ETV Bharat / city

విధానాలు మార్చకుంటే ప్రజలే తిరగబడతారు: పవన్​ కల్యాణ్​ - pawan kalyan comments on corona outbreak news

రాష్ట్రంలో వైకాపా పాలన కక్ష సాధింపులతోనే ఉందని జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​ విమర్శించారు. కార్పొరేషన్ల నిధులను నవరత్నాల్లో కలిపేస్తున్నారన్న ఆయన.. వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం కరోనా పట్ల తేలికగా తీసుకుంటోందని విమర్శించారు. కరోనా వ్యాప్తి నివారణ పట్ల ప్రభుత్వం చేతులెత్తేసిందని.. ప్రజలే తగు జాగ్రత్తలు తీసుకోవాలని పవన్​ సూచించారు. ఏడాదిలో అప్పులు భారీగా పెరిగాయని.. దీని ద్వారా అభివృద్ధి సాధ్యమంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలు తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దని ముఖ్యమంత్రి జగన్​కు హితవు పలికారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత, రాజకీయ పరిణామాలు, విద్య, వైద్య వ్యవస్థల్లోని గందరగోళం, గాడి తప్పిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి జనసేనాని.. తన అభిప్రాయాలు వెల్లడించారు.

విధానాలు మార్చకుంటే ప్రజలే తిరగబడతారు: పవన్​ కల్యాణ్​
విధానాలు మార్చకుంటే ప్రజలే తిరగబడతారు: పవన్​ కల్యాణ్​
author img

By

Published : Jul 24, 2020, 6:22 PM IST

Updated : Jul 24, 2020, 10:09 PM IST

ప్రభుత్వ విధానాలు మారాలన్న జనసేనాని

ప్రశ్న: వైకాపా అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. ఆ ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏంటి..? పాలన ఎలా ఉంది?

జ. 151 సీట్లు సాధించడం ద్వారా చాలా బలమైన స్థిరత్వం ఇచ్చే శక్తి సమర్ధత ఈ పార్టీ పొందింది. అలా కాకుండా వాళ్లకున్న బలాన్ని రాజకీయ కక్షల కోసమో.. కేవలం కొన్ని గ్రూపుల కోసమో.. ఓటు బ్యాంకు కోసమో.. వినియోగించాల్సిన అవసరం లేదు. ఇది వైకాపాకు భగవంతుడు ఇచ్చిన వరం. దాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదనే నా అభిప్రాయం. 60 కేసులకు పైగా హైకోర్టులో ఆక్షేపణలు ఎదుర్కోవడం గురించి కూడా పరిశీలన చేసుకోవాలి. తప్పులున్నాయని అర్థం చేసుకోవాలి.

ప్రశ్న: రాష్ట్రంలో అప్పులు ప్రమాదకర రీతిలో ఉన్నాయని క్రెడిట్ రేటింగ్ సంస్థలు లెక్కలు చెబుతున్నాయి. దీన్ని మీరెలా విశ్లేషిస్తారు?

జ. సగటు మనిషికి అర్థం అయ్యేలా చెప్పాలంటే మనం సంపాదించే దాని కంటే అప్పులు ఎక్కువ ఉన్నప్పుడు ప్రశాంతత.. సుఖం ఎక్కడ ఉంటుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి. గత ప్రభుత్వంలోనూ ఈ అప్పులు ఉన్నాయి. వీళ్లు ఇంకా ఎక్కువ చేసేశారు. అలా జరగకుండా చూసుకోవాలి. ఆదాయం పెంచే మార్గాలు వెతకాలి తప్ప అప్పులు పెంచే మార్గాలు వెతికి దాన్ని అబివృద్ధి అంటే మనం ఏమీ చేయలేం. అప్పులు తీసుకువచ్చి ప్రజలకు ఇచ్చే పరిస్థితి ఉంటే దీన్ని అభివృద్ధి అనం. తిరోగమనం అనొచ్చు. మిగిలిన నాలుగేళ్లలోనయినా వైకాపా నాయకులు కళ్లు తెరిచి అభివృద్ధి వైపు వెళ్లాలి. రాజకీయ నాయకులు డబ్బు సంపాదించడం కోసం భవిష్యత్ తరాల జీవితాన్ని ఫణంగా పెడుతున్నారు. విద్య, వైద్య వ్యవస్థలు సరిగా ఉండవు. ఉపాధి అవకాశాలు సరిగా రావు. అందువల్లే మనం ఎప్పుడూ అణగారిపోయి ఉంటాం. మనల్ని నడిపే రాజకీయ వ్యవస్థ మాత్రం చాలా బాగుంటుంది.

ప్రశ్న: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు 62 కేసుల్లో హైకోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చాయి..?

జ. పోలీసులు, రెవెన్యూ వ్యవస్థ ఇవన్నీ సమాంతర వ్యవస్థలు, వీరంతా ప్రభుత్వాన్ని ఏ పార్టీ నడిపిస్తుంటే వాళ్లలాగే ప్రవర్తిస్తుంటే దాన్ని కోర్టులు చూస్తూ ఎలా ఊరుకుంటాయి. కోర్టులకు ఇండివిడ్యువాలిటీ ఉంది కాబట్టి ప్రజలకు కష్టం నష్టం వచ్చినప్పుడు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం తన విధానాలు సరి చేసుకోకపోతే మాత్రం చాలా బలమైన ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ప్రజలు ఎదురు తిరగట్లేదు, మాట్లాడటం లేదు అనుకుంటే అది పొరపాటే. బ్లాక్ లైవ్స్ మేటర్ అనేది అమెరికాలో జరిగిన ప్రొటెస్ట్ అగ్రరాజ్యాన్ని కుదిపేసింది. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి గాని కొమ్ము కాస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో అగ్రరాజ్యం అయిన అమెరికాలోనే చూశాం. రాష్ట్ర చరిత్రలో డీజీపీ ఇన్నిసార్లు హైకోర్టుకు వెళ్లడం ఎప్పుడూ జరగలేదు. ఈ పరిస్థితి వచ్చింది అంటే.. రాజకీయ వ్యవస్థ చేసే తప్పులకు ఆయన బలైపోతున్నారు. డాక్టర్లపై కేసులు పెట్టడం, రోడ్ల మీదకు వచ్చి మాట్లాడేసి.. మనకి ఉన్న బలంతో వీటన్నింటినీ సర్దుకుపోవచ్చు గానీ అది క్షేమకరం కాదు.

ప్రశ్న: విద్య, వైద్య రంగాలపై కరోనా ప్రభావం బాగా పడింది. కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే ఆన్​లైన్ తరగతులు ప్రారంభించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత వరకు ఏ కార్యక్రమం ప్రారంభం కాలేదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?

జ. దీనిలో రెండు రకాల సమస్యలు ఉన్నాయి. ఆర్థికంగా బలం ఉన్న స్కూల్స్ అన్​లైన్ క్లాసులు నడుపుతున్నాయి. దాని నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు వేరు. ప్రభుత్వ పాఠశాలల విషయానికి వస్తే ఆన్​లైన్ క్లాసులు నడిపే వ్యవస్థ లేదు. ఒక విద్యా సంవత్సరం పోతుంది అని నాకు అనిపిస్తుంది. ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళికే లేదనిపిస్తోంది. లాక్​డౌన్ సమయంలో విద్యా సంవత్సరం పరిస్థితి ఏమిటి, ఏం చేయాలని ఆలోచన చేసి ఉండాల్సింది. విద్యార్ధులకు ఒక విద్యా సంవత్సరం పోతుందా? లేదా అనేది స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఆన్​లైన్ క్లాసులు నడిపే ప్రైవేటు స్కూళ్లలో కూడా అంతసేపు పిల్లలు కంప్యూటర్లు చూడలేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. స్కూల్స్ తెరిచినపుడు ప్రైవేటు స్కూల్స్​కు బస్సులు అని, మెయింటెనెన్స్ అని ఖర్చులు ఉండేవి. ఇప్పుడు ఏ ఖర్చు లేకుండా అంతంత ఫీజులు ఎందుకు తీసుకుంటున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నా.

ప్రశ్న: కరోనా కారణంగా ఆరోగ్యశాఖ డొల్లతనం బయటపడింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధులు వ్యాధి బారిన పడినప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులకే వెళ్తున్నారు గానీ ప్రభుత్వాసుపత్రికి వెళ్లడం లేదు. ఇటువంటి పరిస్థితిని అదిగమించి.. వైద్యశాఖను బలోపేతం చేయాలి అంటే జనసేన ముందున్న ఆలోచన ఏంటి?

జ. మొదటి నుంచి భారత దేశంలో ఉన్న వైద్య వ్యవస్థను బలోపేతం చేయలేదు. ఇంగ్లండ్​లో ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా పని చేస్తాయో అలాంటి బలమైన విధానాలు తీసుకురావడంలో దశాబ్దాలుగా మనం విఫలమయ్యాం. తెలుగు రాష్ట్రాల సీఎంలకు వైద్య వ్యవస్థను ప్రక్షాళన చేసే బలమైన సమయం ఇది. అలా ప్రక్షాళన జరగాలని నేను కోరుకుంటున్నాను.

ప్రశ్న: కరోనా వంటి మహమ్మారి వ్యాధులు ప్రబలినప్పుడు ప్రభుత్వ బాధ్యత ఎంత ఉంటుందో ప్రజల బాధ్యత కూడా అంతే ఉంటుంది..?

జ. ప్రధాని మోదీ కరోనా లాక్​డౌన్ ప్రకటిస్తున్నామని చెప్పినప్పుడు ప్రజలంతా అర్థం చేసుకున్నారు. నాయకత్వం నిజంగా బలంగా ఉంటే ప్రజలు వింటారు. ఏపీలో తీసుకుంటే చిన్న ఫ్లూ లాంటిది అని తేలికగా తీసుకున్నారు నాయకులు. అదే ఆలోచనా విధానం కింది స్థాయి వరకు వెళ్తుంది. ఇప్పుడు పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అయిపోయింది. ఇన్ని వేల కేసులు రావడానికి ప్రభుత్వం చేపట్టిన విధానాలు ఒక తప్పు. ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు నిబంధనలు పాటించడం లేదు. ప్రజలే బాధ్యత తీసుకుని భౌతిక దూరం పాటిస్తూ సంప్రదాయ మందులు, ఇమ్యూనిటీ బూస్ట్ చేసేవి గానీ వాడుకుంటూ ఎదుర్కోవడానికి మనం సంసిద్ధులం కావాలి. కేవలం ప్రభుత్వాల మీద ఆధారపడితే ఇబ్బందులుంటాయి. అన్ని చోట్ల ప్రభుత్వం చేతులెత్తేసే పరిస్థితి వచ్చేసింది. ప్రజలే తగు జాగ్రత్తలు పాటించాలి.

ప్రశ్న: కాపు కార్పోరేషన్ ఖర్చు పెట్టే నిధుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. కాపులు ఎప్పటి నుంచో కోరుతున్న రిజర్వేషన్ అంశాన్నీ ప్రస్తావించారు. దీని మీద ఇప్పుడేం చెబుతారు?

జ. ముఖ్యంగా ఇందులో నేను చూసేది ఏంటంటే కులంలో ఉన్న ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని ఆసరాగా చేసుకుని కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అన్ని కార్పోరేషన్ల నిధుల గురించి అడిగాం.. అందుకు కారణం ఉంది. పోరాట యాత్రలో భాగంగా అరకు వెళ్లినప్పుడు ఓ యువకుడు కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకువచ్చాడు. ‘మాకు స్కిల్ ఉంది. సబ్ ప్లాన్ నిధులు కేటాయించి సాయం చేస్తే మేం కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మాకు ఆ ఫండ్స్ లేవు. డైవర్ట్ చేసేశారు’ అని చెప్పారు. ఇలాంటి విషయాలను పలు చోట్ల నా దృష్టికి తెచ్చారు. కార్పోరేషన్ ఫండ్స్ అనేది నిర్దేశిత గ్రూపులకే ఇవ్వాలి. వైకాపా ప్రభుత్వ పథకాలకు నిధులు మళ్లించి వాళ్ల నవరత్నాల్లో కలిపేసి.. కాపు కార్పొరేషన్ ఖర్చుల్లో కలిపేయడం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకే మేము శ్వేతపత్రం అడిగాం. కానీ వాళ్లు ఈ రోజుకీ దాని మీద స్పష్టత ఇవ్వలేదు.

కాపు రిజర్వేషన్ల అంశాన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి గారు ఎలాంటి మొహమాటం లేకుండా మేం కాపులకి రిజర్వేషన్లు ఇవ్వం అని చెప్పారు. ప్రజలు ఆయన్ని ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు కూడా మరోసారి అదే మాట - కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదు అని చెబితే అందరికీ స్పష్టత వస్తుంది. ప్రభుత్వం గానీ.. ప్రజా ప్రతినిధులు గానీ ఎన్నికల్లో ఇవ్వం అని చెప్పాం కాబట్టి ఇవ్వడం లేదు అని ఇంకోసారి స్పష్టం చేస్తే బాగుంటుంది. అలాగే కాపు కార్పొరేషన్, ఇతర కార్పొరేషన్ల ఫండ్స్ మీద శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుంది.

ఇదీ చూడండి..

రాజధాని బిల్లులపై న్యాయ సలహా తీసుకుంటున్న గవర్నర్

ప్రభుత్వ విధానాలు మారాలన్న జనసేనాని

ప్రశ్న: వైకాపా అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. ఆ ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏంటి..? పాలన ఎలా ఉంది?

జ. 151 సీట్లు సాధించడం ద్వారా చాలా బలమైన స్థిరత్వం ఇచ్చే శక్తి సమర్ధత ఈ పార్టీ పొందింది. అలా కాకుండా వాళ్లకున్న బలాన్ని రాజకీయ కక్షల కోసమో.. కేవలం కొన్ని గ్రూపుల కోసమో.. ఓటు బ్యాంకు కోసమో.. వినియోగించాల్సిన అవసరం లేదు. ఇది వైకాపాకు భగవంతుడు ఇచ్చిన వరం. దాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదనే నా అభిప్రాయం. 60 కేసులకు పైగా హైకోర్టులో ఆక్షేపణలు ఎదుర్కోవడం గురించి కూడా పరిశీలన చేసుకోవాలి. తప్పులున్నాయని అర్థం చేసుకోవాలి.

ప్రశ్న: రాష్ట్రంలో అప్పులు ప్రమాదకర రీతిలో ఉన్నాయని క్రెడిట్ రేటింగ్ సంస్థలు లెక్కలు చెబుతున్నాయి. దీన్ని మీరెలా విశ్లేషిస్తారు?

జ. సగటు మనిషికి అర్థం అయ్యేలా చెప్పాలంటే మనం సంపాదించే దాని కంటే అప్పులు ఎక్కువ ఉన్నప్పుడు ప్రశాంతత.. సుఖం ఎక్కడ ఉంటుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి. గత ప్రభుత్వంలోనూ ఈ అప్పులు ఉన్నాయి. వీళ్లు ఇంకా ఎక్కువ చేసేశారు. అలా జరగకుండా చూసుకోవాలి. ఆదాయం పెంచే మార్గాలు వెతకాలి తప్ప అప్పులు పెంచే మార్గాలు వెతికి దాన్ని అబివృద్ధి అంటే మనం ఏమీ చేయలేం. అప్పులు తీసుకువచ్చి ప్రజలకు ఇచ్చే పరిస్థితి ఉంటే దీన్ని అభివృద్ధి అనం. తిరోగమనం అనొచ్చు. మిగిలిన నాలుగేళ్లలోనయినా వైకాపా నాయకులు కళ్లు తెరిచి అభివృద్ధి వైపు వెళ్లాలి. రాజకీయ నాయకులు డబ్బు సంపాదించడం కోసం భవిష్యత్ తరాల జీవితాన్ని ఫణంగా పెడుతున్నారు. విద్య, వైద్య వ్యవస్థలు సరిగా ఉండవు. ఉపాధి అవకాశాలు సరిగా రావు. అందువల్లే మనం ఎప్పుడూ అణగారిపోయి ఉంటాం. మనల్ని నడిపే రాజకీయ వ్యవస్థ మాత్రం చాలా బాగుంటుంది.

ప్రశ్న: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు 62 కేసుల్లో హైకోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చాయి..?

జ. పోలీసులు, రెవెన్యూ వ్యవస్థ ఇవన్నీ సమాంతర వ్యవస్థలు, వీరంతా ప్రభుత్వాన్ని ఏ పార్టీ నడిపిస్తుంటే వాళ్లలాగే ప్రవర్తిస్తుంటే దాన్ని కోర్టులు చూస్తూ ఎలా ఊరుకుంటాయి. కోర్టులకు ఇండివిడ్యువాలిటీ ఉంది కాబట్టి ప్రజలకు కష్టం నష్టం వచ్చినప్పుడు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం తన విధానాలు సరి చేసుకోకపోతే మాత్రం చాలా బలమైన ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ప్రజలు ఎదురు తిరగట్లేదు, మాట్లాడటం లేదు అనుకుంటే అది పొరపాటే. బ్లాక్ లైవ్స్ మేటర్ అనేది అమెరికాలో జరిగిన ప్రొటెస్ట్ అగ్రరాజ్యాన్ని కుదిపేసింది. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి గాని కొమ్ము కాస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో అగ్రరాజ్యం అయిన అమెరికాలోనే చూశాం. రాష్ట్ర చరిత్రలో డీజీపీ ఇన్నిసార్లు హైకోర్టుకు వెళ్లడం ఎప్పుడూ జరగలేదు. ఈ పరిస్థితి వచ్చింది అంటే.. రాజకీయ వ్యవస్థ చేసే తప్పులకు ఆయన బలైపోతున్నారు. డాక్టర్లపై కేసులు పెట్టడం, రోడ్ల మీదకు వచ్చి మాట్లాడేసి.. మనకి ఉన్న బలంతో వీటన్నింటినీ సర్దుకుపోవచ్చు గానీ అది క్షేమకరం కాదు.

ప్రశ్న: విద్య, వైద్య రంగాలపై కరోనా ప్రభావం బాగా పడింది. కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే ఆన్​లైన్ తరగతులు ప్రారంభించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత వరకు ఏ కార్యక్రమం ప్రారంభం కాలేదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?

జ. దీనిలో రెండు రకాల సమస్యలు ఉన్నాయి. ఆర్థికంగా బలం ఉన్న స్కూల్స్ అన్​లైన్ క్లాసులు నడుపుతున్నాయి. దాని నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు వేరు. ప్రభుత్వ పాఠశాలల విషయానికి వస్తే ఆన్​లైన్ క్లాసులు నడిపే వ్యవస్థ లేదు. ఒక విద్యా సంవత్సరం పోతుంది అని నాకు అనిపిస్తుంది. ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళికే లేదనిపిస్తోంది. లాక్​డౌన్ సమయంలో విద్యా సంవత్సరం పరిస్థితి ఏమిటి, ఏం చేయాలని ఆలోచన చేసి ఉండాల్సింది. విద్యార్ధులకు ఒక విద్యా సంవత్సరం పోతుందా? లేదా అనేది స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఆన్​లైన్ క్లాసులు నడిపే ప్రైవేటు స్కూళ్లలో కూడా అంతసేపు పిల్లలు కంప్యూటర్లు చూడలేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. స్కూల్స్ తెరిచినపుడు ప్రైవేటు స్కూల్స్​కు బస్సులు అని, మెయింటెనెన్స్ అని ఖర్చులు ఉండేవి. ఇప్పుడు ఏ ఖర్చు లేకుండా అంతంత ఫీజులు ఎందుకు తీసుకుంటున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నా.

ప్రశ్న: కరోనా కారణంగా ఆరోగ్యశాఖ డొల్లతనం బయటపడింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధులు వ్యాధి బారిన పడినప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులకే వెళ్తున్నారు గానీ ప్రభుత్వాసుపత్రికి వెళ్లడం లేదు. ఇటువంటి పరిస్థితిని అదిగమించి.. వైద్యశాఖను బలోపేతం చేయాలి అంటే జనసేన ముందున్న ఆలోచన ఏంటి?

జ. మొదటి నుంచి భారత దేశంలో ఉన్న వైద్య వ్యవస్థను బలోపేతం చేయలేదు. ఇంగ్లండ్​లో ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా పని చేస్తాయో అలాంటి బలమైన విధానాలు తీసుకురావడంలో దశాబ్దాలుగా మనం విఫలమయ్యాం. తెలుగు రాష్ట్రాల సీఎంలకు వైద్య వ్యవస్థను ప్రక్షాళన చేసే బలమైన సమయం ఇది. అలా ప్రక్షాళన జరగాలని నేను కోరుకుంటున్నాను.

ప్రశ్న: కరోనా వంటి మహమ్మారి వ్యాధులు ప్రబలినప్పుడు ప్రభుత్వ బాధ్యత ఎంత ఉంటుందో ప్రజల బాధ్యత కూడా అంతే ఉంటుంది..?

జ. ప్రధాని మోదీ కరోనా లాక్​డౌన్ ప్రకటిస్తున్నామని చెప్పినప్పుడు ప్రజలంతా అర్థం చేసుకున్నారు. నాయకత్వం నిజంగా బలంగా ఉంటే ప్రజలు వింటారు. ఏపీలో తీసుకుంటే చిన్న ఫ్లూ లాంటిది అని తేలికగా తీసుకున్నారు నాయకులు. అదే ఆలోచనా విధానం కింది స్థాయి వరకు వెళ్తుంది. ఇప్పుడు పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అయిపోయింది. ఇన్ని వేల కేసులు రావడానికి ప్రభుత్వం చేపట్టిన విధానాలు ఒక తప్పు. ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు నిబంధనలు పాటించడం లేదు. ప్రజలే బాధ్యత తీసుకుని భౌతిక దూరం పాటిస్తూ సంప్రదాయ మందులు, ఇమ్యూనిటీ బూస్ట్ చేసేవి గానీ వాడుకుంటూ ఎదుర్కోవడానికి మనం సంసిద్ధులం కావాలి. కేవలం ప్రభుత్వాల మీద ఆధారపడితే ఇబ్బందులుంటాయి. అన్ని చోట్ల ప్రభుత్వం చేతులెత్తేసే పరిస్థితి వచ్చేసింది. ప్రజలే తగు జాగ్రత్తలు పాటించాలి.

ప్రశ్న: కాపు కార్పోరేషన్ ఖర్చు పెట్టే నిధుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. కాపులు ఎప్పటి నుంచో కోరుతున్న రిజర్వేషన్ అంశాన్నీ ప్రస్తావించారు. దీని మీద ఇప్పుడేం చెబుతారు?

జ. ముఖ్యంగా ఇందులో నేను చూసేది ఏంటంటే కులంలో ఉన్న ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని ఆసరాగా చేసుకుని కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అన్ని కార్పోరేషన్ల నిధుల గురించి అడిగాం.. అందుకు కారణం ఉంది. పోరాట యాత్రలో భాగంగా అరకు వెళ్లినప్పుడు ఓ యువకుడు కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకువచ్చాడు. ‘మాకు స్కిల్ ఉంది. సబ్ ప్లాన్ నిధులు కేటాయించి సాయం చేస్తే మేం కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మాకు ఆ ఫండ్స్ లేవు. డైవర్ట్ చేసేశారు’ అని చెప్పారు. ఇలాంటి విషయాలను పలు చోట్ల నా దృష్టికి తెచ్చారు. కార్పోరేషన్ ఫండ్స్ అనేది నిర్దేశిత గ్రూపులకే ఇవ్వాలి. వైకాపా ప్రభుత్వ పథకాలకు నిధులు మళ్లించి వాళ్ల నవరత్నాల్లో కలిపేసి.. కాపు కార్పొరేషన్ ఖర్చుల్లో కలిపేయడం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకే మేము శ్వేతపత్రం అడిగాం. కానీ వాళ్లు ఈ రోజుకీ దాని మీద స్పష్టత ఇవ్వలేదు.

కాపు రిజర్వేషన్ల అంశాన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి గారు ఎలాంటి మొహమాటం లేకుండా మేం కాపులకి రిజర్వేషన్లు ఇవ్వం అని చెప్పారు. ప్రజలు ఆయన్ని ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు కూడా మరోసారి అదే మాట - కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదు అని చెబితే అందరికీ స్పష్టత వస్తుంది. ప్రభుత్వం గానీ.. ప్రజా ప్రతినిధులు గానీ ఎన్నికల్లో ఇవ్వం అని చెప్పాం కాబట్టి ఇవ్వడం లేదు అని ఇంకోసారి స్పష్టం చేస్తే బాగుంటుంది. అలాగే కాపు కార్పొరేషన్, ఇతర కార్పొరేషన్ల ఫండ్స్ మీద శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుంది.

ఇదీ చూడండి..

రాజధాని బిల్లులపై న్యాయ సలహా తీసుకుంటున్న గవర్నర్

Last Updated : Jul 24, 2020, 10:09 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.