రాజధాని అమరావతిలో ప్రస్తుత ప్రణాళికల ప్రకారం అభివృద్ధి కార్యక్రమాల్ని కొనసాగించేలా రాష్ట్రప్రభుత్వాన్ని , సీఆర్డీఏ అధికారుల్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది . రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి డి . రామారావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రాజధాని ప్రణాళికలను పునఃసమీక్షించి సిఫారసులు చేసేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి జి.ఎన్. రావు సారథ్యంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి సంబంధించిన జీవో 585ను రద్దు చేయాలని కోరారు. మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా రాజధాని పనుల్ని కొనసాగించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్డీఏ ఛైర్మన్, కమిషనర్ను ఆదేశిస్తూ మద్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా వ్యవహరించకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు.
ఇదీ చదవండి : విద్యుత్ బకాయిలు సకాలంలో చెల్లించాలి:సీఎస్