మహానాడును తెలుగుదేశం కార్యకర్తలు విజయవంతం చేయాలని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పిలుపునిచ్చారు. కరోనా వల్ల వర్చువల్ మహానాడు నిర్వహిస్తున్నామని తెలిపారు. దాదాపు 25 వేల మంది కార్యకర్తలు కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు పూర్తిచేశామని వెల్లడించారు. మహానాడులో నేతలు మాట్లాడే అంశాలపై తీర్మానాలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి..