ETV Bharat / city

JP NADDA: 'ఆయన పరిపాలనా దక్షత వల్లే.. దేశంలో పేదరికం తగ్గింది'- జేపీ నడ్డా

author img

By

Published : Jun 7, 2022, 8:14 AM IST

JP NADDA: ప్రధాని మోదీ పరిపాలనా దక్షత వల్ల దేశంలో పేదరికం 22% నుంచి 10%కు తగ్గిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. 600 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయని తెలిపారు. 50 కోట్ల మంది భారతీయులకు రూ.10,500 కోట్ల ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్యబీమా లభించిందన్నారు.

jp nadda
దేశంలో పేదరికం తగ్గింది

JP NADDA: ప్రధాని మోదీ పరిపాలనా దక్షత వల్ల దేశంలో పేదరికం 22% నుంచి 10%కు తగ్గిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. విజయవాడలో సోమవారం రాత్రి జరిగిన పార్టీ మేధావుల సభనుద్దేశించి మాట్లాడుతూ ఎగుమతులు రికార్డుస్థాయిలో పెరిగాయన్నారు. 600 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయని తెలిపారు. 50 కోట్ల మంది భారతీయులకు రూ.10,500 కోట్ల ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్యబీమా లభించిందన్నారు. ఉక్రెయిన్‌ నుంచి 23వేల మందిని భద్రంగా భారతదేశానికి తెచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, సహ బాధ్యులు సునీల్‌ దేవధర్‌, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, ఇతర నేతలు పాల్గొన్నారు. సమావేశాన్ని మేధావుల విభాగం కన్వీనర్‌ డాక్టర్‌ ముత్తా నవీన్‌ ప్రారంభించారు. చివర్లో పద్మావతి అనే మోదీ అభిమాని బియ్యం గింజలతో రూపొందించిన ప్రధాని చిత్తరువును నడ్డాకు అందచేశారు.

కేంద్ర పథకాలపైనే సాగిన ప్రసంగం

రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగంలో ఇసుమెంతైనా కనిపించలేదు. జాతీయ అధ్యక్ష హోదాలో తొలిసారిగా విజయవాడకు వచ్చినందున రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారని పార్టీ శ్రేణులు ఆశించారు. రాజధాని గురించి కానీ, రాష్ట్రం అప్పుల గురించి, జనసేన అధ్యక్షుడు పవన్‌ పొత్తులపై చేసిన వ్యాఖ్యల గురించి కానీ మాట్లాడకుండా... కేంద్ర పథకాల అమలునే ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆరోగ్యశ్రీ గురించి మాత్రమే నడ్డా మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో కుటుంబ పాలన గురించి విమర్శించారు. నడ్డా హిందీ ప్రసంగాన్ని భాజపా నాయకురాలు పురందేశ్వరి తెలుగులోకి అనువదించారు.

ఇవీ చదవండి:

JP NADDA: ప్రధాని మోదీ పరిపాలనా దక్షత వల్ల దేశంలో పేదరికం 22% నుంచి 10%కు తగ్గిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. విజయవాడలో సోమవారం రాత్రి జరిగిన పార్టీ మేధావుల సభనుద్దేశించి మాట్లాడుతూ ఎగుమతులు రికార్డుస్థాయిలో పెరిగాయన్నారు. 600 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయని తెలిపారు. 50 కోట్ల మంది భారతీయులకు రూ.10,500 కోట్ల ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్యబీమా లభించిందన్నారు. ఉక్రెయిన్‌ నుంచి 23వేల మందిని భద్రంగా భారతదేశానికి తెచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, సహ బాధ్యులు సునీల్‌ దేవధర్‌, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, ఇతర నేతలు పాల్గొన్నారు. సమావేశాన్ని మేధావుల విభాగం కన్వీనర్‌ డాక్టర్‌ ముత్తా నవీన్‌ ప్రారంభించారు. చివర్లో పద్మావతి అనే మోదీ అభిమాని బియ్యం గింజలతో రూపొందించిన ప్రధాని చిత్తరువును నడ్డాకు అందచేశారు.

కేంద్ర పథకాలపైనే సాగిన ప్రసంగం

రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగంలో ఇసుమెంతైనా కనిపించలేదు. జాతీయ అధ్యక్ష హోదాలో తొలిసారిగా విజయవాడకు వచ్చినందున రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారని పార్టీ శ్రేణులు ఆశించారు. రాజధాని గురించి కానీ, రాష్ట్రం అప్పుల గురించి, జనసేన అధ్యక్షుడు పవన్‌ పొత్తులపై చేసిన వ్యాఖ్యల గురించి కానీ మాట్లాడకుండా... కేంద్ర పథకాల అమలునే ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆరోగ్యశ్రీ గురించి మాత్రమే నడ్డా మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో కుటుంబ పాలన గురించి విమర్శించారు. నడ్డా హిందీ ప్రసంగాన్ని భాజపా నాయకురాలు పురందేశ్వరి తెలుగులోకి అనువదించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.