ETV Bharat / city

రాష్ట్రంలో కొనసాగుతున్న కర్ఫ్యూ.. కఠిన నిబంధనలు అమలు

author img

By

Published : May 30, 2021, 5:01 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. అధికారులు కొవిడ్ కట్టడి చర్యలు పర్యవేక్షిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ లాక్​డౌన్​ను అమలు చేస్తున్నారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతినిచ్చిన పోలీసులు.. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి జరిమానా విధించారు.

ఏపీ కర్ఫ్యూ
ఏపీ కర్ఫ్యూ

కరోనా కట్టడిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాలకొల్లులో సంపుర్ణ లాక్​డౌన్ అమలు చేస్తుండగా.. అనవసరంగా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ శ్రావణి హెచ్చరించారు. లాక్​డౌన్ అమలు తీరును ఆమె పరిశీలించారు. 30 మంది వాహనదారులకు జరిమానాలు విధించారు.

ప్రకాశం జిల్లా కనిగిరిలో కరోనా నియంత్రణలో భాగంగా మండల టాస్క్ ఫోర్స్ అధికారులు మూడు రోజులుగా సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ టీమ్ పట్టణంలో సంచరిస్తూ దుకాణాలు తెరవకుండా, వాహనదారులు అనవసరంగా రోడ్లపై తిరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర సేవలు మినహా ఇతరులను రోడ్లపైకి అనుమతించడం లేదు. అత్యవసర ప్రయాణాలు చేస్తూ ఆహారం కోసం ఇబ్బంది పడుతున్న వారికి, నిరాశ్రయులకు, యాచకులకు, ఇంటి వద్ద కరోనా చికిత్స పొందుతున్న వారికి స్నేహహస్తం టీమ్ ద్వారా టాస్క్​ఫోర్స్ సిబ్బంది ఆహారాన్ని అందిస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కర్ఫ్యూ నిబంధనలను అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఆరు వారాల నిరవధిక కర్ఫ్యూ అమలు కారణంగా గత రెండు వారాలుగా కేసులు తగ్గుముఖం పట్టాయి. రాబోయే రెండు మూడు వారాల్లో కేసులు మరింత తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.


ఇదీ చదవండి: 2 years for ycp: జేసీబీ, ఏసీబీ, పీసీబీ.. టాగ్ లైన్ సీఐడీ: అచ్చెన్నాయుడు

కరోనా కట్టడిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాలకొల్లులో సంపుర్ణ లాక్​డౌన్ అమలు చేస్తుండగా.. అనవసరంగా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ శ్రావణి హెచ్చరించారు. లాక్​డౌన్ అమలు తీరును ఆమె పరిశీలించారు. 30 మంది వాహనదారులకు జరిమానాలు విధించారు.

ప్రకాశం జిల్లా కనిగిరిలో కరోనా నియంత్రణలో భాగంగా మండల టాస్క్ ఫోర్స్ అధికారులు మూడు రోజులుగా సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ టీమ్ పట్టణంలో సంచరిస్తూ దుకాణాలు తెరవకుండా, వాహనదారులు అనవసరంగా రోడ్లపై తిరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర సేవలు మినహా ఇతరులను రోడ్లపైకి అనుమతించడం లేదు. అత్యవసర ప్రయాణాలు చేస్తూ ఆహారం కోసం ఇబ్బంది పడుతున్న వారికి, నిరాశ్రయులకు, యాచకులకు, ఇంటి వద్ద కరోనా చికిత్స పొందుతున్న వారికి స్నేహహస్తం టీమ్ ద్వారా టాస్క్​ఫోర్స్ సిబ్బంది ఆహారాన్ని అందిస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కర్ఫ్యూ నిబంధనలను అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఆరు వారాల నిరవధిక కర్ఫ్యూ అమలు కారణంగా గత రెండు వారాలుగా కేసులు తగ్గుముఖం పట్టాయి. రాబోయే రెండు మూడు వారాల్లో కేసులు మరింత తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.


ఇదీ చదవండి: 2 years for ycp: జేసీబీ, ఏసీబీ, పీసీబీ.. టాగ్ లైన్ సీఐడీ: అచ్చెన్నాయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.