ETV Bharat / city

చైనాలో చిక్కుకున్న తెలుగు యువ ఇంజినీర్లు - telugu engineers strucked in china news

చైనాలో తెలుగు ఇంజినీర్లు చిక్కుకుపోయారు. శిక్షణలో ఉన్న 58 మంది ఇంజినీర్లు వుహాన్ హాస్టల్​లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ బిడ్డలను దేశానికి రప్పించాలని వారి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

telugu engineers strucked in china
చైనాలో చిక్కుకున్న తెలుగు ఇంజినీర్లు
author img

By

Published : Jan 29, 2020, 2:20 PM IST

చైనాలో కరోనా వైరస్ ప్రబలిన వుహాన్ నగరంలో తెలుగు యువ ఇంజినీర్లు చిక్కుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నుంచి ప్రాంగణ నియామకాల ద్వారా శ్రీసిటీ టీసీఎల్ కంపెనీకి 96 మంది యువ గ్రాడ్యుయేట్లు ఎంపికయ్యారు. వీరిని చైనా కేంద్ర కార్యాలయం వుహాన్​లోని ఆప్టో డిస్ప్లే టెక్నాలజీ ప్రైవేట్ కంపెనీకి 3 నెలల శిక్షణ నిమిత్తం పంపించారు. ఆగస్టులో వెళ్లిన 96 మంది ఇంజినీర్లలో 38 మంది స్వదేశానికి వచ్చేయగా, మిగిలిన 58 వుహాన్ కంపెనీకి చెందిన హాస్టల్​లోనే ఉండిపోయారు.

కరోనా వైరస్ ప్రబలిన తరుణంలో ఆ సంస్థ... వీరిని స్వస్థలాలకు పంపేందుకు ప్రయత్నించింది. అప్పటికే నిషేధం నిబంధనలు అమల్లోకి వచ్చిన కారణంగా.. కంపెనీ నిస్సహాయత వ్యక్తం చేసింది. అక్కడ శిక్షణ పొందుతున్న ఈ బృందం వారంతా తెలుగువారే.

గత ఏడాది ప్రాంగణ ఎంపికల్లో గీతం, గాయత్రీ, రఘు, అనిట్స్ ఇంజినీరింగ్​ కళాశాలల నుంచి ఈ ఇంజినీర్లు ఎంపికయ్యారు. వీరి బృందంలో 60 శాతం అమ్మాయిలే ఉన్నారు. తమ పిల్లలను తిరిగి భారత్​కు క్షేమంగా రప్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారి తల్లిదండ్రులు అభ్యర్ధిస్తున్నారు.

చైనాలో కరోనా వైరస్ ప్రబలిన వుహాన్ నగరంలో తెలుగు యువ ఇంజినీర్లు చిక్కుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నుంచి ప్రాంగణ నియామకాల ద్వారా శ్రీసిటీ టీసీఎల్ కంపెనీకి 96 మంది యువ గ్రాడ్యుయేట్లు ఎంపికయ్యారు. వీరిని చైనా కేంద్ర కార్యాలయం వుహాన్​లోని ఆప్టో డిస్ప్లే టెక్నాలజీ ప్రైవేట్ కంపెనీకి 3 నెలల శిక్షణ నిమిత్తం పంపించారు. ఆగస్టులో వెళ్లిన 96 మంది ఇంజినీర్లలో 38 మంది స్వదేశానికి వచ్చేయగా, మిగిలిన 58 వుహాన్ కంపెనీకి చెందిన హాస్టల్​లోనే ఉండిపోయారు.

కరోనా వైరస్ ప్రబలిన తరుణంలో ఆ సంస్థ... వీరిని స్వస్థలాలకు పంపేందుకు ప్రయత్నించింది. అప్పటికే నిషేధం నిబంధనలు అమల్లోకి వచ్చిన కారణంగా.. కంపెనీ నిస్సహాయత వ్యక్తం చేసింది. అక్కడ శిక్షణ పొందుతున్న ఈ బృందం వారంతా తెలుగువారే.

గత ఏడాది ప్రాంగణ ఎంపికల్లో గీతం, గాయత్రీ, రఘు, అనిట్స్ ఇంజినీరింగ్​ కళాశాలల నుంచి ఈ ఇంజినీర్లు ఎంపికయ్యారు. వీరి బృందంలో 60 శాతం అమ్మాయిలే ఉన్నారు. తమ పిల్లలను తిరిగి భారత్​కు క్షేమంగా రప్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారి తల్లిదండ్రులు అభ్యర్ధిస్తున్నారు.

ఇదీ చదవండి:

మెరుపు వేగంతో కరోనా పంజా.. వుహాన్​ రాకపోకలపై ఆంక్షలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.