ETV Bharat / city

ప్రాజెక్ట్‌ మదద్‌.. కరోనా పల్లెలకు అండగా ప్రవాసులు - projet madad

కరోనా రెండో దశ భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య అదే రీతిలో నమోదవుతోంది. దీనికి తోడు కొవిడ్‌ నిర్ధరణ పరీక్షల సంఖ్య తగ్గడం ఇంకా ఆందోళనను కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి న్యూయార్క్‌లో నివసించే ప్రవాస వైద్యులు 'ప్రాజెక్ట్‌ మదద్‌' పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ఇరు తెలుగు రాష్ట్రాల పల్లెల్లోని కరోనా బాధితులకు చికిత్స ఎలా అందించాలనే అంశంపై ఆర్‌ఎంపీలు, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ అందిస్తున్నారు.

Project madhad
ప్రాజెక్ట్‌ మదద్‌
author img

By

Published : May 24, 2021, 10:22 AM IST

కొవిడ్‌ రెండో దశ గ్రామీణ భారతాన్ని కకావికలం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వినూత్న కార్యచరణతో ముందుకొచ్చారు న్యూయార్క్‌కు చెందిన ప్రవాస భారత వైద్యులు, నిపుణులు. పల్లెల్లో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ‘ప్రాజెక్ట్‌ మదద్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి తెలంగాణ, ఆంధ్ర పల్లెల్లోని ఆర్‌ఎంపీలు, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ అందిస్తున్నారు. కరోనా లక్షణాలను గుర్తించడం, తేలికపాటి కేసులకు ఇంటివద్దే చికిత్స అందించడం, టీకాపై సలహాలు, ఓవర్‌ మెడికేషన్‌ ప్రమాదాలు, ఇతర ఉత్తమ పద్ధతులను రోగులకు వివరించడంలో వారికి ‘మదద్‌’ వైద్య బృందం తోడ్పడుతోంది.

ఆర్‌ఎంపీలే కేంద్రంగా...

స్థానిక పరిస్థితులు, ప్రజల ఆరోగ్యంపై ఆర్‌ఎంపీలకు సరైన అవగాహన ఉంటుందనే భావనతో వారి కేంద్రంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. టీకాల సేకరణ, ప్రజలకు మాస్కులు, ఆక్సీమీటర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల సరఫరాపై ఆర్‌ఎంపీలకు స్థానిక భాషల్లో సమాచారం అందించడానికి ‘మదద్‌’ కృషిచేస్తోంది. వారానికి రెండుసార్లు వారితో అన్ని రకాల వైద్య నిపుణులు జూమ్‌లో సమావేశమై చికిత్సలో అనుమానాలను నివృత్తిచేస్తున్నారు.‘‘ తెలంగాణలోని కరీంనగర్‌లో సుమారు 80 శాతం కేసులు.. పల్లె ప్రాంతాల నుంచే వస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి. అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం’’ అని ప్రాజెక్ట్‌ సారథి రాజా కార్తికేయ అన్నారు.

అనుభవాల నుంచి..

ఏడాది కాలంగా అమెరికాలో కరోనా చికిత్సలో చేసిన పొరపాట్లు, నేర్చుకున్న పాఠాలను ఇక్కడి ఆరోగ్య కార్యకర్తలతో పంచుకోవాలనుకుంటున్నట్లు మినియాపొలిస్‌లో ప్రముఖ రేడియాలజీ నిపుణడు డా. సుబ్బారావు ఐనంపూడి తెలిపారు. ‘‘ప్రజల్లో భయాందోళనలను పోగొట్టి, జాగ్రత్తలు తీసుకునేలా ప్రోత్సహించడం ముఖ్యం. తేలికపాటి కేసులు తీవ్రంగా, ఆపై అతి తీవ్రంగా మారడాన్ని అరికట్టడంలో ఆర్‌ఎంపీలకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి పెట్టాం’’ అని ఆయన చెప్పారు.

బృందంలో తెలుగు వెలుగులు

హైదరాబాద్‌లోని విద్యావేత్త దేవీ శోభ చంద్రమౌళి అవగాహన విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. బెంగళూరులోని కైవల్య గుండు.. నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. వైద్యుల బృందంలో డా. రాణి వట్టి, డా. సాయి లక్ష్మి, కాలిఫోర్నియా నుంచి డా. హరిత రాచమల్లు ఉన్నారు.‘‘మదద్‌ ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది. రోగులకు సహాయం చేయడంలో ఆర్‌ఎంపీల్లో విశ్వాసం పెరుగుతోంది.’’ అని యూఏఈలో చార్టెట్‌ అకౌంట్‌ సంస్థను నడుపుతూ ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న బలరామ్‌ రెడ్డి తెలిపారు.

యాప్‌ కూడా..

ఆస్పత్రుల్లో పడకల లభ్యత, అక్కడికి చేరుకునే మార్గంపై రియల్‌ టైమ్‌ సమాచారం అందించడానికి వచ్చే వారం ఓ యాప్‌ను విడుదల చేయనున్నారు. దీనిని వాషింగ్టన్‌లోని డా. రాజేశ్‌ అనుమోలు రూపొందించారు.

‘‘సిసలైన జ్ఞానం కింది స్థాయి వరకూ అందాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజలు ఆస్పత్రులకు వెళ్లాలా వద్దా అని సరైన నిర్ణయం తీసుకోగలరు. ఫలితంగా ఒత్తిడిలో ఉన్న ఆరోగ్య వ్యవస్థకు ఉపశమనం కలగడం సహా నిజంగా అవసరమైనవారికి ఆస్పత్రిలో పడకలు అందుబాటులో ఉంటాయి.’’ - వైద్యురాలు రేవతి తెప్పర్తి, మినియాపొలిస్‌

ఇదీ చదవండి:

'పాజిటివ్‌'తో ప్రయాణం.. పక్కవారికీ ప్రమాదం!

కొవిడ్‌ రెండో దశ గ్రామీణ భారతాన్ని కకావికలం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వినూత్న కార్యచరణతో ముందుకొచ్చారు న్యూయార్క్‌కు చెందిన ప్రవాస భారత వైద్యులు, నిపుణులు. పల్లెల్లో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ‘ప్రాజెక్ట్‌ మదద్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి తెలంగాణ, ఆంధ్ర పల్లెల్లోని ఆర్‌ఎంపీలు, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ అందిస్తున్నారు. కరోనా లక్షణాలను గుర్తించడం, తేలికపాటి కేసులకు ఇంటివద్దే చికిత్స అందించడం, టీకాపై సలహాలు, ఓవర్‌ మెడికేషన్‌ ప్రమాదాలు, ఇతర ఉత్తమ పద్ధతులను రోగులకు వివరించడంలో వారికి ‘మదద్‌’ వైద్య బృందం తోడ్పడుతోంది.

ఆర్‌ఎంపీలే కేంద్రంగా...

స్థానిక పరిస్థితులు, ప్రజల ఆరోగ్యంపై ఆర్‌ఎంపీలకు సరైన అవగాహన ఉంటుందనే భావనతో వారి కేంద్రంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. టీకాల సేకరణ, ప్రజలకు మాస్కులు, ఆక్సీమీటర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల సరఫరాపై ఆర్‌ఎంపీలకు స్థానిక భాషల్లో సమాచారం అందించడానికి ‘మదద్‌’ కృషిచేస్తోంది. వారానికి రెండుసార్లు వారితో అన్ని రకాల వైద్య నిపుణులు జూమ్‌లో సమావేశమై చికిత్సలో అనుమానాలను నివృత్తిచేస్తున్నారు.‘‘ తెలంగాణలోని కరీంనగర్‌లో సుమారు 80 శాతం కేసులు.. పల్లె ప్రాంతాల నుంచే వస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి. అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం’’ అని ప్రాజెక్ట్‌ సారథి రాజా కార్తికేయ అన్నారు.

అనుభవాల నుంచి..

ఏడాది కాలంగా అమెరికాలో కరోనా చికిత్సలో చేసిన పొరపాట్లు, నేర్చుకున్న పాఠాలను ఇక్కడి ఆరోగ్య కార్యకర్తలతో పంచుకోవాలనుకుంటున్నట్లు మినియాపొలిస్‌లో ప్రముఖ రేడియాలజీ నిపుణడు డా. సుబ్బారావు ఐనంపూడి తెలిపారు. ‘‘ప్రజల్లో భయాందోళనలను పోగొట్టి, జాగ్రత్తలు తీసుకునేలా ప్రోత్సహించడం ముఖ్యం. తేలికపాటి కేసులు తీవ్రంగా, ఆపై అతి తీవ్రంగా మారడాన్ని అరికట్టడంలో ఆర్‌ఎంపీలకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి పెట్టాం’’ అని ఆయన చెప్పారు.

బృందంలో తెలుగు వెలుగులు

హైదరాబాద్‌లోని విద్యావేత్త దేవీ శోభ చంద్రమౌళి అవగాహన విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. బెంగళూరులోని కైవల్య గుండు.. నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. వైద్యుల బృందంలో డా. రాణి వట్టి, డా. సాయి లక్ష్మి, కాలిఫోర్నియా నుంచి డా. హరిత రాచమల్లు ఉన్నారు.‘‘మదద్‌ ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది. రోగులకు సహాయం చేయడంలో ఆర్‌ఎంపీల్లో విశ్వాసం పెరుగుతోంది.’’ అని యూఏఈలో చార్టెట్‌ అకౌంట్‌ సంస్థను నడుపుతూ ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న బలరామ్‌ రెడ్డి తెలిపారు.

యాప్‌ కూడా..

ఆస్పత్రుల్లో పడకల లభ్యత, అక్కడికి చేరుకునే మార్గంపై రియల్‌ టైమ్‌ సమాచారం అందించడానికి వచ్చే వారం ఓ యాప్‌ను విడుదల చేయనున్నారు. దీనిని వాషింగ్టన్‌లోని డా. రాజేశ్‌ అనుమోలు రూపొందించారు.

‘‘సిసలైన జ్ఞానం కింది స్థాయి వరకూ అందాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజలు ఆస్పత్రులకు వెళ్లాలా వద్దా అని సరైన నిర్ణయం తీసుకోగలరు. ఫలితంగా ఒత్తిడిలో ఉన్న ఆరోగ్య వ్యవస్థకు ఉపశమనం కలగడం సహా నిజంగా అవసరమైనవారికి ఆస్పత్రిలో పడకలు అందుబాటులో ఉంటాయి.’’ - వైద్యురాలు రేవతి తెప్పర్తి, మినియాపొలిస్‌

ఇదీ చదవండి:

'పాజిటివ్‌'తో ప్రయాణం.. పక్కవారికీ ప్రమాదం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.