మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యపై నిజనిజాలు నిర్థరించేందుకు తెలంగాణ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కోడెల ఆత్మహత్యపై నమోదైన కేసు దర్యాప్తునకు ముగ్గురు ఏసీపీల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఈ బృందం కోడెల ఇంటిని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం కోడెల గన్మెన్, ఇతర సిబ్బందిని విచారించారు. తాజాగా... కోడెల ఆత్మహత్య చేసుకున్న గదిని పోలీసులు సీజ్ చేశారు. దర్యాప్తులో భాగంగా కోడెల శివప్రసాదరావు చరవాణి కాల్ డేటా విశ్లేషిస్తున్నారు.
ఇదీ చదవండి :