ETV Bharat / city

జాతీయ పోర్టుపై కేంద్రమంత్రితో.. మంత్రి గౌతంరెడ్డి చర్చ

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన జాతీయ పోర్టుపై కేంద్రమంత్రితో చర్చించినట్లు మంత్రి గౌతంరెడ్డి తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం సహా పలు ప్రతిపాదనలు ఇచ్చామని చెప్పారు.

author img

By

Published : Sep 25, 2019, 7:39 PM IST

కేంద్రమంత్రితో మేకపాటి గౌతం రెడ్డి భేటీ
కేంద్ర మంత్రితో మేకపాటి గౌతం రెడ్డి భేటీ

రాష్ట్రంలో దుగరాజపట్నం పోర్టుకు బదులుగా రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల్లో ఏదో ఒక దానిని జాతీయ పోర్టుగా అభివృద్ధి చేయాలని కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయను కోరినట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి గౌతంరెడ్డి తెలిపారు. రెండు రోజుల దిల్లీ పర్యటనలో భాగంగా తొలి రోజు కేంద్ర ఓడరేవుల మంత్రి మనసుఖ్ మాండవీయాను కలిసిన గౌతంరెడ్డి... జాతీయ పోర్టు, బకింగ్ హామ్ కాలువకు సంబంధించిన అంశాలపై వినతిపత్రం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన జాతీయ పోర్టుపై కేంద్రమంత్రితో చర్చించినట్లు గౌతంరెడ్డి తెలిపారు. గతంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీని కలిసిన సమయంలో పోర్టు విషయంపై అడగగా దుగరాజపట్నంకు బదులుగా ప్రత్యామ్నాయ ప్రాంతాలను సూచించాలని కోరినట్లు ఆయన తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం సహా పలు ప్రతిపాదనలు ఇచ్చామని చెప్పారు. అందులో నివేదికల ఆధారంగా రామాయపట్నం సాధ్యాసాధ్యాలకు అనుకూలంగా ఉందని అధికారులు చెప్పినట్లు మంత్రి వివరించారు. దీనిపై త్వరలోనే అంతర్గత సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు గౌతంరెడ్డి తెలిపారు. బకింగ్ హామ్ కాలువలో జలరవాణపై ప్రతిపాదనలు ఇచ్చి జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరినట్లు గౌతంరెడ్డి తెలిపారు.

కేంద్ర మంత్రితో మేకపాటి గౌతం రెడ్డి భేటీ

రాష్ట్రంలో దుగరాజపట్నం పోర్టుకు బదులుగా రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల్లో ఏదో ఒక దానిని జాతీయ పోర్టుగా అభివృద్ధి చేయాలని కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయను కోరినట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి గౌతంరెడ్డి తెలిపారు. రెండు రోజుల దిల్లీ పర్యటనలో భాగంగా తొలి రోజు కేంద్ర ఓడరేవుల మంత్రి మనసుఖ్ మాండవీయాను కలిసిన గౌతంరెడ్డి... జాతీయ పోర్టు, బకింగ్ హామ్ కాలువకు సంబంధించిన అంశాలపై వినతిపత్రం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన జాతీయ పోర్టుపై కేంద్రమంత్రితో చర్చించినట్లు గౌతంరెడ్డి తెలిపారు. గతంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీని కలిసిన సమయంలో పోర్టు విషయంపై అడగగా దుగరాజపట్నంకు బదులుగా ప్రత్యామ్నాయ ప్రాంతాలను సూచించాలని కోరినట్లు ఆయన తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం సహా పలు ప్రతిపాదనలు ఇచ్చామని చెప్పారు. అందులో నివేదికల ఆధారంగా రామాయపట్నం సాధ్యాసాధ్యాలకు అనుకూలంగా ఉందని అధికారులు చెప్పినట్లు మంత్రి వివరించారు. దీనిపై త్వరలోనే అంతర్గత సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు గౌతంరెడ్డి తెలిపారు. బకింగ్ హామ్ కాలువలో జలరవాణపై ప్రతిపాదనలు ఇచ్చి జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరినట్లు గౌతంరెడ్డి తెలిపారు.

Intro:రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రైతుల యొక్క సంక్షేమ జరిగిందా ముఖ్యమంత్రి ఇ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీకాకుళం జిల్లా పాలకొండ శాసన సభ్యురాలు విశ్వాసం కళావతి పేర్కొన్నారు ఆమె ఆమె గత వారం మార్కెట్ కమిటీ అధ్యక్షురాలుగా తొలిసారిగా అధికారులతో సమావేశం నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ పాలకొండ నియోజకవర్గంలో లో మార్కెట్ కమిటీ సేవలు విస్తృతం చేయాలన్నారు గిరిజన ప్రాంతాల్లో ప్రాంతాల్లో రైతులకు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రకృతి వ్యవసాయం సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండాలన్నారు సమావేశంలో మార్కెటింగ్ శాఖ ఆర్జెడి శ్రీనివాస్ రావు తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు


Body:palakonda


Conclusion:8008574300
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.