తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ఓ తాటి చెట్టుపై పిడుగు పడింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. తాటి చెట్టు కాలుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.
ఒక్కసారిగా పెద్ద ఎత్తున లైట్స్ వెలిగించినట్లు వెలుగులు, పెద్ద శబ్ధం వచ్చింది. ఈ క్రమంలో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పిడుగు పడే సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.