ETV Bharat / city

ఆర్టీసీ సమ్మెపై వేచిచూసే ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం

author img

By

Published : Nov 21, 2019, 6:28 AM IST

Updated : Nov 21, 2019, 6:41 AM IST

ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం వేచి చూసే ధోరణితో ఉంది. సమ్మె విరమించేందుకు సిద్ధమన్న ఐకాస ప్రకటన, ఇతర పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. అన్ని అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించాకే.. ఓ నిర్ణయానికి వచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ సమ్మెపై వేచిచూసే ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం
ఆర్టీసీ సమ్మెపై వేచిచూసే ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో నెలకొన్న సందిగ్ధత ఇంకా వీడలేదు. షరతుల్లేకుండా విధుల్లోకి తీసుకునే వాతావరణాన్ని కల్పిస్తే సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ ఐకాస ప్రకటించింది. ఆ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఐకాస... హైకోర్టు తీర్పును ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం గౌరవిస్తాయని భావిస్తున్నట్లు పేర్కొంది. ఐకాస ప్రకటనపై ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. హైకోర్టు తీర్పు తర్వాత ఉత్పన్నమైన పరిణామాలు, ఐకాస ప్రకటన సహా అన్ని అంశాలను నిశితంగా గమనిస్తోంది.

రెండుసార్లు అవకాశం..

కార్మికులు విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేస్తూ.. సర్కారు గతంలోనే రెండుసార్లు అవకాశం కల్పించింది. ఎలాంటి షరతుల్లేకుండా విధుల్లో చేరాలని... విధుల్లో చేరే వారు మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా ఉంటారని సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ప్రకటన చేశారు. దీనిపై తక్కువ సంఖ్యలో మాత్రమే సానుకూలంగా స్పందించారు.

స్పందిస్తారా...?

ఐకాస కోరిన విధంగా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం స్పందిస్తాయా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది. ఆర్టీసీలో యూనియన్ల ప్రస్తావనే ఉండరాదని, వాటి నుంచి సంస్థకు విముక్తి లభించాలని సీఎం కేసీఆర్ ఇంతకు ముందు స్పష్టం చేశారు. కార్మికులు బేషరతుగా విధుల్లో చేరాలని సూచించారు. కార్మికశాఖ తదుపరి ప్రక్రియ చేపట్టేందుకు అనుమతివ్వాలని, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ తేలుస్తుందని హైకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్‌లోనూ సర్కారు స్పష్టం చేసింది.

ఎలాంటి నిర్ణయం...?

వీటన్నింటి నేపథ్యంలో సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై కార్మికుల భవిష్యత్ ఆధారపడి ఉంది. బుధవారం సాయంత్రం ఐకాస ప్రకటన తర్వాత ప్రభుత్వం, యాజమాన్యం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని అధికారులు కూడా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి తీసుకోబోయే నిర్ణయం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

ఇవీ చూడండి:

సీఎం గారూ ఆర్టీసీ కార్మికులను చేర్చుకోండి: పవన్​ కల్యాణ్

ఆర్టీసీ సమ్మెపై వేచిచూసే ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో నెలకొన్న సందిగ్ధత ఇంకా వీడలేదు. షరతుల్లేకుండా విధుల్లోకి తీసుకునే వాతావరణాన్ని కల్పిస్తే సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ ఐకాస ప్రకటించింది. ఆ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఐకాస... హైకోర్టు తీర్పును ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం గౌరవిస్తాయని భావిస్తున్నట్లు పేర్కొంది. ఐకాస ప్రకటనపై ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. హైకోర్టు తీర్పు తర్వాత ఉత్పన్నమైన పరిణామాలు, ఐకాస ప్రకటన సహా అన్ని అంశాలను నిశితంగా గమనిస్తోంది.

రెండుసార్లు అవకాశం..

కార్మికులు విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేస్తూ.. సర్కారు గతంలోనే రెండుసార్లు అవకాశం కల్పించింది. ఎలాంటి షరతుల్లేకుండా విధుల్లో చేరాలని... విధుల్లో చేరే వారు మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా ఉంటారని సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ప్రకటన చేశారు. దీనిపై తక్కువ సంఖ్యలో మాత్రమే సానుకూలంగా స్పందించారు.

స్పందిస్తారా...?

ఐకాస కోరిన విధంగా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం స్పందిస్తాయా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది. ఆర్టీసీలో యూనియన్ల ప్రస్తావనే ఉండరాదని, వాటి నుంచి సంస్థకు విముక్తి లభించాలని సీఎం కేసీఆర్ ఇంతకు ముందు స్పష్టం చేశారు. కార్మికులు బేషరతుగా విధుల్లో చేరాలని సూచించారు. కార్మికశాఖ తదుపరి ప్రక్రియ చేపట్టేందుకు అనుమతివ్వాలని, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ తేలుస్తుందని హైకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్‌లోనూ సర్కారు స్పష్టం చేసింది.

ఎలాంటి నిర్ణయం...?

వీటన్నింటి నేపథ్యంలో సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై కార్మికుల భవిష్యత్ ఆధారపడి ఉంది. బుధవారం సాయంత్రం ఐకాస ప్రకటన తర్వాత ప్రభుత్వం, యాజమాన్యం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని అధికారులు కూడా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి తీసుకోబోయే నిర్ణయం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

ఇవీ చూడండి:

సీఎం గారూ ఆర్టీసీ కార్మికులను చేర్చుకోండి: పవన్​ కల్యాణ్

File : TG_Hyd_05_21_Govt_on_RTC_Pkg_3053262 From : Raghu Vardhan ( ) ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో ప్రభుత్వం వేచిచూసే ధోరణితో ఉంది. సమ్మె విరమించేందుకు సిద్ధమన్న ఐకాస ప్రకటన, ఇతర పరిణామాలను సర్కార్ నిశితంగా గమనిస్తోంది. అన్ని అంశాలను పూర్తి స్థాయిలో గమనించాకే ఓ నిర్ణయానికి వచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది...లుక్ వాయిస్ ఓవర్ - ఆర్టీసీ సమ్మె విషయంలో నెలకొన్న సందిగ్ధత ఇంకా వీడలేదు. షరతుల్లేకుండా విధుల్లోకి తీసుకునే వాతావరణాన్ని కల్పిస్తే సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ కార్మికుల ఐకాస ప్రకటించింది. ఆ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఐకాస... హైకోర్టు తీర్పును ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం గౌరవిస్తాయని భావిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఆర్టీసీ యాజమాన్యం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఐకాస ప్రకటనపై ఇంకా స్పందించలేదు. హైకోర్టు తీర్పు తర్వాత ఉత్పన్నమైన పరిణామాలు, ఐకాస ప్రకటన సహా అన్ని అంశాలను సర్కార్ నిశితంగా గమనిస్తోంది. కార్మికులు విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే రెండు మార్లు అవకాశం కల్పించింది. ఎలాంటి షరతుల్లేకుండా విధుల్లో చేరాలని... విధుల్లో చేరే వారు మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా ఉంటారని సీఎం కేసీఆర్ అప్పుడు విస్పష్టమైన ప్రకటన చేశారు. అయినా కూడా విధుల్లో చేరేందుకు కార్మికులు అంతగా ఆసక్తి చూపలేదు. అతి తక్కువ సంఖ్యలో మాత్రమే కార్మికులు ప్రభుత్వ పిలుపునకు సానుకూలంగా స్పందించారు. అయితే హైకోర్టు తీర్పు అనంతర పరిణామాల నేపథ్యంలో షరతుల్లేకుండా విధుల్లో చేర్చుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధమని ఐకాస ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఏం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఐకాస కోరిన విధంగా స్పందిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఆర్టీసీలో యూనియన్ల ప్రస్తావనే ఉండరాదని, వాటి నుంచి సంస్థకు విముక్తి లభించాలని సీఎం కేసీఆర్ అప్పట్లో విస్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. కార్మికులు బేషరతుగా విధుల్లో చేరాలని అప్పట్లో తెలిపారు. కార్మిక శాఖ తదుపరి ప్రక్రియ చేపట్టేందుకు అనుమతివ్వాలని, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ తేలుస్తుందని హైకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్ లోనూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటన్నింటి నేపథ్యంలో సర్కార్ ఇపుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై కార్మికుల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. బుధవారం సాయంత్రం ఐకాస ప్రకటన తరువాత ప్రభుత్వం, యాజమాన్యం నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని అధికారులు కూడా చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న విషయం అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఐకాస ప్రకటనతో పాటు అన్ని అంశాలను సర్కార్ నిశితంగా గమనిస్తోంది.
Last Updated : Nov 21, 2019, 6:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.