ETV Bharat / city

ఆర్థిక వనరుల సమీకరణకు ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు

author img

By

Published : Aug 28, 2020, 1:34 AM IST

ఆర్థిక వనరుల సమీకరణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్​ను ఏర్పాటు చేసింది. నవరత్నాలు సహా వివిధ ప్రాజెక్టుల కోసం నిధులు అవసరమని భావిస్తున్న ప్రభుత్వం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు
ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు

రాష్ట్రంలో వివిధ శాఖలకు, ప్రాజెక్టులు, పథకాలకు అవసరమైన నిధులు సేకరణ లక్ష్యంగా కొత్త సంస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనేక రంగాల్లో స్థిరమైన అభివృద్ధే లక్ష్యంగా ఏపీఎస్​డీసీ ఏర్పాటు చేస్తునట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వంద శాతం ప్రభుత్వ రంగ సంస్థగా ఏపీఎస్​డీసీని ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టంచేసింది.

ఒక్కో వాటా రూ.10

రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్టులు, కార్యకలాపాలకు ప్రణాళిక, నిధులు, పెట్టుబడులపై ఈ సంస్థ దృష్టి సారించనుంది. వివిధ పన్నుల వసూళ్లతో పాటు వాటి పెంపు ద్వారా ఏపీఎస్​డీసీకి నిధులు సమకుర్చనున్నారు. ప్రాథమికంగా యాభై వేల ఈక్విటీ వాటాలతో సంస్థను ఏర్పాటుచేయనున్నారు. ఒక్కో వాటా ధర రూ.10 నిర్ణయించారు. ఆరుగురు సభ్యులతో ఏపీఎస్​డీసీ బోర్డు ఏర్పాటుచేస్తూ ఆదేశాలు జారీచేశారు.

సీఎస్ ఛైర్ పర్సన్​

బోర్డు ఛైర్ పర్సన్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వీసీ, ఎండీగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్​లుగా రెవెన్యూ, మైన్స్, ఇద్దరు ఆర్థిక శాఖ కార్యదర్శులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆడిట్ కమిటీ, క్రెడిట్ కమిటీ, ఇన్వెస్ట్​మెంట్ కమిటీ, రిస్క్ మేనేజ్​మెంట్ కమిటీతో పాటు ఇతర కమిటీలు ఏర్పాటు చేయాలని బోర్డుకి ఆదేశాలు జారీచేశారు.

ఇదీ చదవండి : కరోనా పరీక్షలు పెంచడం వల్లే ఎక్కువగా కేసులు: మంత్రి బొత్స

రాష్ట్రంలో వివిధ శాఖలకు, ప్రాజెక్టులు, పథకాలకు అవసరమైన నిధులు సేకరణ లక్ష్యంగా కొత్త సంస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనేక రంగాల్లో స్థిరమైన అభివృద్ధే లక్ష్యంగా ఏపీఎస్​డీసీ ఏర్పాటు చేస్తునట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వంద శాతం ప్రభుత్వ రంగ సంస్థగా ఏపీఎస్​డీసీని ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టంచేసింది.

ఒక్కో వాటా రూ.10

రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్టులు, కార్యకలాపాలకు ప్రణాళిక, నిధులు, పెట్టుబడులపై ఈ సంస్థ దృష్టి సారించనుంది. వివిధ పన్నుల వసూళ్లతో పాటు వాటి పెంపు ద్వారా ఏపీఎస్​డీసీకి నిధులు సమకుర్చనున్నారు. ప్రాథమికంగా యాభై వేల ఈక్విటీ వాటాలతో సంస్థను ఏర్పాటుచేయనున్నారు. ఒక్కో వాటా ధర రూ.10 నిర్ణయించారు. ఆరుగురు సభ్యులతో ఏపీఎస్​డీసీ బోర్డు ఏర్పాటుచేస్తూ ఆదేశాలు జారీచేశారు.

సీఎస్ ఛైర్ పర్సన్​

బోర్డు ఛైర్ పర్సన్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వీసీ, ఎండీగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్​లుగా రెవెన్యూ, మైన్స్, ఇద్దరు ఆర్థిక శాఖ కార్యదర్శులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆడిట్ కమిటీ, క్రెడిట్ కమిటీ, ఇన్వెస్ట్​మెంట్ కమిటీ, రిస్క్ మేనేజ్​మెంట్ కమిటీతో పాటు ఇతర కమిటీలు ఏర్పాటు చేయాలని బోర్డుకి ఆదేశాలు జారీచేశారు.

ఇదీ చదవండి : కరోనా పరీక్షలు పెంచడం వల్లే ఎక్కువగా కేసులు: మంత్రి బొత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.