ETV Bharat / city

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 5వ తేదీ తరువాతే!

author img

By

Published : Aug 2, 2020, 10:54 PM IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జులై నెల జీతం కూడా ఆలస్యంగా అందనుంది. ఈ నెల 5 తరువాతే జీతాలు చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. విశ్రాంత ఉద్యోగులకూ పెన్షన్లు ఈ నెల 8 నాటికి అందే అవకాశాలున్నాయి.

state-govt-employees-salaries-will-credit-after-august-5th
state-govt-employees-salaries-will-credit-after-august-5th

ఉద్యోగుల జీతాలు.. 3 వేల 200 కోట్లు, పెన్షన్లర్లకు పెన్షన్ల కోసం 13 వందల కోట్లు ఈ నెలకు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కలిపి మొత్తం 5వేల 500కోట్లు చెల్లింపులు జరగాలి. రాష్ట్ర ఖజానాలో నిల్వ వెయ్యి కోట్ల రూపాయలే ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో బాండ్ల వేలం ద్వారా నిధులు సేకరించి వేతనాలు, పెన్షన్లు అందించాలని భావిస్తోంది. సోమవారం సెలవు కావడంతో మంగళ, బుధ వారాల్లో బాండ్ల వేలం ద్వారా ప్రభుత్వం నిధులు సేకరించనుంది. నిధుల సౌలభ్యం ఆధారంగా జీతాలు విడుదల చేయాలని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. గత నెలలోనూ రాష్ట్ర వార్షిక బడ్జెట్ సకాలంలో ఆమోదం పొందని కారణంగా ఉద్యోగులు జీతాలు ఆలస్యంగా అందుకున్నారు. ఈ నెలలో నిధుల కొరత వల్ల ఆలస్యం కానుంది.

ఉద్యోగుల జీతాలు.. 3 వేల 200 కోట్లు, పెన్షన్లర్లకు పెన్షన్ల కోసం 13 వందల కోట్లు ఈ నెలకు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కలిపి మొత్తం 5వేల 500కోట్లు చెల్లింపులు జరగాలి. రాష్ట్ర ఖజానాలో నిల్వ వెయ్యి కోట్ల రూపాయలే ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో బాండ్ల వేలం ద్వారా నిధులు సేకరించి వేతనాలు, పెన్షన్లు అందించాలని భావిస్తోంది. సోమవారం సెలవు కావడంతో మంగళ, బుధ వారాల్లో బాండ్ల వేలం ద్వారా ప్రభుత్వం నిధులు సేకరించనుంది. నిధుల సౌలభ్యం ఆధారంగా జీతాలు విడుదల చేయాలని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. గత నెలలోనూ రాష్ట్ర వార్షిక బడ్జెట్ సకాలంలో ఆమోదం పొందని కారణంగా ఉద్యోగులు జీతాలు ఆలస్యంగా అందుకున్నారు. ఈ నెలలో నిధుల కొరత వల్ల ఆలస్యం కానుంది.

ఇదీ చదవండి: రాజకీయ కక్ష కోసమే రాజధాని మార్పు: అమరావతి రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.