ETV Bharat / city

ఓపెన్‌ రీచ్‌లలో తవ్వకాల నిలిపివేత.. ఇసుక దొరక్క కష్టాలు

author img

By

Published : Apr 22, 2021, 8:17 AM IST

రాష్ట్రంలో ఇసుక దొరక్క సామాన్యులు ఇబ్బుందులు పడుతున్నారు. అన్ని జిల్లాల్లో నదుల్లోని ఓపెన్‌ రీచ్‌లలో ఇసుక తవ్వకాలు దాదాపు నిలిపేశారు. ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించేనాటికి, ఏపీఎండీసీ పరిధిలో ఆన్‌లైన్‌లో బుక్‌ అయిన ఇసుకంతా సరఫరా జరిగి, పెండింగ్‌ లేకుండా చూసేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఫలితంగా.. ఇసుక అవసరమైన సామాన్యులకు ఇబ్బందులు తప్పట్లేదు.

sand shortage  problems in Andhra Pradesh
sand shortage problems in Andhra Pradesh

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) తగిన ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు ప్రస్తుతం ఇసుక అవసరమైనవారికి లభించక ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చుక్కలు చూపిస్తోంది. అన్ని జిల్లాల్లో నదుల్లోని ఓపెన్‌ రీచ్‌లలో ఇసుక తవ్వకాలు దాదాపు నిలిపేశారు. నిత్యం అధికంగా ఇసుక తవ్వకాలు జరిగే ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఓపెన్‌ రీచ్‌లన్నీ మూతపడ్డాయి.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకటి రెండు పట్టా భూముల్లోనే తవ్వకాలు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో బోట్స్‌మెన్‌ సొసైటీల ద్వారా కొంత తీస్తున్నారు. ఇసుక టెండరు దక్కించుకున్న జేపీ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌కు మే 1 నుంచి బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. కటాఫ్‌ తేదీ ప్రకటించగానే రీచ్‌లు, నిల్వ కేంద్రాలు, డిపోలు, వాటిలో ఇసుక నిల్వలను ఆ సంస్థకు అప్పగించాలని ఇప్పటికే గనులశాఖ అధికారులు ఆదేశించారు.

సగటున 30 వేల టన్నులలోపే..

నిత్యం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఎవరైనా ఇసుక బుక్‌చేసుకోవచ్చు. కొద్ది రోజుల కిందటి వరకు సగటున నిత్యం 80 వేల నుంచి లక్ష టన్నుల వరకు బుకింగ్‌లు ఉండేవి. కొద్ది రోజులుగా ఇవి 30 వేల టన్నులలోపే ఉంటున్నాయి. రీచ్‌లు అందుబాటులో లేకపోవడం, ఇసుక నిల్వలు కొన్నిచోట్లే ఉన్నట్లు చూపించడంతో ఎక్కువ మంది బుక్‌ చేసుకోవడం లేదు.

సర్వర్‌ వేగం కూడా తగ్గడంతో బుకింగ్‌లు త్వరగా జరగడం లేదని చెబుతున్నారు. ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించేనాటికి, ఏపీఎండీసీ పరిధిలో ఆన్‌లైన్‌లో బుక్‌ అయిన ఇసుకంతా సరఫరా జరిగి, పెండింగ్‌ లేకుండా చూసేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే దీనివల్ల ఇసుక అవసరమైన సామాన్యులకు ఇబ్బందులు తప్పట్లేదు.

అక్రమ రవాణాను నిలువరించేందుకే..

ప్రైవేటు సంస్థకు బాధ్యత అప్పగించేలోపు ప్రస్తుత ఇసుక తవ్వకాలు, రవాణా గుత్తేదారులు చేతివాటం చూపకుండా తవ్వకాలు ఆపేసినట్లు అధికారులు చెబుతున్నారు. పలు జిల్లాల్లో అక్రమాలు సంయుక్త కలెక్టర్ల దృష్టికి రావడంతో.. తాము ఆదేశాలు ఇచ్చేవరకూ ఇసుక తవ్వకాలు చేపట్టవద్దని ఆయా జిల్లాల ఇసుక అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

పొరుగు సిబ్బంది నిరసనలు

ఇసుక రీచ్‌లు, నిల్వకేంద్రాల్లో పనిచేస్తున్న పొరుగుసేవల ఉద్యోగులను ఈ నెలాఖరుతో తొలగిస్తున్నట్లు ఏపీఎండీసీ ఇచ్చిన ఆదేశాలపై.. బుధవారం పలు జిల్లాల్లో పొరుగు సిబ్బంది నిరసనలు తెలిపారు. ఆకస్మికంగా తొలగిస్తే తాము వీధిన పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇస్తామన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 9,716 కరోనా కేసులు, 38 మరణాలు

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) తగిన ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు ప్రస్తుతం ఇసుక అవసరమైనవారికి లభించక ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చుక్కలు చూపిస్తోంది. అన్ని జిల్లాల్లో నదుల్లోని ఓపెన్‌ రీచ్‌లలో ఇసుక తవ్వకాలు దాదాపు నిలిపేశారు. నిత్యం అధికంగా ఇసుక తవ్వకాలు జరిగే ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఓపెన్‌ రీచ్‌లన్నీ మూతపడ్డాయి.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకటి రెండు పట్టా భూముల్లోనే తవ్వకాలు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో బోట్స్‌మెన్‌ సొసైటీల ద్వారా కొంత తీస్తున్నారు. ఇసుక టెండరు దక్కించుకున్న జేపీ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌కు మే 1 నుంచి బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. కటాఫ్‌ తేదీ ప్రకటించగానే రీచ్‌లు, నిల్వ కేంద్రాలు, డిపోలు, వాటిలో ఇసుక నిల్వలను ఆ సంస్థకు అప్పగించాలని ఇప్పటికే గనులశాఖ అధికారులు ఆదేశించారు.

సగటున 30 వేల టన్నులలోపే..

నిత్యం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఎవరైనా ఇసుక బుక్‌చేసుకోవచ్చు. కొద్ది రోజుల కిందటి వరకు సగటున నిత్యం 80 వేల నుంచి లక్ష టన్నుల వరకు బుకింగ్‌లు ఉండేవి. కొద్ది రోజులుగా ఇవి 30 వేల టన్నులలోపే ఉంటున్నాయి. రీచ్‌లు అందుబాటులో లేకపోవడం, ఇసుక నిల్వలు కొన్నిచోట్లే ఉన్నట్లు చూపించడంతో ఎక్కువ మంది బుక్‌ చేసుకోవడం లేదు.

సర్వర్‌ వేగం కూడా తగ్గడంతో బుకింగ్‌లు త్వరగా జరగడం లేదని చెబుతున్నారు. ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించేనాటికి, ఏపీఎండీసీ పరిధిలో ఆన్‌లైన్‌లో బుక్‌ అయిన ఇసుకంతా సరఫరా జరిగి, పెండింగ్‌ లేకుండా చూసేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే దీనివల్ల ఇసుక అవసరమైన సామాన్యులకు ఇబ్బందులు తప్పట్లేదు.

అక్రమ రవాణాను నిలువరించేందుకే..

ప్రైవేటు సంస్థకు బాధ్యత అప్పగించేలోపు ప్రస్తుత ఇసుక తవ్వకాలు, రవాణా గుత్తేదారులు చేతివాటం చూపకుండా తవ్వకాలు ఆపేసినట్లు అధికారులు చెబుతున్నారు. పలు జిల్లాల్లో అక్రమాలు సంయుక్త కలెక్టర్ల దృష్టికి రావడంతో.. తాము ఆదేశాలు ఇచ్చేవరకూ ఇసుక తవ్వకాలు చేపట్టవద్దని ఆయా జిల్లాల ఇసుక అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

పొరుగు సిబ్బంది నిరసనలు

ఇసుక రీచ్‌లు, నిల్వకేంద్రాల్లో పనిచేస్తున్న పొరుగుసేవల ఉద్యోగులను ఈ నెలాఖరుతో తొలగిస్తున్నట్లు ఏపీఎండీసీ ఇచ్చిన ఆదేశాలపై.. బుధవారం పలు జిల్లాల్లో పొరుగు సిబ్బంది నిరసనలు తెలిపారు. ఆకస్మికంగా తొలగిస్తే తాము వీధిన పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇస్తామన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 9,716 కరోనా కేసులు, 38 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.