ETV Bharat / city

తెలంగాణ: ఒకటి, రెండు రోజుల్లో పదోతరగతి ఫలితాలు - తెలంగాణ తాజా వార్తలు

పదో తరగతి ఫలితాలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమోదం తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో ఫలితాలను వెల్లడించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తోంది.

10 result
10 result
author img

By

Published : May 20, 2021, 10:51 AM IST

కరోనా తీవ్రత కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఎఫ్ఏ మార్కుల ఆధారంగా తుది మార్కులు కేటాయించి, గ్రేడ్లు ఖరారు చేయాలని ఆదేశిస్తూ ఆ రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు పరీక్ష రుసుం చెల్లించిన 5 లక్షల 21 వేల 393 మందిని ఉత్తీర్ణులు చేసి గ్రేడ్లు ప్రకటించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు చేసింది.

ఫలితాల విడుదలకు మంత్రి ఆమోద ముద్ర వేయడం వల్ల.. మార్కుల అప్​లోడింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. రేపు లేదా ఎల్లుండి ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నారు. దాదాపు సగం మంది విద్యార్థులకు 10 జీపీఏ దక్కే అవకాశం కనిపిస్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కరోనా తీవ్రత కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఎఫ్ఏ మార్కుల ఆధారంగా తుది మార్కులు కేటాయించి, గ్రేడ్లు ఖరారు చేయాలని ఆదేశిస్తూ ఆ రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు పరీక్ష రుసుం చెల్లించిన 5 లక్షల 21 వేల 393 మందిని ఉత్తీర్ణులు చేసి గ్రేడ్లు ప్రకటించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు చేసింది.

ఫలితాల విడుదలకు మంత్రి ఆమోద ముద్ర వేయడం వల్ల.. మార్కుల అప్​లోడింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. రేపు లేదా ఎల్లుండి ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నారు. దాదాపు సగం మంది విద్యార్థులకు 10 జీపీఏ దక్కే అవకాశం కనిపిస్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చూడండి:

మోల్నుపిరవిర్‌పై మూడో దశ క్లినికల్‌ పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.