ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కసరత్తును పాఠశాల విద్యాశాఖ చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియ ఇప్పటికే ముగియగా.. దీని పరిశీలన చేపట్టింది. బదిలీలకు ముందు హేతుబద్ధీకరణ పూర్తయితే ఖాళీలు, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల తప్పనిసరిగా బదిలీ కావాల్సిన ఉపాధ్యాయుల వివరాలు వెల్లడవుతాయి. జిల్లాలవారీగా పూర్తి చేసిన హేతుబద్ధీకరణ దస్త్రాలను ఈ నెల 16 నుంచి 18వరకు కమిషనరేట్లో పరిశీలించనున్నారు.
ఇదీ చదవండి: