ETV Bharat / city

కరోనా ఉందని తండ్రి మృతదేహాన్ని ఆస్పత్రిలోనే వదిలేసిన కుమారుడు - ఆస్పత్రిలోనే తండ్రి మృతదేహాన్ని వదిలి వెళ్లిన కుమారుడు

కంటికి రెప్పలా చూసుకొని పెంచి పోషించిన తండ్రికి కరోనా సోకి చనిపోతే... ఆయన మృతదేహాన్ని ఆస్పత్రిలోనే కొడుకు వదిలి వెళ్లిన అమానవీయ సంఘటన తెలంగాణ రాష్ట్రం సిద్దిపేటలో చోటు చేసుకుంది. అంబులెన్సులో ఎక్కించేవరకు అక్కడే ఉన్న తనయుడు... ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

son-left-the-fathers-body-in-the-hospital-in-siddipet-district
అంబులెన్సులో ఎక్కించేవరకు ఉండి... ఆపై వెళ్లిపోయాడు
author img

By

Published : Aug 6, 2020, 4:27 PM IST

తండ్రి మృతదేహాన్ని కొడుకు ఆస్పత్రిలోనే వదిలి వెళ్లిన అమానవీయ సంఘటన తెలంగాణ రాష్ట్రం సిద్దిపేటలో జరిగింది. కరోనా లక్షణాలతో ఉదయం సిద్దిపేట ఆస్పత్రిలో చేరిన వృద్ధుడు సాయంత్రం 4 గంటలకు మృతి చెందాడు. తండ్రి మరణవార్తను కుమారునికి తెలియజేసిన వైద్యసిబ్బంది... మృతదేహాన్ని అప్పగించారు.

అంబులెన్సులో ఎక్కించే వరకు అక్కడే ఉండి... ఆ తర్వాత అక్కడి నుంచి జారుకున్నాడు. చేసేదేమీలేక వృద్ధుడి శవాన్ని సిబ్బంది సిద్దిపేట ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కుమారుడి నిర్వాకంపై ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి.

తండ్రి మృతదేహాన్ని కొడుకు ఆస్పత్రిలోనే వదిలి వెళ్లిన అమానవీయ సంఘటన తెలంగాణ రాష్ట్రం సిద్దిపేటలో జరిగింది. కరోనా లక్షణాలతో ఉదయం సిద్దిపేట ఆస్పత్రిలో చేరిన వృద్ధుడు సాయంత్రం 4 గంటలకు మృతి చెందాడు. తండ్రి మరణవార్తను కుమారునికి తెలియజేసిన వైద్యసిబ్బంది... మృతదేహాన్ని అప్పగించారు.

అంబులెన్సులో ఎక్కించే వరకు అక్కడే ఉండి... ఆ తర్వాత అక్కడి నుంచి జారుకున్నాడు. చేసేదేమీలేక వృద్ధుడి శవాన్ని సిబ్బంది సిద్దిపేట ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కుమారుడి నిర్వాకంపై ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి.

ఇవీ చూడండి:

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో కరోనాతో ఖైదీ మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.