ETV Bharat / city

'తెలంగాణ సీఎంపై వందకోట్ల పరువు నష్టం దావా' - ముఖ్యమంత్రిపై వివేక్ వెంకటస్వామి పరువునష్టం దావా

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్​పై వంద కోట్ల పరువు నష్టం దావా వేయనున్నట్టు మాజీ ఎంపీ వివేక్వెం కటస్వామి తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల సందర్బంగా హైదరాబాద్​లో దొరికిన డబ్బులు తనవని ధ్రువీకరించడం వల్ల తన ప్రతిష్టకు భంగం కలిగిందన్నారు.

ex-mp-vivek-venkataswamy
ex-mp-vivek-venkataswamy
author img

By

Published : Nov 30, 2020, 10:21 PM IST

దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో దొరికిన డబ్బులు తనవని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్రువీకరిస్తూ ప్రకటన చేశారని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. దొరికిన డబ్బులు ఎవరివో దర్యాప్తు చేయకుండానే కేసు నమోదు చేశారని... దీంతో సమాజంలో తన ప్రతిష్టకు భంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్ అంజనీకుమార్​కు న్యాయవాది ద్వారా నోటీసులు పంపించినట్టు తెలిపారు. వారం రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే... వంద కోట్ల పరువునష్టం దావా వేయనున్నట్టు వెల్లడించారు.

దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో దొరికిన డబ్బులు తనవని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్రువీకరిస్తూ ప్రకటన చేశారని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. దొరికిన డబ్బులు ఎవరివో దర్యాప్తు చేయకుండానే కేసు నమోదు చేశారని... దీంతో సమాజంలో తన ప్రతిష్టకు భంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్ అంజనీకుమార్​కు న్యాయవాది ద్వారా నోటీసులు పంపించినట్టు తెలిపారు. వారం రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే... వంద కోట్ల పరువునష్టం దావా వేయనున్నట్టు వెల్లడించారు.

ఇదీ చూడండి:

డిసెంబరు 14 నుంచి గ్రూప్-1 మెయిన్స్: ఏపీపీఎస్సీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.