ETV Bharat / city

కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ తొలగింపునకు రంగం సిద్ధం.. త్వరలోనే ఆదేశాలు..!

author img

By

Published : Jul 13, 2022, 8:00 AM IST

అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ కె.ప్రకాశ్​పై గతంలో నమోదైన కేసుల్లో తాజాగా శాఖాపరమైన విచారణ జరిపినట్లు అధికారులు వెల్లడించారు. అభియోగాలు రుజువయ్యాయంటూ చర్యలకు సిద్ధమై నోటీసులు జారీ చేశారు. ప్రకాశ్​ను ఉద్యోగం నుంచి తొలగించేందుకు త్వరలోనే ఆదేశాలు జారీ కానున్నాయని కొందరు చెబుతున్నారు.

Constable
కానిస్టేబుల్‌

అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ కె.ప్రకాశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైంది. గార్లెదిన్నెకు చెందిన ఓ వివాహితను పెళ్లి పేరుతో మోసగించి ఆమె నుంచి డబ్బు, బంగారం కాజేశారన్న ఆరోపణలపై 2019 జులైలో గార్లెదిన్నె పోలీసుస్టేషన్‌లో నమోదైన ఓ కేసుకు సంబంధించి ఈ ఏడాది జూన్‌ 17న శాఖాపరమైన విచారణ (ఓఈ) నిర్వహించిన పోలీసు అధికారులు అభియోగం రుజువైందంటూ తాజాగా ప్రకాశ్‌కు నోటీసు ఇచ్చారు. 2014లో కదిరిలో నమోదైన మరో కేసులోనూ గత నెల 18, 19 తేదీల్లో శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఈ ఘటనలోనూ అభియోగాలు రుజువయ్యాయని చర్యలకు సిఫార్సు చేశారు. వీటి ఆధారంగా అతన్ని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో ఆదేశాలు జారీకానున్నట్లు తెలిసింది.

సీఎం ముందు ప్లకార్డుతో ప్రదర్శన: సీఎం జగన్‌ జూన్‌ 14న సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అనంతపురం పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాశ్‌.. ‘సరెండర్‌ లీవులు, అదనపు సరెండర్‌ల లీవుల సొమ్ములు ఇప్పించండి.. సీఎం సార్‌ ప్లీజ్‌’ అన్న ప్లకార్డును ప్రదర్శించి నిరసన తెలిపారు. ఆ తర్వాత నుంచే అతనిపై వేధింపులు పెరిగాయని, ప్రతి కదలికపై నిఘా పెట్టారని ప్రకాశ్‌ సంబంధీకులు ఆరోపిస్తున్నారు. అతని వ్యక్తిత్వాన్ని హననం చేసేలా దుష్ప్రచారం చేస్తున్నారని, పాత కేసుల్ని తెరపైకి తెస్తున్నారని చెబుతున్నారు.

బ్యాంకు ఖాతాలో లావాదేవీలపై నిఘా: ప్రకాశ్‌ నిరసన తర్వాత.. ఎస్‌ఎల్‌, ఏఎస్‌ఎల్‌ సెలవు బకాయిల సొమ్ములో రూ.15 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసుల్లో చాలామంది అతనికి డబ్బులు పంపించారు. అప్పట్నుంచి పోలీసులు ప్రకాశ్‌ బ్యాంకు లావాదేవీలపై నిఘా పెట్టారు. స్టేట్‌మెంట్‌ను కూడా తీసుకున్నట్లు సమాచారం. స్పెషల్‌ బ్రాంచి పోలీసుల్ని నియమించి నిరంతరం ప్రకాశ్‌ కదలికలు గమనిస్తున్నారు.

ప్రకాశ్‌పై ఆరు క్రిమినల్‌ కేసులు: "కానిస్టేబుల్‌ ప్రకాశ్‌పై ఆరు క్రిమినల్‌ కేసులున్నాయి. మహిళలపై వేధింపులు, అపహరణ, దాడి వంటి తీవ్రమైన అభియోగాలపై ఈ కేసులు నమోదయ్యాయి. వాటిల్లో ఎప్పటి నుంచో విచారణ కొనసాగుతోంది. శాఖాపరమైన విచారణ నుంచి తప్పించుకోవటానికే సామాజిక మాధ్యమాల్ని అడ్డం పెట్టుకుని ప్రకాశ్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన్ను ఎవరూ వేధించలేదు. విచారణలో ఇప్పటికే రెండు కేసుల్లో అభియోగాలు రుజువయ్యాయి. వాటిల్లో చట్టప్రకారంగానే చర్యలు తీసుకుంటాం."- కె.ఫక్కీరప్ప, ఎస్పీ, అనంతపురం


ఇవీ చదవండి:

అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ కె.ప్రకాశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైంది. గార్లెదిన్నెకు చెందిన ఓ వివాహితను పెళ్లి పేరుతో మోసగించి ఆమె నుంచి డబ్బు, బంగారం కాజేశారన్న ఆరోపణలపై 2019 జులైలో గార్లెదిన్నె పోలీసుస్టేషన్‌లో నమోదైన ఓ కేసుకు సంబంధించి ఈ ఏడాది జూన్‌ 17న శాఖాపరమైన విచారణ (ఓఈ) నిర్వహించిన పోలీసు అధికారులు అభియోగం రుజువైందంటూ తాజాగా ప్రకాశ్‌కు నోటీసు ఇచ్చారు. 2014లో కదిరిలో నమోదైన మరో కేసులోనూ గత నెల 18, 19 తేదీల్లో శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఈ ఘటనలోనూ అభియోగాలు రుజువయ్యాయని చర్యలకు సిఫార్సు చేశారు. వీటి ఆధారంగా అతన్ని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో ఆదేశాలు జారీకానున్నట్లు తెలిసింది.

సీఎం ముందు ప్లకార్డుతో ప్రదర్శన: సీఎం జగన్‌ జూన్‌ 14న సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అనంతపురం పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాశ్‌.. ‘సరెండర్‌ లీవులు, అదనపు సరెండర్‌ల లీవుల సొమ్ములు ఇప్పించండి.. సీఎం సార్‌ ప్లీజ్‌’ అన్న ప్లకార్డును ప్రదర్శించి నిరసన తెలిపారు. ఆ తర్వాత నుంచే అతనిపై వేధింపులు పెరిగాయని, ప్రతి కదలికపై నిఘా పెట్టారని ప్రకాశ్‌ సంబంధీకులు ఆరోపిస్తున్నారు. అతని వ్యక్తిత్వాన్ని హననం చేసేలా దుష్ప్రచారం చేస్తున్నారని, పాత కేసుల్ని తెరపైకి తెస్తున్నారని చెబుతున్నారు.

బ్యాంకు ఖాతాలో లావాదేవీలపై నిఘా: ప్రకాశ్‌ నిరసన తర్వాత.. ఎస్‌ఎల్‌, ఏఎస్‌ఎల్‌ సెలవు బకాయిల సొమ్ములో రూ.15 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసుల్లో చాలామంది అతనికి డబ్బులు పంపించారు. అప్పట్నుంచి పోలీసులు ప్రకాశ్‌ బ్యాంకు లావాదేవీలపై నిఘా పెట్టారు. స్టేట్‌మెంట్‌ను కూడా తీసుకున్నట్లు సమాచారం. స్పెషల్‌ బ్రాంచి పోలీసుల్ని నియమించి నిరంతరం ప్రకాశ్‌ కదలికలు గమనిస్తున్నారు.

ప్రకాశ్‌పై ఆరు క్రిమినల్‌ కేసులు: "కానిస్టేబుల్‌ ప్రకాశ్‌పై ఆరు క్రిమినల్‌ కేసులున్నాయి. మహిళలపై వేధింపులు, అపహరణ, దాడి వంటి తీవ్రమైన అభియోగాలపై ఈ కేసులు నమోదయ్యాయి. వాటిల్లో ఎప్పటి నుంచో విచారణ కొనసాగుతోంది. శాఖాపరమైన విచారణ నుంచి తప్పించుకోవటానికే సామాజిక మాధ్యమాల్ని అడ్డం పెట్టుకుని ప్రకాశ్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన్ను ఎవరూ వేధించలేదు. విచారణలో ఇప్పటికే రెండు కేసుల్లో అభియోగాలు రుజువయ్యాయి. వాటిల్లో చట్టప్రకారంగానే చర్యలు తీసుకుంటాం."- కె.ఫక్కీరప్ప, ఎస్పీ, అనంతపురం


ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.