ETV Bharat / city

గ్రామ సచివాలయాలే రిజిస్ట్రార్‌ కేంద్రాలు: సీఎం జగన్

author img

By

Published : Jan 20, 2021, 7:34 PM IST

Updated : Jan 20, 2021, 7:53 PM IST

వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూ రక్షణ పథకంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. గ్రామ సచివాలయాలను రిజిస్ట్రార్‌ కేంద్రాలుగా మార్చాలని అధికారులను ఆదేశించారు. సర్వేలో భాగంగా మ్యాపుల తయారీలో... పేదల కోసం నిర్మించే కాలనీలనూ పరిగణలోకి తీసుకోవాలని నిర్దేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీని పొడిగిస్తున్నట్లు సీఎం చెప్పారు.

CM JAGAN
CM JAGAN

గ్రామమ సచివాలయాలే రిజిస్ట్రార్‌ కేంద్రాలని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. ఒక గ్రామంలో సమగ్ర భూ సర్వే పూర్తయిన తర్వాత ఆ గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభించాలని ఆదేశించారు. వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకంపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎప్పటికప్పుడు సిబ్బంది సందేహాలను నివృత్తి చేయడానికి నిపుణులు, సీనియర్‌ అధికారులతో కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ప్రస్తుతం ఎక్కడైనా రిజిస్ట్రేషన్‌ చేసుకునే సదుపాయం ఉందన్న సీఎం... భవిష్యత్తులోనూ ఇది కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్వేయరు నుంచి జేసీ వరకూ ఈ ప్రక్రియకు కచ్చితంగా బాధ్యులుగా ఉండాలని అన్నారు. లంచాలకు తావులేని వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నంలో భాగమే సరికొత్త వ్యవస్థలన్న ముఖ్యమంత్రి.. మొబైల్‌ ట్రైబ్యునల్స్‌పైనా ఎస్‌ఓపీలను తయారుచేయాలన్నారు.

సిబ్బందికి శిక్షణ

మరోవైపు సర్వేలో భాగంగా మ్యాపుల తయారీలో... పేదల కోసం నిర్మించే జగనన్న కాలనీలనూ పరిగణలోకి తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. అలాగే కాలనీల్లో ప్రతి ఇంటికీ యూనిక్‌ ఐడీ నంబరు ఇవ్వాలన్నారు. సమగ్ర భూసర్వేపై గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది సమర్థత పెంపు, శిక్షణ పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. మరోవైపు జనవరి 30దాకా ఇళ్ల పట్టాల పంపిణీని పొడిగిస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు.

గ్రామమ సచివాలయాలే రిజిస్ట్రార్‌ కేంద్రాలని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. ఒక గ్రామంలో సమగ్ర భూ సర్వే పూర్తయిన తర్వాత ఆ గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభించాలని ఆదేశించారు. వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకంపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎప్పటికప్పుడు సిబ్బంది సందేహాలను నివృత్తి చేయడానికి నిపుణులు, సీనియర్‌ అధికారులతో కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ప్రస్తుతం ఎక్కడైనా రిజిస్ట్రేషన్‌ చేసుకునే సదుపాయం ఉందన్న సీఎం... భవిష్యత్తులోనూ ఇది కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్వేయరు నుంచి జేసీ వరకూ ఈ ప్రక్రియకు కచ్చితంగా బాధ్యులుగా ఉండాలని అన్నారు. లంచాలకు తావులేని వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నంలో భాగమే సరికొత్త వ్యవస్థలన్న ముఖ్యమంత్రి.. మొబైల్‌ ట్రైబ్యునల్స్‌పైనా ఎస్‌ఓపీలను తయారుచేయాలన్నారు.

సిబ్బందికి శిక్షణ

మరోవైపు సర్వేలో భాగంగా మ్యాపుల తయారీలో... పేదల కోసం నిర్మించే జగనన్న కాలనీలనూ పరిగణలోకి తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. అలాగే కాలనీల్లో ప్రతి ఇంటికీ యూనిక్‌ ఐడీ నంబరు ఇవ్వాలన్నారు. సమగ్ర భూసర్వేపై గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది సమర్థత పెంపు, శిక్షణ పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. మరోవైపు జనవరి 30దాకా ఇళ్ల పట్టాల పంపిణీని పొడిగిస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు.

ఇదీ చదవండి

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ.. ఈనెల 25కి వాయిదా

Last Updated : Jan 20, 2021, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.