ETV Bharat / city

సంగం డెయిరీ స్వాధీనం కోసమే ప్రభుత్వం తప్పుడు జీవో: పట్టాభి

సంగం డెయిరీ స్వాధీనం కోసమే ప్రభుత్వం తప్పుడు జీవో ఇచ్చిందన్నారు తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్. ఏడాది క్రితమే సంగం డెయిరీని హస్తగతం చేసుకునేందుకు ప్రణాళికలు రచించారని ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్ర ఛైర్మన్​గా ఉంటే సాధ్యం కాదని తెలిసి.. ఆయన్ను అరెస్ట్ చేశారన్నారు. పాడి రైతుల నోట్లో మట్టికొడుతూ తీసుకొచ్చిన తప్పుడు జీవోపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

author img

By

Published : Apr 27, 2021, 6:21 PM IST

Updated : Apr 27, 2021, 7:20 PM IST

sangam dairy management change
ap govt orders on sangam dairy

సంగం డెయిరీ యాజమాన్యం మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వటాన్ని తెలుగుదేశం పార్టీ ఖండించింది. సంగం డెయిరీని హస్తగతం చేసుకునేందుకే ప్రభుత్వం తప్పుడు జీవో తీసుకొచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ విమర్శించారు. జీవో నెంబర్ 19 ఇవ్వటం దుర్మార్గమన్నారు. కంపెనీ యాక్ట్ ప్రకారం ఏర్పాటైన కంపెనీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం కుదరదన్న ఆయన.. ఏడాది క్రితమే సంగం డెయిరీ హస్తగతం కోసం ప్రణాళికలు రచించారని ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్ర ఛైర్మన్​గా ఉంటే అది సాధ్యం కాదు కాబట్టే కుట్రతో ఆయన్ని అరెస్టు చేశాక జీవో ఇచ్చారని వ్యాఖ్యానించారు.

'నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ప్రోత్సాహంతో ఏర్పాటైన ప్రొడ్యూసర్ కంపెనీ.. సంగం డెయిరీ. ఎన్డీడీబీకి సంగం ఆస్తులు తనఖా పెట్టి రుణం తెచ్చుకున్నారని మోపిన అభియోగంలో తప్పేముంది. రుణం తీసుకోవటం నరేంద్ర చేసింది నేరమైతే ఎన్డీడీబీ అధికారులదీ నేరమే. ఎన్డీడీబీ అధికారులపైనా కేసు పెట్టగలరా..? 367సొసైటీలు, లక్షా 27వేల మంది రైతుల భాగస్వామ్యులుగా ఉన్న కంపెనీకి నరేంద్ర ప్రతినిధి మాత్రమే. అమూల్ కి రాష్ట్రంలోని పాడి వ్యాపారం మొత్తం కట్టబెట్టేందుకే ఈ కుట్ర చేశారు.'- పట్టాభిరామ్, తెదేపా అధికార ప్రతినిధి

తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్

భూమి బదలాయింపు పై మోపిన మరో అభియోగంలో ట్రస్టు ద్వారా ఆసపత్రి ఏర్పాటు చేశారని పట్టాభి తెలిపారు. వైద్య సేవను చూసి ఓర్వలేక తప్పుడు కేసు నమోదు చేశారని దుయ్యబట్టారు. పాడి రైతుల నోట్లో మట్టికొడుతూ తీసుకొచ్చిన తప్పుడు జీవోపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి ఒత్తిడికి తలొంచి తప్పుడు జీవోలు ఇస్తే భవిష్యత్తులో అధికారులే బలవుతారని హెచ్చరించారు.

ఇదీ చదవండి: సంగం డెయిరీ యాజమాన్యం మారుస్తూ ఉత్తర్వులు

సంగం డెయిరీ యాజమాన్యం మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వటాన్ని తెలుగుదేశం పార్టీ ఖండించింది. సంగం డెయిరీని హస్తగతం చేసుకునేందుకే ప్రభుత్వం తప్పుడు జీవో తీసుకొచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ విమర్శించారు. జీవో నెంబర్ 19 ఇవ్వటం దుర్మార్గమన్నారు. కంపెనీ యాక్ట్ ప్రకారం ఏర్పాటైన కంపెనీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం కుదరదన్న ఆయన.. ఏడాది క్రితమే సంగం డెయిరీ హస్తగతం కోసం ప్రణాళికలు రచించారని ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్ర ఛైర్మన్​గా ఉంటే అది సాధ్యం కాదు కాబట్టే కుట్రతో ఆయన్ని అరెస్టు చేశాక జీవో ఇచ్చారని వ్యాఖ్యానించారు.

'నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ప్రోత్సాహంతో ఏర్పాటైన ప్రొడ్యూసర్ కంపెనీ.. సంగం డెయిరీ. ఎన్డీడీబీకి సంగం ఆస్తులు తనఖా పెట్టి రుణం తెచ్చుకున్నారని మోపిన అభియోగంలో తప్పేముంది. రుణం తీసుకోవటం నరేంద్ర చేసింది నేరమైతే ఎన్డీడీబీ అధికారులదీ నేరమే. ఎన్డీడీబీ అధికారులపైనా కేసు పెట్టగలరా..? 367సొసైటీలు, లక్షా 27వేల మంది రైతుల భాగస్వామ్యులుగా ఉన్న కంపెనీకి నరేంద్ర ప్రతినిధి మాత్రమే. అమూల్ కి రాష్ట్రంలోని పాడి వ్యాపారం మొత్తం కట్టబెట్టేందుకే ఈ కుట్ర చేశారు.'- పట్టాభిరామ్, తెదేపా అధికార ప్రతినిధి

తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్

భూమి బదలాయింపు పై మోపిన మరో అభియోగంలో ట్రస్టు ద్వారా ఆసపత్రి ఏర్పాటు చేశారని పట్టాభి తెలిపారు. వైద్య సేవను చూసి ఓర్వలేక తప్పుడు కేసు నమోదు చేశారని దుయ్యబట్టారు. పాడి రైతుల నోట్లో మట్టికొడుతూ తీసుకొచ్చిన తప్పుడు జీవోపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి ఒత్తిడికి తలొంచి తప్పుడు జీవోలు ఇస్తే భవిష్యత్తులో అధికారులే బలవుతారని హెచ్చరించారు.

ఇదీ చదవండి: సంగం డెయిరీ యాజమాన్యం మారుస్తూ ఉత్తర్వులు

Last Updated : Apr 27, 2021, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.