ETV Bharat / city

"చంద్రబాబు దిల్లీ వెళ్తే... తాడేపల్లిలో వణుకు మొదలైంది"

author img

By

Published : Aug 10, 2022, 2:25 PM IST

చంద్రబాబు దిల్లీ వెళ్తే... తాడేపల్లిలో వణుకు మొదలైందని తెదేపా నేతలు ఎద్దేవా చేశారు. మాధవ్ నగ్న వీడియో వ్యవహారంపై సీఎం జగన్ మౌనం వీడాలని బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తనను కేసుల్లో ఇరికించేందుకు కుట్ర చేస్తోందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. నియోజకవర్గంలో మాజీ మిలిటెంట్లను దింపి.. తనపై మానసిక ఒత్తిడి పెంచేలా.. వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

TDP
తెదేపా

BondaUma: తెదేపా అధినేత చంద్రబాబు దిల్లీ వెళ్తే తాడేపల్లిలో వణుకు మొదలైందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. 40 ఏళ్లల్లో కొన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నామన్న ఆయన.. పొత్తులనేవి ఉంటే స్వయంగా చంద్రబాబే చెబుతారని స్పష్టం చేశారు. రహస్యంగా పొత్తులు పెట్టుకోవడం కుదరదు కదా అని అన్నారు. జగన్ ఇన్నిసార్లు దిల్లీ వెళ్లినా.. ఒక్క పనైనా పూర్తి చేసుకుని వచ్చారా అని నిలదీశారు. సింహంలా ఫ్లైటెక్కడం.. దిల్లీలో లెగ్ అప్పీల్ చేసుకోవడమే జగన్ తీరు అని విమర్శించారు. ఏ2 విజయసాయిరెడ్డి దిల్లీలో కూర్చొని లంచులు.. సంచులతో మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుంటూ ఓటుకు నోటు కేసులో వైకాపా ఎమ్మెల్యే ఆర్కే సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఛీ కొట్టించుకున్నారని గుర్తుచేశారు.

తెదేపా నేతలు

ఓటుకు నోటు కేసు ఛార్జ్ షీటులో చంద్రబాబు పేరు కూడా లేదని తెలిపారు. జగన్... దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు. సీఎం జగన్ గ్రాఫ్ పడిపోతుందని... అందుకే కార్యకర్తలను పిలిచి మాట్లాడుతున్నారని బోండా ఉమా ఎద్దేవా చేశారు. సీఎం ఇంటి గేటు ముందు బొత్స దిగితే గతంలో సమయం లేదని వెనక్కి పంపేశారని... అలాంటి పరిస్థితి నుంచి పిలిపించుకుని మాట్లాడే స్థితికి చేరారన్నారు. అంబటి, అవంతి వాయిస్​ను ఫోరెన్సిక్ ల్యాబుకు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. సజ్జల కానీ.. మాధవ్ ను వెనకేసుకొచ్చే ఏ నాయకుడైనా.. మాధవ్ వీడియోను వాళ్ల ఇంట్లో చూపగలరా అని నిలదీశారు. మాధవ్ నగ్న వీడియో వ్యవహారంపై సీఎం జగన్ మౌనం వీడాలని బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

త్వరలోనే తనపై కేసు నమోదవుతుందని కొందరు చెప్పారని తెదేపా నేత పయ్యావులు కేశవ్​ అన్నారు. ప్రభుత్వం కేసు పెట్టాలనుకుంటే తాము ఆపలేమన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటానని తెలిపారు. మూడు నెలల నుంచి విచిత్ర వాదన తీసుకొస్తున్నారని... తన భద్రత విషయంలోనూ రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర సరిహద్దు దాటితే నాతో పాటు భద్రత సిబ్బంది రాదని చెబుతున్నారని పేర్కొన్నారు. భద్రత విషయంలో వైకాపా నేతలకు ఎలాంటి షరతులు లేవా? అని ప్రశ్నించారు. గన్‌మెన్లను మారిస్తే తప్పులేదని... కానీ తన గన్‌మెన్లనే ఎందుకు మారుస్తారో చెప్పాలన్నారు. సెక్యూరిటీ, కేసుల విషయంలో తనపై కుట్ర జరుగుతోందని సమాచారం ఉందని తెలిపారు. మానసిక ఒత్తిడికి గురిచేయాలనేదే ప్రభుత్వ కుట్ర అని పయ్యావుల అన్నారు.

ఇవీ చదవండి:

BondaUma: తెదేపా అధినేత చంద్రబాబు దిల్లీ వెళ్తే తాడేపల్లిలో వణుకు మొదలైందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. 40 ఏళ్లల్లో కొన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నామన్న ఆయన.. పొత్తులనేవి ఉంటే స్వయంగా చంద్రబాబే చెబుతారని స్పష్టం చేశారు. రహస్యంగా పొత్తులు పెట్టుకోవడం కుదరదు కదా అని అన్నారు. జగన్ ఇన్నిసార్లు దిల్లీ వెళ్లినా.. ఒక్క పనైనా పూర్తి చేసుకుని వచ్చారా అని నిలదీశారు. సింహంలా ఫ్లైటెక్కడం.. దిల్లీలో లెగ్ అప్పీల్ చేసుకోవడమే జగన్ తీరు అని విమర్శించారు. ఏ2 విజయసాయిరెడ్డి దిల్లీలో కూర్చొని లంచులు.. సంచులతో మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుంటూ ఓటుకు నోటు కేసులో వైకాపా ఎమ్మెల్యే ఆర్కే సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఛీ కొట్టించుకున్నారని గుర్తుచేశారు.

తెదేపా నేతలు

ఓటుకు నోటు కేసు ఛార్జ్ షీటులో చంద్రబాబు పేరు కూడా లేదని తెలిపారు. జగన్... దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు. సీఎం జగన్ గ్రాఫ్ పడిపోతుందని... అందుకే కార్యకర్తలను పిలిచి మాట్లాడుతున్నారని బోండా ఉమా ఎద్దేవా చేశారు. సీఎం ఇంటి గేటు ముందు బొత్స దిగితే గతంలో సమయం లేదని వెనక్కి పంపేశారని... అలాంటి పరిస్థితి నుంచి పిలిపించుకుని మాట్లాడే స్థితికి చేరారన్నారు. అంబటి, అవంతి వాయిస్​ను ఫోరెన్సిక్ ల్యాబుకు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. సజ్జల కానీ.. మాధవ్ ను వెనకేసుకొచ్చే ఏ నాయకుడైనా.. మాధవ్ వీడియోను వాళ్ల ఇంట్లో చూపగలరా అని నిలదీశారు. మాధవ్ నగ్న వీడియో వ్యవహారంపై సీఎం జగన్ మౌనం వీడాలని బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

త్వరలోనే తనపై కేసు నమోదవుతుందని కొందరు చెప్పారని తెదేపా నేత పయ్యావులు కేశవ్​ అన్నారు. ప్రభుత్వం కేసు పెట్టాలనుకుంటే తాము ఆపలేమన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటానని తెలిపారు. మూడు నెలల నుంచి విచిత్ర వాదన తీసుకొస్తున్నారని... తన భద్రత విషయంలోనూ రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర సరిహద్దు దాటితే నాతో పాటు భద్రత సిబ్బంది రాదని చెబుతున్నారని పేర్కొన్నారు. భద్రత విషయంలో వైకాపా నేతలకు ఎలాంటి షరతులు లేవా? అని ప్రశ్నించారు. గన్‌మెన్లను మారిస్తే తప్పులేదని... కానీ తన గన్‌మెన్లనే ఎందుకు మారుస్తారో చెప్పాలన్నారు. సెక్యూరిటీ, కేసుల విషయంలో తనపై కుట్ర జరుగుతోందని సమాచారం ఉందని తెలిపారు. మానసిక ఒత్తిడికి గురిచేయాలనేదే ప్రభుత్వ కుట్ర అని పయ్యావుల అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.