ETV Bharat / city

రాష్ట్రానికి సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు - రాష్ట్రానికి సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు

రాష్ట్రంలో సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. విద్యుత్‌ ఎగుమతి విధానంలో 5 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీ ఆసక్తి చూపుతోంది. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) మరో 3 వేల మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు సంస్థలను ఎంపిక చేయనుంది. మరిన్ని సంస్థలూ రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్‌) అధికారులు తెలిపారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోలార్‌, విండ్‌ ఎనర్జీ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం రాష్ట్రంలో 38,500 మెగావాట్ల సౌర విద్యుత్‌, 44,229 మెగావాట్ల పవన విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశం ఉంది.

power
power
author img

By

Published : Jan 23, 2021, 9:55 AM IST

విద్యుత్‌ ఎగుమతి విధానంలో 17,800 మెగావాట్ల సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు 7చోట్ల అవకాశం ఉందని నెడ్‌క్యాప్‌ గుర్తించింది. వీటిని 2022 నాటికి పూర్తిచేయాలని భావిస్తోంది. వాటి ఏర్పాటుకు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 80 వేల ఎకరాలను గుర్తించింది. ప్రతిపాదించిన 17,800 మెగావాట్లలో.. 9వేల మెగావాట్ల ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు పలు సంస్థలు నెడ్‌క్యాప్‌ను సంప్రదించాయి. కొవిడ్‌ నేపథ్యంలో సంప్రదింపులు కొలిక్కి రావటం ఆలస్యమైంది. సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా రూ.89వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని నెడ్‌క్యాప్‌ అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా తలుపుల, ఓబుళదేవరచెరువు, రాళ్లఅనంతపురం, కడప జిల్లా బద్వేల్‌, కలశపాడు, కర్నూలు జిల్లా అవుకు, కొలిమిగుండ్లలలో ప్రాజెక్టుల ఏర్పాటుకు భూములను గుర్తించారు.

ఇక్కడే ప్రాజెక్టులకు అవకాశం: నెడ్‌క్యాప్‌ ఎండీ రమణారెడ్డి

రాజస్థాన్‌, గుజరాత్‌ తర్వాత రాష్ట్రంలోనే సౌర ప్రాజెక్టుల ఏర్పాటుకు అవకాశం ఉంది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలతో (పీపీఏ) సంబంధం లేకుండా విద్యుత్‌ ఎగుమతి విధానంలో ప్రాజెక్టులను సంస్థలు ఏర్పాటు చేస్తాయి. ఇక్కడ ఉత్పత్తిచేసిన విద్యుత్‌ను బయటి రాష్ట్రాలకు తీసుకెళ్లటానికి సదుపాయాలను అభివృద్ధి చేస్తాం. అనంతపురంలోని ఓబుళదేవరచెరువు, కదిరి, కడపలోని బద్వేలు దగ్గర సబ్‌స్టేషన్లను ప్రతిపాదించాం. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ కర్నూలు జిల్లాలో 5,500 మెగావాట్లు, అనంతపురంలో 2,500 మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయటానికి కొత్త సబ్‌ స్టేషన్లను ఏర్పాటుచేస్తుంది.

విద్యుత్‌ ఎగుమతి విధానంలో 17,800 మెగావాట్ల సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు 7చోట్ల అవకాశం ఉందని నెడ్‌క్యాప్‌ గుర్తించింది. వీటిని 2022 నాటికి పూర్తిచేయాలని భావిస్తోంది. వాటి ఏర్పాటుకు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 80 వేల ఎకరాలను గుర్తించింది. ప్రతిపాదించిన 17,800 మెగావాట్లలో.. 9వేల మెగావాట్ల ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు పలు సంస్థలు నెడ్‌క్యాప్‌ను సంప్రదించాయి. కొవిడ్‌ నేపథ్యంలో సంప్రదింపులు కొలిక్కి రావటం ఆలస్యమైంది. సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా రూ.89వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని నెడ్‌క్యాప్‌ అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా తలుపుల, ఓబుళదేవరచెరువు, రాళ్లఅనంతపురం, కడప జిల్లా బద్వేల్‌, కలశపాడు, కర్నూలు జిల్లా అవుకు, కొలిమిగుండ్లలలో ప్రాజెక్టుల ఏర్పాటుకు భూములను గుర్తించారు.

ఇక్కడే ప్రాజెక్టులకు అవకాశం: నెడ్‌క్యాప్‌ ఎండీ రమణారెడ్డి

రాజస్థాన్‌, గుజరాత్‌ తర్వాత రాష్ట్రంలోనే సౌర ప్రాజెక్టుల ఏర్పాటుకు అవకాశం ఉంది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలతో (పీపీఏ) సంబంధం లేకుండా విద్యుత్‌ ఎగుమతి విధానంలో ప్రాజెక్టులను సంస్థలు ఏర్పాటు చేస్తాయి. ఇక్కడ ఉత్పత్తిచేసిన విద్యుత్‌ను బయటి రాష్ట్రాలకు తీసుకెళ్లటానికి సదుపాయాలను అభివృద్ధి చేస్తాం. అనంతపురంలోని ఓబుళదేవరచెరువు, కదిరి, కడపలోని బద్వేలు దగ్గర సబ్‌స్టేషన్లను ప్రతిపాదించాం. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ కర్నూలు జిల్లాలో 5,500 మెగావాట్లు, అనంతపురంలో 2,500 మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయటానికి కొత్త సబ్‌ స్టేషన్లను ఏర్పాటుచేస్తుంది.

ఇదీ చదవండి:

రామతీర్థానికి రాములోరు.. కొత్త విగ్రహాల తయారీ పూర్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.