ETV Bharat / city

గోదావరిలోనూ ఏపీ వాటానే అధికం

author img

By

Published : Jul 10, 2020, 6:00 AM IST

గోదావరిలో లభ్యమయ్యే నికర జలాల్లో తెలంగాణ కంటే తమకే ఎక్కువ వినియోగం ఉందని గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్రం లేఖ రాసింది. ఆ వినియోగం కూడా అధికారికంగా చేపట్టిన ప్రాజెక్టులకేనంటూ స్పష్టం చేసింది. 2014 జనవరిలో ఉమ్మడి రాష్ట్రం అసెంబ్లీకి సమర్పించిన నివేదిక ప్రకారం....గోదావరి బేసిన్‌లోని 1480 టీఎమ్​సీల నికర జలాల్లో.... తమకు 967.14 టీఎమ్​సీల వాటా ఉందని.... తెలంగాణ నివేదించింది. అయితే... ఏపీ ప్రభుత్వం తాజాగా రాసిన లేఖలో తెలంగాణ వాటా 650 టీఎమ్​సీలుగానే పేర్కొంది.

గోదావరిలోనూ ఏపీ వాటానే అధికం
గోదావరిలోనూ ఏపీ వాటానే అధికం

గోదావరిలోనూ ఏపీ వాటానే అధికంగా ఉందంటూ గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్‌ లేఖ రాసింది. 2014 జనవరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో గోదావరి బేసిన్‌లోని 1,480 టీఎంసీల నికర జలాల్లో తెలంగాణకు 967.14 టీఎంసీలు ప్రాజెక్టుల వారీగా నివేదించగా.. తాజాగా ఏపీ రాసిన లేఖలో 650 టీఎంసీలుగానే పేర్కొంది. దీంతో నీటి లభ్యత తక్కువగా ఉండే కృష్ణా బేసిన్‌లోనే కాదు.. ఎక్కువ లభ్యత ఉండే గోదావరిలో కూడా కొత్త వివాదానికి తెరలేపే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రస్తావిస్తూనే.... ఆంధ్రప్రదేశ్‌ అంతర్గత జలవనరుల విభాగం అభిప్రాయాలను ప్రత్యేకంగా పేర్కొంటూ ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌.. బోర్డు సభ్య కార్యదర్శికి లేఖ రాశారు.

నీటి పంపిణీకి ఎలాంటి ఒప్పందం లేదు

గోదావరిలో 1,480 టీఎంసీల నీటి లభ్యత ఉండగా.. 2014 జనవరిలో ఉమ్మడి ఏపీ శాసనసభకు ఇచ్చిన సమాచారంలో 967.14 టీఎంసీల వాటా ఉందని... ఇందులో సాగునీటి ప్రాజెక్టులకు 912.25 టీఎంసీలు..జలవిద్యుత్తు ప్రాజెక్టులకు 54.89 టీఎంసీలని బోర్డు దృష్టికి తెలంగాణ తెచ్చింది. అయితే పునరుత్పత్తి ద్వారా వచ్చే నీటితో కలిపి 1,480 టీఎంసీలుగా అంచనా వేశారని....గోదావరి నీటి పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం జరగలేదని...గోదావరి బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్‌ దిగువన ఉన్నందున తెలంగాణలోని ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ బోర్డు ఆధీనంలో ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. అయితే అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అభిప్రాయం పేరుతో మరో అంశాన్ని చేర్చింది. 2014లో వాప్కోస్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం 75 శాతం నీటి లభ్యత కింద పునరుత్పత్తి ద్వారా లభ్యమయ్యే 70 టీఎంసీలతో కలిపి గోదావరిలో ఉన్నది 1,430 టీఎంసీలేనని తెలిపింది. ఈ విషయాన్ని 2018 జులైలో కేంద్ర జల సంఘం కూడా చెప్పిందని... దీన్ని బట్టి రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రాజెక్టులకు నీటి లభ్యత లేదని తెలిపింది.

కొత్త ప్రాజెక్టుల నివేదికలు ఇవ్వండి

దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ధవళేశ్వరం, పోలవరం ప్రాజెక్టుల కిందనే 776 టీఎంసీల వినియోగం ఉందని... తెలంగాణకు 650 టీఎంసీలని...... రెండు రాష్ట్రాలకు కలిపి 1430 ల టీఎంసీలలో 1426 టీఎంసీల వినియోగం ఉందని పేర్కొంది. ఎగువన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినందున శ్రీరామసాగర్‌, నిజాంసాగర్‌లకు కేటాయింపుల మేరకు నీటి లభ్యత ఉండడం లేదని... ఈ ప్రాజెక్టుల ఆయకట్టు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని రాష్ర్టానికి ఉన్న మొత్తం కేటాయింపుల నుంచి ఈ ప్రాజెక్టుల కోసం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. గోదావరి జలవివాద టైబ్యునల్‌ ప్రకారం శ్రీరామసాగర్‌, నిజాంసాగర్‌లకు నీరొచ్చేలా చూడటానికి మహారాష్ట్ర, కేంద్ర జల వనరుల శాఖకు విన్నవించాలని ఎస్సారెస్పీ దిగువన ప్రధాన గోదావరి నుంచి ఎత్తిపోయడానికి వీల్లేదని....... కొత్త ప్రాజెక్టుల నివేదికలను తెలంగాణ గోదావరి బోర్డుకు ఇవ్వాలని.... గోదావరి ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం మొత్తం కేటాయింపు అంటూ ఏమీ లేదని అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అభిప్రాయంగా ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది.

ఇదీ చదవండి : ఏ2 ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు : చినరాజప్ప

గోదావరిలోనూ ఏపీ వాటానే అధికంగా ఉందంటూ గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్‌ లేఖ రాసింది. 2014 జనవరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో గోదావరి బేసిన్‌లోని 1,480 టీఎంసీల నికర జలాల్లో తెలంగాణకు 967.14 టీఎంసీలు ప్రాజెక్టుల వారీగా నివేదించగా.. తాజాగా ఏపీ రాసిన లేఖలో 650 టీఎంసీలుగానే పేర్కొంది. దీంతో నీటి లభ్యత తక్కువగా ఉండే కృష్ణా బేసిన్‌లోనే కాదు.. ఎక్కువ లభ్యత ఉండే గోదావరిలో కూడా కొత్త వివాదానికి తెరలేపే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రస్తావిస్తూనే.... ఆంధ్రప్రదేశ్‌ అంతర్గత జలవనరుల విభాగం అభిప్రాయాలను ప్రత్యేకంగా పేర్కొంటూ ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌.. బోర్డు సభ్య కార్యదర్శికి లేఖ రాశారు.

నీటి పంపిణీకి ఎలాంటి ఒప్పందం లేదు

గోదావరిలో 1,480 టీఎంసీల నీటి లభ్యత ఉండగా.. 2014 జనవరిలో ఉమ్మడి ఏపీ శాసనసభకు ఇచ్చిన సమాచారంలో 967.14 టీఎంసీల వాటా ఉందని... ఇందులో సాగునీటి ప్రాజెక్టులకు 912.25 టీఎంసీలు..జలవిద్యుత్తు ప్రాజెక్టులకు 54.89 టీఎంసీలని బోర్డు దృష్టికి తెలంగాణ తెచ్చింది. అయితే పునరుత్పత్తి ద్వారా వచ్చే నీటితో కలిపి 1,480 టీఎంసీలుగా అంచనా వేశారని....గోదావరి నీటి పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం జరగలేదని...గోదావరి బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్‌ దిగువన ఉన్నందున తెలంగాణలోని ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ బోర్డు ఆధీనంలో ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. అయితే అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అభిప్రాయం పేరుతో మరో అంశాన్ని చేర్చింది. 2014లో వాప్కోస్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం 75 శాతం నీటి లభ్యత కింద పునరుత్పత్తి ద్వారా లభ్యమయ్యే 70 టీఎంసీలతో కలిపి గోదావరిలో ఉన్నది 1,430 టీఎంసీలేనని తెలిపింది. ఈ విషయాన్ని 2018 జులైలో కేంద్ర జల సంఘం కూడా చెప్పిందని... దీన్ని బట్టి రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రాజెక్టులకు నీటి లభ్యత లేదని తెలిపింది.

కొత్త ప్రాజెక్టుల నివేదికలు ఇవ్వండి

దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ధవళేశ్వరం, పోలవరం ప్రాజెక్టుల కిందనే 776 టీఎంసీల వినియోగం ఉందని... తెలంగాణకు 650 టీఎంసీలని...... రెండు రాష్ట్రాలకు కలిపి 1430 ల టీఎంసీలలో 1426 టీఎంసీల వినియోగం ఉందని పేర్కొంది. ఎగువన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినందున శ్రీరామసాగర్‌, నిజాంసాగర్‌లకు కేటాయింపుల మేరకు నీటి లభ్యత ఉండడం లేదని... ఈ ప్రాజెక్టుల ఆయకట్టు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని రాష్ర్టానికి ఉన్న మొత్తం కేటాయింపుల నుంచి ఈ ప్రాజెక్టుల కోసం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. గోదావరి జలవివాద టైబ్యునల్‌ ప్రకారం శ్రీరామసాగర్‌, నిజాంసాగర్‌లకు నీరొచ్చేలా చూడటానికి మహారాష్ట్ర, కేంద్ర జల వనరుల శాఖకు విన్నవించాలని ఎస్సారెస్పీ దిగువన ప్రధాన గోదావరి నుంచి ఎత్తిపోయడానికి వీల్లేదని....... కొత్త ప్రాజెక్టుల నివేదికలను తెలంగాణ గోదావరి బోర్డుకు ఇవ్వాలని.... గోదావరి ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం మొత్తం కేటాయింపు అంటూ ఏమీ లేదని అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అభిప్రాయంగా ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది.

ఇదీ చదవండి : ఏ2 ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు : చినరాజప్ప

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.