ETV Bharat / city

రాజధాని అంశంపై బిల్లుపై 8 మంది సభ్యులతో సెలెక్ట్‌ కమిటీ

author img

By

Published : Feb 6, 2020, 2:03 PM IST

Updated : Feb 6, 2020, 3:34 PM IST

Select Committee
Select Committee

14:01 February 06

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై 8 మంది సభ్యులతో సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటైంది. సెలెక్ట్‌ కమిటీ ఛైర్మన్‌గా మంత్రి బొత్స సత్యనారాయణ, వికేంద్రీకరణ బిల్లు-2020 సెలెక్ట్ కమిటీకి ఛైర్మన్ గా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని వ్యవహరిస్తారు.

పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు సంబంధించి సెలక్ట్ కమిటీలను నియమిస్తూ... శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. సీఆర్డీఏ రద్దు బిల్లుపై 8 మంది సభ్యులను సెలెక్ట్ కమిటీకి నియమించారు. ఈ కమిటీ ఛైర్మన్​గా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవహరిస్తారు. జి.దీపక్ రెడ్డి, బచ్చుల అర్జునుడు, బీదా రవిచంద్ర, గౌనివారి శ్రీనివాసులు, షేక్ మహమ్మద్ ఇక్బాల్ , ఇళ్ల వెంకటేశ్వరరావు, సోము వీర్రాజు సభ్యులుగా నియమితులయ్యారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని వికేంద్రీకరణ బిల్లు - 2020 సెలెక్ట్ కమిటీకి ఛైర్మన్​గా నియమించారు. పి.అశోక్ బాబు, నారా లోకేశ్ , జి.తిప్పేస్వామి, జి.సంధ్యారాణి, వెన్నపూస గోపాల్ రెడ్డి, కేఎస్ లక్ష్మణరావు, పీవీఎన్ మాధవ్ ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు. 

14:01 February 06

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై 8 మంది సభ్యులతో సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటైంది. సెలెక్ట్‌ కమిటీ ఛైర్మన్‌గా మంత్రి బొత్స సత్యనారాయణ, వికేంద్రీకరణ బిల్లు-2020 సెలెక్ట్ కమిటీకి ఛైర్మన్ గా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని వ్యవహరిస్తారు.

పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు సంబంధించి సెలక్ట్ కమిటీలను నియమిస్తూ... శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. సీఆర్డీఏ రద్దు బిల్లుపై 8 మంది సభ్యులను సెలెక్ట్ కమిటీకి నియమించారు. ఈ కమిటీ ఛైర్మన్​గా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవహరిస్తారు. జి.దీపక్ రెడ్డి, బచ్చుల అర్జునుడు, బీదా రవిచంద్ర, గౌనివారి శ్రీనివాసులు, షేక్ మహమ్మద్ ఇక్బాల్ , ఇళ్ల వెంకటేశ్వరరావు, సోము వీర్రాజు సభ్యులుగా నియమితులయ్యారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని వికేంద్రీకరణ బిల్లు - 2020 సెలెక్ట్ కమిటీకి ఛైర్మన్​గా నియమించారు. పి.అశోక్ బాబు, నారా లోకేశ్ , జి.తిప్పేస్వామి, జి.సంధ్యారాణి, వెన్నపూస గోపాల్ రెడ్డి, కేఎస్ లక్ష్మణరావు, పీవీఎన్ మాధవ్ ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు. 

Last Updated : Feb 6, 2020, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.