ETV Bharat / city

మద్యం రహిత రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యం: హోంమంత్రి సుచరిత - minister sucharitha on liqour prohibhition news

ఏపీని మద్యం రహిత రాష్ట్రంగా మార్చాలన్నదే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని... హోంమంత్రి మేకతోటి సుచరిత ఉద్ఘాటించారు. జనవరి నుంచి బార్ల నిర్వహణకు కొత్త లైసెన్స్ విధానం వస్తుందన్నారు.

home minister sucharitha on liquor ban in AP
author img

By

Published : Nov 24, 2019, 5:37 PM IST

మద్యం రహిత రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యం: హోంమంత్రి సుచరిత

ఆంధ్రప్రదేశ్​ను మద్యం రహిత రాష్ట్రంగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని... హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా... దశల వారీగా మద్యం నిషేధానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్... ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రంలో దశల వారీగా మద్యనిషేధాన్ని అమలు చేస్తున్నారని వివరించారు. జనవరి నుంచి బార్లకు సంబంధించి కొత్త లైసెన్స్ విధానం వస్తుందన్నారు. మద్యం ధరలు మరింత పెరగనున్నాయని తెలిపారు. మద్యం విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్​గా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఎన్నికైన సందర్భంగా... గుంటూరులో ఆయనను సన్మానించారు.

ఇదీ చదవండి : బతుకు పోరాటం.. తీరం నుంచి దూరం!

మద్యం రహిత రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యం: హోంమంత్రి సుచరిత

ఆంధ్రప్రదేశ్​ను మద్యం రహిత రాష్ట్రంగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని... హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా... దశల వారీగా మద్యం నిషేధానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్... ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రంలో దశల వారీగా మద్యనిషేధాన్ని అమలు చేస్తున్నారని వివరించారు. జనవరి నుంచి బార్లకు సంబంధించి కొత్త లైసెన్స్ విధానం వస్తుందన్నారు. మద్యం ధరలు మరింత పెరగనున్నాయని తెలిపారు. మద్యం విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్​గా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఎన్నికైన సందర్భంగా... గుంటూరులో ఆయనను సన్మానించారు.

ఇదీ చదవండి : బతుకు పోరాటం.. తీరం నుంచి దూరం!

AP_GNT_01_24_HOME_MINISTER_SUCHARITHA_ON_MADYAM_AVB_3067949 REPORTER: P.SURYA RAO CAMERA: ALI ( ) ఆంధ్రప్రదేశ్ ను మద్యరహిత రాష్ట్రంగా మార్చాలన్నదే ప్రభుత్వ ఆశయమని హోంమంత్రి సుచరిత అభిప్రాయపడ్డారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా దశలవారీ మద్యనిషేధానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా భావించిందని...ఫలితంగా చెన్నాపెద్దా వయసుతో సంబంధం లేకుండా మద్యానికి బానిసయ్యారని.. కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయని ఆమె ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి చెందిందో.. అధోగతి పాలైందో అప్పటి పాలకులే చెప్పాలని మంత్రి సుచరిత ఎద్దేవా చేశారు. వ్యక్తుల ఆరోగ్యమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడిన సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రంలో దశల వారిగా మద్యనిషేధాన్ని అమలుచేస్తున్నారని చెప్పారు. జనవరి నుంచి బార్లకు సంబంధించి కొత్త లైసెన్సు విధానం వస్తుందని..మద్యం ధరలు మరింత ప్రియం కానున్నాయని చెప్పారు. మద్యవిమోచన ప్రచార కమిటీ ఛైర్మన్ గా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఎన్నికైన సందర్భంగా గుంటూరు ఆంధ్ర క్రిష్టియన్ కళాశాలలో ఆయనకు సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో హోంమంత్రితోపాటు ఎంపీ రావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే విడదల రజనీ, ఉన్నతవిద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అంబటి లక్ష్మణరావు, తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీపార్వతి తదితరులు పాల్గొన్నారు....BYTE ... BYTE: మేకతోటి సుచరిత, హోంమంత్రి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.