ETV Bharat / city

పవన్ పర్యటనను అడ్డుకోవాలనుకోవడం హేయమైన చర్య - సీఎం జగన్ పై జనసేన నేత పోతిన మహేష్ ఫైర్

వైకాపా నేతల తీరుపై జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిమ మహేష్ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పర్యటనను వైకాపా నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నించటాన్ని ఖండించారు. ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే పది వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

janasena party leader pothina mahesh
janasena party leader pothina mahesh
author img

By

Published : Dec 5, 2020, 3:23 PM IST

తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శిస్తుంటే వైకాపా నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించటంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతల చర్యను హేయమైన చర్యగా అభివర్ణించారు. సీఎం జగన్ ది ఐరన్ లెగ్ అని... అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కరవు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు వెంటాడుతున్నాయని అన్నారు. వైకాపా పాలనలో అన్నదాతలు, కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆరోపించారు. రైతాంగాన్ని ఆదుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. రైతులపై చిత్తుశుద్ధి ఉంటే తక్షణమే పదివేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శిస్తుంటే వైకాపా నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించటంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతల చర్యను హేయమైన చర్యగా అభివర్ణించారు. సీఎం జగన్ ది ఐరన్ లెగ్ అని... అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కరవు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు వెంటాడుతున్నాయని అన్నారు. వైకాపా పాలనలో అన్నదాతలు, కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆరోపించారు. రైతాంగాన్ని ఆదుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. రైతులపై చిత్తుశుద్ధి ఉంటే తక్షణమే పదివేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

'రైతులను ప్రభుత్వం ఆదుకోకుంటే.. ఈ నెల 7న నిరసన'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.