ETV Bharat / city

నేటి నుంచి మధ్యాహ్నం 12 వరకే ఆర్టీసీ సర్వీసులు

author img

By

Published : May 5, 2021, 7:55 AM IST

రాష్ట్రంలో బుధవారం నుంచి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రజా రవాణాపై ఆంక్షలు అమలు కానున్నాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రజా రవాణా వాహనాలు నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు వంటివి మధ్యాహ్నం తర్వాత నడిపేందుకు అవకాశం ఉండదు. బస్సులు తిరిగేందుకు కేవలం ఆరు గంటలు మాత్రమే సమయం ఉండటంతో ఆర్టీసీ ఆయా జిల్లాల పరిధిలోని, పక్క జిల్లాలకు వెళ్లే సర్వీసులనే నడపనుంది.

మధ్యాహ్నం 12 వరకే ఆర్టీసీ సర్వీసులు
మధ్యాహ్నం 12 వరకే ఆర్టీసీ సర్వీసులు

కర్ఫ్యూ కారణంగా దూర ప్రాంత సర్వీసులు దాదాపు నిలిపేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇప్పటికే 50 శాతం సీట్ల సామర్థ్యంతో నడుపుతుండగా, బుధవారం నుంచి కనీసం 35 శాతం సీట్లలో ప్రయాణికులు నిండితేనే బస్సులు బయలుదేరనున్నాయి. ఓ ప్రాంతానికి వెళ్లే రెండు మూడు సర్వీసులను కలిపి, ఒకే సర్వీసుగా పంపనున్నారు. బస్టాండ్లకు వచ్చే ప్రయాణికుల రద్దీని బట్టి సర్వీసులు నడుపుతామని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు తిరిగే సర్వీసులు అన్నింటినీ నిలిపేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు అన్ని జిల్లా అధికారులకు మంగళవారం ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర సచివాలయ, హైకోర్టు ఉద్యోగుల కోసం నడిపే సర్వీసులు అన్నింటినీ మాత్రం కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ప్రైవేట్‌ బస్సులకు అంతే....

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు సైతం ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు నడిచే సర్వీసులనే తిప్పనున్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించాలంటూ ప్రైవేట్‌ బస్‌ ఆపరేటర్ల సంఘం నేతలు.. అందులోని సభ్యులందరికీ మంగళవారం తెలియజేశారు. ఇప్పటికే ప్రయాణికులు లేక 75-80శాతం సర్వీసులు ఆపేశామని, కర్ఫ్యూతో మిగిలిన సర్వీసులు కూడా దాదాపు నిలిచిపోయే అవకాశం ఉందని బస్సుల యజమానులు పేర్కొంటున్నారు.

సరకు రవాణాకు అనుమతి

నిత్యావసర, ఇతర సరకులు రవాణా చేసే వాహనాలకు కర్ఫ్యూ ఆంక్షలు వర్తించవని, వాటిని యథావిధిగా నడపవచ్చని అధికారులు తెలిపారు. అయితే వాటి లోడింగ్‌, అన్‌లోడింగ్‌ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యానికి చెందిన మందులు, తదితరాలు మాత్రం ఎప్పుడైనా లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఇదీ చదవండీ... నేటి నుంచే కర్ఫ్యూ అమలు.. వాటికి మాత్రమే మినహాయింపు

కర్ఫ్యూ కారణంగా దూర ప్రాంత సర్వీసులు దాదాపు నిలిపేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇప్పటికే 50 శాతం సీట్ల సామర్థ్యంతో నడుపుతుండగా, బుధవారం నుంచి కనీసం 35 శాతం సీట్లలో ప్రయాణికులు నిండితేనే బస్సులు బయలుదేరనున్నాయి. ఓ ప్రాంతానికి వెళ్లే రెండు మూడు సర్వీసులను కలిపి, ఒకే సర్వీసుగా పంపనున్నారు. బస్టాండ్లకు వచ్చే ప్రయాణికుల రద్దీని బట్టి సర్వీసులు నడుపుతామని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు తిరిగే సర్వీసులు అన్నింటినీ నిలిపేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు అన్ని జిల్లా అధికారులకు మంగళవారం ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర సచివాలయ, హైకోర్టు ఉద్యోగుల కోసం నడిపే సర్వీసులు అన్నింటినీ మాత్రం కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ప్రైవేట్‌ బస్సులకు అంతే....

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు సైతం ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు నడిచే సర్వీసులనే తిప్పనున్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించాలంటూ ప్రైవేట్‌ బస్‌ ఆపరేటర్ల సంఘం నేతలు.. అందులోని సభ్యులందరికీ మంగళవారం తెలియజేశారు. ఇప్పటికే ప్రయాణికులు లేక 75-80శాతం సర్వీసులు ఆపేశామని, కర్ఫ్యూతో మిగిలిన సర్వీసులు కూడా దాదాపు నిలిచిపోయే అవకాశం ఉందని బస్సుల యజమానులు పేర్కొంటున్నారు.

సరకు రవాణాకు అనుమతి

నిత్యావసర, ఇతర సరకులు రవాణా చేసే వాహనాలకు కర్ఫ్యూ ఆంక్షలు వర్తించవని, వాటిని యథావిధిగా నడపవచ్చని అధికారులు తెలిపారు. అయితే వాటి లోడింగ్‌, అన్‌లోడింగ్‌ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యానికి చెందిన మందులు, తదితరాలు మాత్రం ఎప్పుడైనా లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఇదీ చదవండీ... నేటి నుంచే కర్ఫ్యూ అమలు.. వాటికి మాత్రమే మినహాయింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.