ETV Bharat / city

తెలంగాణ హైకోర్టు : ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల్లో రోజువారీ విచారణ

author img

By

Published : Oct 3, 2020, 4:34 PM IST

Updated : Oct 4, 2020, 4:27 AM IST

High Court has directed that cases against MPs and MLAs be heard on a daily basis
High Court has directed that cases against MPs and MLAs be heard on a daily basis

16:33 October 03

కీలక ఆదేశాలు

ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌ ఉన్న కేసుల రోజువారీ విచారణ చేపట్టాలని ప్రత్యేక న్యాయస్థానాలను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సీబీఐ, ఏసీబీ, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులు సహా ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులకు తెలంగాణ  హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రోజువారీ విచారణ జరపాలని..ప్రత్యేక న్యాయస్థానాలను ఆదేశించింది. తదుపరి సూచనల నిమిత్తం విచారణకు సంబంధించి రోజువారీ నివేదికను రిజిస్ట్రీకి సమర్పించాలని పేర్కొంది.

118 కేసులు పెండింగ్

ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల విచారణ కోసం తెలంగాణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో 118 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ కేసులన్నీ ఐపీసీ, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, రైల్వే, ప్రజాప్రాతినిధ్య చట్టానికి సంబంధించినవి ఉన్నాయి. మనీలాండరింగ్‌, సీబీఐ, ఏసీబీకి సంబంధించిన ప్రత్యేక కోర్టుల్లో 25 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో సగానికిపైగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించినవే కేసులున్నాయి. జగన్‌పై సీబీఐ 11, ఈడీ 5 కేసులు నమోదు చేశాయి. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద జగన్‌పై ఈడీ కేసులు నమోదు చేసింది.  

ప్రతి శనివారం విచారణ

2012లో 4 కేసుల్లో, 2013లో ఆరు, 2014లో మరో కేసులో సీబీఐ అభియోగపత్రం దాఖలుచేసింది. ప్రస్తుతం కొన్ని కేసుల్లో హైకోర్టు స్టేలు మంజూరు చేయగా మిగిలిన సీబీఐ డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్నాయి. వైకాపాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసులు నమోదయ్యాయి. కింది కోర్టుల్లోని కేసులపై ప్రజాప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించి స్టే పొందడంతో అవి పెండింగ్‌లో ఉన్నాయి. ఆ విధంగా  స్టే ఉన్న కేసులు ప్రస్తుతం 14 వరకు ఉన్నత న్యాయస్థానంలో ఉన్నాయి. వాటిని సత్వరం తేల్చాలనే ఉద్దేశంతో ప్రతి శనివారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్​ చౌహాన్‌ స్వయంగా విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.  

సమన్లు అందకపోవడం ఏంటి?

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్లో చాలా వాటిలో సమన్లు జారీ కాలేదంటూ ఓ దిగువ కోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలంగాణ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు హాజరైనవారికి సమన్లు అందకపోవడం ఏంటని ప్రశ్నించిన హైకోర్టు  సమన్లు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించినట్లు తెలిసింది.

ఇదీ చదవండి :  బెజవాడ చిన్నోడు.. డ్యాన్స్​తో ఇరగదీస్తాడు!


 

16:33 October 03

కీలక ఆదేశాలు

ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌ ఉన్న కేసుల రోజువారీ విచారణ చేపట్టాలని ప్రత్యేక న్యాయస్థానాలను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సీబీఐ, ఏసీబీ, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులు సహా ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులకు తెలంగాణ  హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రోజువారీ విచారణ జరపాలని..ప్రత్యేక న్యాయస్థానాలను ఆదేశించింది. తదుపరి సూచనల నిమిత్తం విచారణకు సంబంధించి రోజువారీ నివేదికను రిజిస్ట్రీకి సమర్పించాలని పేర్కొంది.

118 కేసులు పెండింగ్

ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల విచారణ కోసం తెలంగాణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో 118 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ కేసులన్నీ ఐపీసీ, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, రైల్వే, ప్రజాప్రాతినిధ్య చట్టానికి సంబంధించినవి ఉన్నాయి. మనీలాండరింగ్‌, సీబీఐ, ఏసీబీకి సంబంధించిన ప్రత్యేక కోర్టుల్లో 25 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో సగానికిపైగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించినవే కేసులున్నాయి. జగన్‌పై సీబీఐ 11, ఈడీ 5 కేసులు నమోదు చేశాయి. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద జగన్‌పై ఈడీ కేసులు నమోదు చేసింది.  

ప్రతి శనివారం విచారణ

2012లో 4 కేసుల్లో, 2013లో ఆరు, 2014లో మరో కేసులో సీబీఐ అభియోగపత్రం దాఖలుచేసింది. ప్రస్తుతం కొన్ని కేసుల్లో హైకోర్టు స్టేలు మంజూరు చేయగా మిగిలిన సీబీఐ డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్నాయి. వైకాపాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసులు నమోదయ్యాయి. కింది కోర్టుల్లోని కేసులపై ప్రజాప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించి స్టే పొందడంతో అవి పెండింగ్‌లో ఉన్నాయి. ఆ విధంగా  స్టే ఉన్న కేసులు ప్రస్తుతం 14 వరకు ఉన్నత న్యాయస్థానంలో ఉన్నాయి. వాటిని సత్వరం తేల్చాలనే ఉద్దేశంతో ప్రతి శనివారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్​ చౌహాన్‌ స్వయంగా విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.  

సమన్లు అందకపోవడం ఏంటి?

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్లో చాలా వాటిలో సమన్లు జారీ కాలేదంటూ ఓ దిగువ కోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలంగాణ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు హాజరైనవారికి సమన్లు అందకపోవడం ఏంటని ప్రశ్నించిన హైకోర్టు  సమన్లు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించినట్లు తెలిసింది.

ఇదీ చదవండి :  బెజవాడ చిన్నోడు.. డ్యాన్స్​తో ఇరగదీస్తాడు!


 

Last Updated : Oct 4, 2020, 4:27 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.