ETV Bharat / city

విద్యార్థిని ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్యపై స్పందించిన రాహుల్‌ గాంధీ

ఆర్థిక పరిస్థితులు బాగాలేక చదువు భారమై ఆత్మహత్య చేసుకున్న తెలుగు విద్యార్థిని ఐశ్వర్య రెడ్డి మృతి పట్ల కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ స్పందించారు. విద్యార్థిని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భాజపా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన నోట్ల రద్దు, లాక్​డౌన్ వల్ల అనేక కుటుంబాలు నాశనం అయ్యాయంటూ ట్వీట్ చేశారు.

author img

By

Published : Nov 10, 2020, 1:08 AM IST

Updated : Nov 10, 2020, 1:24 AM IST

rahul-gandhi-
rahul-gandhi-

ఆర్థిక పరిస్థితులు సరిగా లేక.. చదువుకు భారమై రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లోని ఫరూక్​ నగర్​కు చెందిన ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్య చేసుకుంది. దిల్లీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్​ చదువుతున్న విద్యార్థిని మృతిపట్ల కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

  • ఈ అత్యంత విచారకరమైన సమయంలో ఈ విద్యార్థిని కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం తెలుపుతున్నాను.

    ఉద్దేశ పూర్వకంగా చేసిన నోట్ల రద్దు మరియు లాక్డౌన్ ద్వారా, బీజేపి ప్రభుత్వం లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసింది.

    ఇది నిజం! ఇదే నిజం!! pic.twitter.com/mSszEES6ha

    — Rahul Gandhi (@RahulGandhi) November 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఈ అత్యంత విచారకరమైన సమయంలో ఈ విద్యార్థిని కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. ఉద్దేశపూర్వకంగా చేసిన నోట్ల రద్దు, లాక్​డౌన్​ ద్వారా.. భాజపా ప్రభుత్వం లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసింది." అని రాహుల్​ గాంధీ ట్వీట్​ చేశారు.

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ పట్టణంలోని ఫరూక్​నగర్​లో నివాసం ఉండే మెకానిక్ శ్రీనివాసరెడ్డి, సుమతిల కుమార్తె ఐశ్వర్య రెడ్డి. ఇంటర్మీడియట్​లో రాష్ట్రస్థాయి ర్యాంకును సాధించి దిల్లీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్​లో సీటు సాధించింది. అగ్రవర్ణ విద్యార్థి కావడం వల్ల ప్రభుత్వపరంగా ఆర్థిక సహకారం లేకపోవడంతో హాస్టల్​లో ఉండి చదవడం పెనుభారంగా మారింది. మానసికంగా బాధపడిన ఆమె.. ఈ నెల 3న ఇంట్లోనే ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సంబంధిత కథనం:

విద్యార్థిని ఆత్మహత్య... ఆర్థిక పరిస్థితులే కారణం

ఆర్థిక పరిస్థితులు సరిగా లేక.. చదువుకు భారమై రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లోని ఫరూక్​ నగర్​కు చెందిన ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్య చేసుకుంది. దిల్లీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్​ చదువుతున్న విద్యార్థిని మృతిపట్ల కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

  • ఈ అత్యంత విచారకరమైన సమయంలో ఈ విద్యార్థిని కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం తెలుపుతున్నాను.

    ఉద్దేశ పూర్వకంగా చేసిన నోట్ల రద్దు మరియు లాక్డౌన్ ద్వారా, బీజేపి ప్రభుత్వం లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసింది.

    ఇది నిజం! ఇదే నిజం!! pic.twitter.com/mSszEES6ha

    — Rahul Gandhi (@RahulGandhi) November 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఈ అత్యంత విచారకరమైన సమయంలో ఈ విద్యార్థిని కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. ఉద్దేశపూర్వకంగా చేసిన నోట్ల రద్దు, లాక్​డౌన్​ ద్వారా.. భాజపా ప్రభుత్వం లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసింది." అని రాహుల్​ గాంధీ ట్వీట్​ చేశారు.

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ పట్టణంలోని ఫరూక్​నగర్​లో నివాసం ఉండే మెకానిక్ శ్రీనివాసరెడ్డి, సుమతిల కుమార్తె ఐశ్వర్య రెడ్డి. ఇంటర్మీడియట్​లో రాష్ట్రస్థాయి ర్యాంకును సాధించి దిల్లీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్​లో సీటు సాధించింది. అగ్రవర్ణ విద్యార్థి కావడం వల్ల ప్రభుత్వపరంగా ఆర్థిక సహకారం లేకపోవడంతో హాస్టల్​లో ఉండి చదవడం పెనుభారంగా మారింది. మానసికంగా బాధపడిన ఆమె.. ఈ నెల 3న ఇంట్లోనే ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సంబంధిత కథనం:

విద్యార్థిని ఆత్మహత్య... ఆర్థిక పరిస్థితులే కారణం

Last Updated : Nov 10, 2020, 1:24 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.