ETV Bharat / city

త్వరలో పోలవరానికి రూ.2,234.87 కోట్లు

author img

By

Published : Oct 3, 2020, 6:49 AM IST

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో రూ.2,234.87 కోట్లు వచ్చేందుకు మార్గం సుగమం అవుతోంది. ఈ నిధుల విడుదలకు వీలుగా దస్త్రంపై కేంద్ర జలశక్తి మంత్రి సంతకం చేసి ఆర్థికశాఖకు పంపారు. అక్కడ ఆమోదం పొందాక నాబార్డు నుంచి నిధులు విడుదలవుతాయి. అక్కడినుంచి జాతీయ జల అభివృద్ధి సంస్థ తర్వాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ, అక్కడి నుంచి రాష్ట్రానికి ఈ నిధులు చేరతాయి.

polavaram
polavaram

పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్రం ఇప్పటికే ఖర్చు చేసిన దాదాపు రూ.4,006.43 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఈ ఏడాదిలో ఇంతవరకూ కేంద్రం నుంచి ఏమీ రాలేదు. అసలే కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్నాయి. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా రాష్ట్రం నిధులు ఖర్చు చేసిన తర్వాతే కేంద్రం తిరిగి చెల్లిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తికి చాలాకాలం పడుతోంది.

పోలవరం ప్రాజెక్టుకు 2014లో జాతీయహోదా ప్రకటించినా ఈ నిధుల చెల్లింపునకు అవసరమైన ప్రత్యేక బడ్జెట్‌ హెడ్‌ ఏర్పాటు చేయలేదు. దీనివల్ల ఎప్పటికప్పుడు నాబార్డు రుణం కోసం ప్రతిపాదించి, తర్వాత ఆ మొత్తాన్ని రీయింబర్స్‌ చేయాల్సి వస్తోంది. తొలుత ఆంధ్రప్రదేశ్‌ జలశక్తి శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి బిల్లులు పంపాలి. వారు అక్కడ పరిశీలించి ఆమోదించాక కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు పంపుతారు. అక్కడ ఆమోదం వచ్చాక కేంద్ర ఆర్థికశాఖకు పంపాలి. వారు పరిశీలించి ఆమోదిస్తే నాబార్డుకు వెళ్తుంది. అప్పుడు నాబార్డు మార్కెట్‌ నుంచి రుణ సమీకరణ ప్రారంభిస్తుంది. ఆ మొత్తం జాతీయ జల అభివృద్ధి సంస్థకు చేరుతుంది. అక్కడినుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా ఏపీ ప్రభుత్వానికి రావాలి. ఇందుకోసం ప్రతిసారీ 6-12 నెలల సమయం పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమాన్ని మరింత సరళతరం చేయాలని కేంద్ర అధికారులను కోరారు.

పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక చేసిన ఖర్చు, కేంద్రం నుంచి వచ్చిన నిధుల వివరాలివీ..
* 2014 నుంచి 2020 ఆగస్టు నెలాఖరుకు చేసిన ఖర్చు: రూ.12,513.69 కోట్లు
* ఇంతవరకు కేంద్రం తిరిగి చెల్లించింది: రూ.8,507.26 కోట్లు
* ఇంకా రావాల్సిన మొత్తం: రూ.4006.43 కోట్లు
* ప్రస్తుతం కేంద్ర జలశక్తి మంత్రి ఆమోదించిన మొత్తం: రూ.2,234.87 కోట్లు
* మిగిలిన మొత్తం: రూ.1,771.56 కోట్లు

ఇదీ చదవండి: దీటుగా స్పందిద్దాం...అపెక్స్ కౌన్సిల్ భేటీపై సీఎం నిర్దేశం

పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్రం ఇప్పటికే ఖర్చు చేసిన దాదాపు రూ.4,006.43 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఈ ఏడాదిలో ఇంతవరకూ కేంద్రం నుంచి ఏమీ రాలేదు. అసలే కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్నాయి. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా రాష్ట్రం నిధులు ఖర్చు చేసిన తర్వాతే కేంద్రం తిరిగి చెల్లిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తికి చాలాకాలం పడుతోంది.

పోలవరం ప్రాజెక్టుకు 2014లో జాతీయహోదా ప్రకటించినా ఈ నిధుల చెల్లింపునకు అవసరమైన ప్రత్యేక బడ్జెట్‌ హెడ్‌ ఏర్పాటు చేయలేదు. దీనివల్ల ఎప్పటికప్పుడు నాబార్డు రుణం కోసం ప్రతిపాదించి, తర్వాత ఆ మొత్తాన్ని రీయింబర్స్‌ చేయాల్సి వస్తోంది. తొలుత ఆంధ్రప్రదేశ్‌ జలశక్తి శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి బిల్లులు పంపాలి. వారు అక్కడ పరిశీలించి ఆమోదించాక కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు పంపుతారు. అక్కడ ఆమోదం వచ్చాక కేంద్ర ఆర్థికశాఖకు పంపాలి. వారు పరిశీలించి ఆమోదిస్తే నాబార్డుకు వెళ్తుంది. అప్పుడు నాబార్డు మార్కెట్‌ నుంచి రుణ సమీకరణ ప్రారంభిస్తుంది. ఆ మొత్తం జాతీయ జల అభివృద్ధి సంస్థకు చేరుతుంది. అక్కడినుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా ఏపీ ప్రభుత్వానికి రావాలి. ఇందుకోసం ప్రతిసారీ 6-12 నెలల సమయం పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమాన్ని మరింత సరళతరం చేయాలని కేంద్ర అధికారులను కోరారు.

పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక చేసిన ఖర్చు, కేంద్రం నుంచి వచ్చిన నిధుల వివరాలివీ..
* 2014 నుంచి 2020 ఆగస్టు నెలాఖరుకు చేసిన ఖర్చు: రూ.12,513.69 కోట్లు
* ఇంతవరకు కేంద్రం తిరిగి చెల్లించింది: రూ.8,507.26 కోట్లు
* ఇంకా రావాల్సిన మొత్తం: రూ.4006.43 కోట్లు
* ప్రస్తుతం కేంద్ర జలశక్తి మంత్రి ఆమోదించిన మొత్తం: రూ.2,234.87 కోట్లు
* మిగిలిన మొత్తం: రూ.1,771.56 కోట్లు

ఇదీ చదవండి: దీటుగా స్పందిద్దాం...అపెక్స్ కౌన్సిల్ భేటీపై సీఎం నిర్దేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.