ETV Bharat / city

మంటలు చెలరేగి 4 స్కూలు బస్సులు దగ్ధం - సిద్దిపేటలో అగ్నిప్రమాదం నాలుగు బస్సులు దగ్ధం

నిలిపి ఉంచిన బస్సులో మంటలు చెలరేగి 4 బస్సులు దగ్ధమైన ఘటన తెలంగాణలోని సిద్దిపేటలో జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలు ఎలా అంటుకున్నాయన్న విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

four-school-
four-school-
author img

By

Published : Oct 28, 2020, 10:12 PM IST

మంటలు చెలరేగి నాలుగు స్కూలు బస్సులు దగ్ధం

తెలంగాణలోని.. సిద్దిపేట పట్టణంలో అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగు బస్సులు దగ్ధమయ్యాయి. పట్టణంలోని గంగాజల్ వాటర్ ప్లాంట్ సమీపంలో నిలిపిన... బ్రిలియంట్ స్కూల్ బస్సులకు ఎవరో నిప్పు పెట్టారని అనుమానిస్తున్నారు. మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.

గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కరోనాతో కొన్ని నెలలుగా సెలవులు ఉన్నందున.. ఖాళీ స్థలంలో బస్సులు నిలిపారు. ఎవరో ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్​ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఇదీ చూడండి:

ఇంటర్నెట్ కాలింగ్​: ఓవైపు ఉపయోగం.. మరోవైపు దుర్వినియోగం!

మంటలు చెలరేగి నాలుగు స్కూలు బస్సులు దగ్ధం

తెలంగాణలోని.. సిద్దిపేట పట్టణంలో అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగు బస్సులు దగ్ధమయ్యాయి. పట్టణంలోని గంగాజల్ వాటర్ ప్లాంట్ సమీపంలో నిలిపిన... బ్రిలియంట్ స్కూల్ బస్సులకు ఎవరో నిప్పు పెట్టారని అనుమానిస్తున్నారు. మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.

గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కరోనాతో కొన్ని నెలలుగా సెలవులు ఉన్నందున.. ఖాళీ స్థలంలో బస్సులు నిలిపారు. ఎవరో ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్​ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఇదీ చూడండి:

ఇంటర్నెట్ కాలింగ్​: ఓవైపు ఉపయోగం.. మరోవైపు దుర్వినియోగం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.