ETV Bharat / city

పోరంబోకు స్థలాలపై వైకాపా సర్కార్ కీలక నిర్ణయం - ఏపీలో పోరంబోకు స్థలాలు

ఉగాదికి ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైన భూసేకరణకు అవాంతరాలు ఎదురవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని 10 రకాల పోరంబోకు స్థలాలను డీనోటిఫై చేసింది.

cm jagan
cm jagan
author img

By

Published : Mar 3, 2020, 6:05 AM IST

రాష్ట్రంలోని అన్ని పోరంబోకు స్థలాలను డీనోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు ఇళ్లస్థలాల కార్యక్రమం అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. బండిదారి, కాలిదారి, డొంక, బయలు, రోడ్డు పోరంబోకు, కొండ గుట్ట పోరంబోకు, రాతి స్థలం, పాయిఖానా, బంజరు, తాలూక బోర్డు వంటి వివిధ రకాలైన పోరంబోకు స్థలాలను డీనోటిఫై చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పోరంబోకు స్థలాల్లో లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్రంలోని అన్ని పోరంబోకు స్థలాలను డీనోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు ఇళ్లస్థలాల కార్యక్రమం అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. బండిదారి, కాలిదారి, డొంక, బయలు, రోడ్డు పోరంబోకు, కొండ గుట్ట పోరంబోకు, రాతి స్థలం, పాయిఖానా, బంజరు, తాలూక బోర్డు వంటి వివిధ రకాలైన పోరంబోకు స్థలాలను డీనోటిఫై చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పోరంబోకు స్థలాల్లో లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదీ చదవండి

'మా స్థలాలు లాక్కుంటే ఆత్మహత్యలే శరణ్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.