ETV Bharat / city

సికింద్రాబాద్​లో సాధారణ పరిస్థితులు.. పట్టాలెక్కిన షెడ్యూల్‌ రైళ్లు

author img

By

Published : Jun 17, 2022, 10:10 PM IST

Agnipath Protests in Secunderabad: 'అగ్నిపథ్​' ఆందోళనలతో రణరంగంలా మారిన తెలంగాణలోని సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్​ నుంచి తరలించారు. స్టేషన్​ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఫలితంగా 9 గంటల సుదీర్ఘ ఉద్రిక్తతల అనంతరం సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో పరిస్థితులు దాదాపు అదుపులోకి వచ్చాయి. ఫలితంగా అధికారులు షెడ్యూల్​ రైళ్లను పునః ప్రారంభించారు. కాకినాడ వెళ్లే రైలు ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌ వద్దకు చేరుకుంది.

పట్టాలెక్కిన షెడ్యూల్‌ రైళ్లు
పట్టాలెక్కిన షెడ్యూల్‌ రైళ్లు

Agnipath Protests in Secunderabad: 'అగ్నిపథ్' ఆందోళనలతో దద్దరిల్లిన సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో రోజంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియామక ప్రక్రియ నిలిపివేసేంత వరకూ ఆందోళన ఆపేదిలేదంటూ తెగేసి చెప్పిన నిరసనకారులు.. రైలు పట్టాలపై బైఠాయించారు. సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు సాధారణ పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్​ బలగాలు ఎంతో శ్రమించాయి. తొలుత నిరసన విరమించాలంటూ రైల్వే అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ యువకులు ససేమిరా అన్నారు. అగ్నిపథ్​ రద్దుపై ఆర్మీ నియామక అధికారి స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు.

10 మంది ప్రతినిధులు వస్తే.. ఆర్మీ నియామక అధికారితో మాట్లాడిస్తామని పోలీసులు తెలిపారు. దీనికి నిరసనకారులు తొలుత అంగీకరించనప్పటికీ.. చర్చోపచర్చలు.. తర్జన భర్జనల తర్వాత అంగీకరించారు. ఆర్మీ నియామక అధికారి తమ వద్దకే వచ్చి చర్చించాలని డిమాండ్ చేయగా.. శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దని పోలీసులు సూచించారు. మరోసారి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా స్టేషన్​ ప్రాంగణంలో పోలీసులు, సీఆర్పీఎఫ్​, ఆర్​పీఎఫ్​ బలగాలను భారీగా మోహరించారు.

పోలీసుల అదుపులో ఆందోళనకారులు..: రైలు పట్టాలపై గంటల కొద్దీ భీష్మించుకు కూర్చున్న అభ్యర్థులు తమ డిమాండ్లపై సానుకూల స్పందన వచ్చే వరకూ కదలబోమంటూ పట్టుపట్టారు. మళ్లీ అసాధారణ పరిస్థితులు తలెత్తకుండా పోలీసు అధికారులు భారీగా మోహరించారు. ఆందోళనకారులకు స్టేషన్​ నుంచి బయటకి తరలించారు. దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సికింద్రాబాద్​ స్టేషన్​ను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. 9 గంటల సుదీర్ఘ ఉద్రిక్తతల తర్వాత సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అధికారులు షెడ్యూల్​ రైళ్లను పునః ప్రారంభించారు. కాకినాడ వెళ్లే రైలు ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌ వద్దకు చేరుకుంది.

ఇవీ చూడండి..

Agnipath Protests in Secunderabad: 'అగ్నిపథ్' ఆందోళనలతో దద్దరిల్లిన సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో రోజంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియామక ప్రక్రియ నిలిపివేసేంత వరకూ ఆందోళన ఆపేదిలేదంటూ తెగేసి చెప్పిన నిరసనకారులు.. రైలు పట్టాలపై బైఠాయించారు. సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు సాధారణ పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్​ బలగాలు ఎంతో శ్రమించాయి. తొలుత నిరసన విరమించాలంటూ రైల్వే అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ యువకులు ససేమిరా అన్నారు. అగ్నిపథ్​ రద్దుపై ఆర్మీ నియామక అధికారి స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు.

10 మంది ప్రతినిధులు వస్తే.. ఆర్మీ నియామక అధికారితో మాట్లాడిస్తామని పోలీసులు తెలిపారు. దీనికి నిరసనకారులు తొలుత అంగీకరించనప్పటికీ.. చర్చోపచర్చలు.. తర్జన భర్జనల తర్వాత అంగీకరించారు. ఆర్మీ నియామక అధికారి తమ వద్దకే వచ్చి చర్చించాలని డిమాండ్ చేయగా.. శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దని పోలీసులు సూచించారు. మరోసారి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా స్టేషన్​ ప్రాంగణంలో పోలీసులు, సీఆర్పీఎఫ్​, ఆర్​పీఎఫ్​ బలగాలను భారీగా మోహరించారు.

పోలీసుల అదుపులో ఆందోళనకారులు..: రైలు పట్టాలపై గంటల కొద్దీ భీష్మించుకు కూర్చున్న అభ్యర్థులు తమ డిమాండ్లపై సానుకూల స్పందన వచ్చే వరకూ కదలబోమంటూ పట్టుపట్టారు. మళ్లీ అసాధారణ పరిస్థితులు తలెత్తకుండా పోలీసు అధికారులు భారీగా మోహరించారు. ఆందోళనకారులకు స్టేషన్​ నుంచి బయటకి తరలించారు. దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సికింద్రాబాద్​ స్టేషన్​ను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. 9 గంటల సుదీర్ఘ ఉద్రిక్తతల తర్వాత సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అధికారులు షెడ్యూల్​ రైళ్లను పునః ప్రారంభించారు. కాకినాడ వెళ్లే రైలు ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌ వద్దకు చేరుకుంది.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.