ETV Bharat / city

RAPE: బెంగళూరులో రాష్ట్రానికి చెందిన ఐటీ ఉద్యోగినిపై నైజీరియన్ల అత్యాచారం

బెంగుళూరులో రాష్ట్రానికి చెందిన ఐటీ ఉద్యోగినిపై అత్యాచానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఇద్దరు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

author img

By

Published : Sep 4, 2021, 1:56 PM IST

ఐటీ ఉద్యోగినిపై నైజీరియన్ల అత్యాచారం
ఐటీ ఉద్యోగినిపై నైజీరియన్ల అత్యాచారం

రాష్ట్రానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఇద్దరు నైజీరియన్లను బెంగళూరు బాణసవాడి పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి వివరాలను పోలీసులు బయటకు చెప్పలేదు. ఆమెపై దారుణానికి ఒడిగట్టినట్లు రెండు రోజుల కిందట ఫిర్యాదు అందిందని, శుక్రవారం ఆ కేసులో అబుజి ఉబాకా, టోనీలను నిందితులుగా గుర్తించామని దర్యాప్తు అధికారులు వివరించారు.

తనపై అత్యాచారం జరిగిందని బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగుతోంది. నైజీరియన్​ రాయబార కార్యాలయానికి అరెస్టు సమాచారాన్ని పంపినట్లు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

రాష్ట్రానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఇద్దరు నైజీరియన్లను బెంగళూరు బాణసవాడి పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి వివరాలను పోలీసులు బయటకు చెప్పలేదు. ఆమెపై దారుణానికి ఒడిగట్టినట్లు రెండు రోజుల కిందట ఫిర్యాదు అందిందని, శుక్రవారం ఆ కేసులో అబుజి ఉబాకా, టోనీలను నిందితులుగా గుర్తించామని దర్యాప్తు అధికారులు వివరించారు.

తనపై అత్యాచారం జరిగిందని బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగుతోంది. నైజీరియన్​ రాయబార కార్యాలయానికి అరెస్టు సమాచారాన్ని పంపినట్లు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: కృష్ణా జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.