం జిల్లాలో 13, పశ్చిమ గోదావరి జిల్లా 11, చిత్తూరు జిల్లా ఎనిమిది, తూర్పు గోదావరి జిల్లా ఆరు.. విశాఖపట్నం, నెల్లూరు , కర్నూలు జిల్లాల్లో మూడు మండలాల చొప్పున.. కడప జిల్లాలో రెండు, శ్రీకాకుళం జిల్లాలోని ఒక మండలంలోనూ తీవ్ర ప్రభావం ఉంది.

రాత్రి 7 గంటలకూ 43 డిగ్రీల పైనే


గురువారం రాత్రి 7 గంటల సమయంలో పరిశీలిస్తే.. చిత్తూరు జిల్లా బంగారుపాళెం, ప్రకాశం జిల్లా తిప్పాయపాలెం 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నాయి. అనంతపురం జిల్లా తేరన్నపల్లిలో 42.8, నెల్లూరు జిల్లా బోడిపాడు 42.1, కడప జిల్లా పొట్టిపాడు 41.0, గుంటూరు జిల్లా బండ్లమోడు 40.5, కర్నూలు జిల్లా పంచలింగాల 40.0 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నేడు 48 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం


దక్షిణ కోస్తాలోని అధికశాతం మండలాల్లో శుక్రవారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మొత్తం 83 మండలాల్లో తీవ్రత ఉంటుందని అంచనా వేయగా.. ఇందులో గుంటూరు జిల్లాలో 31, కృష్ణా జిల్లాలో 27, ప్రకాశం జిల్లాలోని 9 మండలాలు ఉన్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడా ప్రభావం ఉంటుంది.

48 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం: కృష్ణా జిల్లా ఉయ్యూరు


46 నుంచి 48 డిగ్రీల వరకు : కృష్ణా జిల్లా పమిడిముక్కల, ఉంగుటూరు, పెదపారుపూడి, కంకిపాడు, గుంటూరు జిల్లా కొల్లిపర


44.6 నుంచి 46 డిగ్రీల వరకు: పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు, దెందులూరు, కృష్ణా జిల్లా కంచికచెర్ల, వీరులపాడు, పామర్రు, నందివాడ, గుడివాడ, మొవ్వ, ఘంటశాల, ఆగిరిపల్లి, విజయవాడ, ఇబ్రహీంపట్నం, మందవల్లి.. గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు, పెద్దకాకాని, దుగ్గిరాల, కొల్లూరు, వేమూరు, తెనాలి, టి.చుండూరు, చేబ్రోలు, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, యడ్లపాడు, చిలకలూరిపేట, పెదనందిపాడు, కాకుమాను, పొన్నూరు, అమృతలూరు, భట్టిప్రోలు, చెరుకుపల్లి, నూజెండ్ల, ఫిరంగిపురం, ముప్పాళ్ల, తుళ్లూరు, అమరావతి, తాడికొండ.. ప్రకాశం జిల్లా బల్లికురవ, యద్దనపూడి, మార్టూరు, పర్చూరు, ఇంకొల్లు, పంగులూరు, కారంచేడు, సంతమాగులూరు, సంతనూతలపాడు.

ఇదీ చదవండి: 'పరిషత్' ఎన్నికలపై నేడు తెదేపా కీలక సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.